BJP Worker: గుజరాత్లో బీజేపీ కార్యకర్త దారుణ హత్య.. బైక్పై వచ్చి కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BJP Worker: గుజరాత్లోని వల్సాద్ జిల్లాలోని వాపి పట్టణానికి సమీపంలో ఉన్న ఆలయం నుండి తన భార్య తిరిగి వచ్చేందుకు ఎస్యూవీ వాహనంలో వేచి ఉన్న స్థానిక బీజేపీ కార్యకర్తను గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం కాల్చి చంపారని పోలీసులు తెలిపారు. మోటర్బైక్పై వచ్చిన దుండగులు కొచర్వా గ్రామంలోని శైలేష్ పటేల్ ఎస్యూవీ సమీపంలోకి వచ్చి అతనిపై మూడు-నాలుగు రౌండ్లు కాల్పులు జరిపారని దుంగరా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు. శైలేష్ పటేల్ బీజేపీ వాపి తాలూకా యూనిట్ వైస్ ప్రెసిడెంట్ అని.. తాలుకా బీజేపీ అధ్యక్షుడు సురేష్ పటేల్ విచారం వ్యక్తం చేస్తూ చెప్పారు. ఆ వ్యక్తి తన భార్యతో కలిసి ప్రార్థనలు చేసేందుకు ఆలయానికి వెళ్లాడని సురేష్ పటేల్ తెలిపారు. ప్రార్థన ముగించుకుని బయటకు వచ్చి భార్య కోసం తన ఎస్యూవీలో వేచి ఉన్నాడు. రెండు మోటర్బైక్లపై నలుగురు దుండగులు సంఘటనా స్థలానికి వచ్చినట్లు కూడా ఆయన పేర్కొన్నారు.
Read Also: Pakistan: జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్
Also Read
- Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
- High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
- Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!
ఉదయం 7.30 గంటల ప్రాంతంలో పటేల్ ఆలయంలో ప్రార్థనలు చేసి తిరిగి వచ్చేందుకు భార్య కోసం వాహనంలో వేచి ఉండగా ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.పటేల్ భార్య తుపాకీ శబ్దం విని వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుంది. అప్పటికే శైలేష్ పటేల్ రక్తపు మడుగులో పడి ఉండడంతో సహాయం కోసం అక్కడి వారిని పిలిచింది. శైలేష్ పటేల్ను వాపిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారని అధికారి తెలిపారు.శైలేష్ పటేల్ మృతితో స్థానిక బీజేపీ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నామని, అనుమానితులను ప్రశ్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతంలోని కొన్ని రహదారులను బ్లాక్ చేసి, దుండగుల కోసం బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Smartphone Tips: పాత ఫోన్లను మూలన పడేస్తున్నారా?.. వైర్లెస్ మౌస్గా మార్చేసే సింపుల్ ట్రిక్
-
High Court Slams FDA: ‘మీరేమైన దేవుడు అనుకుంటున్నారా..?’ ఎఫ్డీఏకు హైకోర్టు షాక్..!
-
Fit India Ambassador: గౌతమ్ గంభీర్కు భావోద్వేగ క్షణం.. కుమార్తె ఆజీన్కు అరుదైన గౌరవం
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
Kiara Advani: ‘టాక్సిక్’ తర్వాత కియారా చేతికి బంపర్ ఆఫర్.. పదేళ్ల తర్వాత వస్తున్న సీక్వెల్లో ఛాన్స్?
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!