GVL Clarity on YSRCP Alliance: టీడీపీ, వైసీపీలకు బీజేపీ ఎప్పటికీ దూరమే.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Clarity on YSRCP Alliance: వైసీపీ, టీడీపీలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎప్పటికీ దూరంగానే ఉంటుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 12న రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటించిన సంగతి తెలిసిందే. విశాఖపట్నం జిల్లాలో దాదాపు పదివేల కోట్లకు పైగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుని మోడీ పేరు అడిగినట్లు ఇటీవల వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఎంపీ జీవీఎల్ నరసింహారావు క్లారిటీ ఇచ్చారు. సోము వీర్రాజుని మోడీ…నీ పేరు ఏంటి ? అని అడిగారు అంటూ వస్తున్న కథనాల్లో వాస్తవం లేదన్నారు. అందరినీ పరిచయం చేసుకోవాలని ప్రధాని కోరడంతో సోము వీర్రాజు అలా ప్రారంభించారన్నారు.
Read Also: Snake in Woman Mouth: మహిళ నోట్లో దూరిన పాము.. వామ్మో.. తీసిన డాక్టరే షాక్
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
విశాఖ రాజకీయ చరిత్రలో ప్రధానికి లభించిన ఆదరణ మరపురాని ఘట్టమని ఎంపీ జీవీఎల్ అన్నారు. ప్రధానిని విశాఖకు రావాలని ఆగస్టులోనే అభ్యర్థించినట్లు తెలిపారు. రైల్వేజోన్ పూర్తి స్థాయి అమలుకు రైల్వే బోర్డు ఆమోదం లభించిందన్న ఆయన పీఎం పర్యటనకు ముందే దశాబ్దాల నాటి కల నెరవేరిందన్నారు. 106 కోట్ల నిధుల విడుదలకు సంబంధించిన ఆదేశాలు విడుదలయ్యాయని, ఇక త్వరిగతిన రైల్వేజోన్ హెడ్ క్వార్టర్స్ నిర్మాణం ప్రారంభం అవుతుందన్నారు. ఇక నేషనల్ ఇంటర్ నెట్ ఎక్స్చేంజ్ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించిందని పేర్కొన్న ఆయన 2023 నాటికి ఇంటర్ నెట్ ఎక్స్చేంజ్ అందుబాటులోకి వస్తుందని అన్నారు. ఇక 2024 వరకు సోము వీర్రాజే బీజేపీ అధ్యక్షుడుగా ఉంటారన్నారు. రాష్ట్రంలో టీడీపీ, వైసీపీ కుటుంబ, అవినీతి పార్టీలని పేర్కొన్నారు. అందుకే ఆ రెండు పార్టీలకు బీజేపీ దూరంగా ఉంటుందని స్పష్టత ఇచ్చారు. ఇక ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
- Tags
- bjp
- GVL Narasimha Rao
- tdp
- YSRCP
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!