Pakistan: జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: జైల్లో ఉన్న 199 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ శుక్రవారం విడుదల చేయనుంది. దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసింది. వారిని శుక్రవారం విడుదల చేసేందుకు పాక్ అధికారులు సుహృద్భావ సంజ్ఞతో ముందుకు సాగాలని భావిస్తున్నారు. 199 మంది మత్స్యకారులను శుక్రవారం విడుదల చేసి స్వదేశానికి పంపించేందుకు సిద్ధం కావాలని సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమకు చెప్పినట్లు సింధ్లోని జైళ్ల, దిద్దుబాటు విభాగంలోని ఉన్నత పోలీసు అధికారి కాజీ నజీర్ తెలిపారు. ఈ మత్స్యకారులను లాహోర్కు పంపి వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఈ మత్స్యకారులు ఇక్కడి లాంధీ జైలులో ఉన్నారు.
మత్స్యకారులతో స్వదేశానికి తరలించాల్సిన భారతీయ పౌర ఖైదీ జుల్ఫికర్ అనారోగ్యం కారణంగా శనివారం కరాచీలోని ఆసుపత్రిలో మరణించాడు. “భారతీయ ఖైదీ తీవ్ర జ్వరం, ఛాతీ సమస్యల గురించి ఫిర్యాదు చేశాడు. అతని పరిస్థితి గత వారం క్షీణించింది కాబట్టి అతన్ని ఆసుపత్రికి పంపారు. అక్కడ అతను ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మరణించాడు” లాంధీ జైలులోని అధికారుల ద్వారా తెలిసింది. భారతీయ మత్స్యకారులను లాహోర్కు సురక్షితంగా తరలించడానికి, జైళ్లలో ఇతర సహాయాన్ని అందించే ఈధి వెల్ఫేర్ ట్రస్ట్ అధికారి మాట్లాడుతూ.. లాంధీ, మలిర్ జైళ్లలో పరిస్థితులు బాగా లేవు. జైళ్లలోని పరిస్థితుల కారణంగా ఆరోగ్యం విషమించి జుల్ఫికర్ మరణించాడని ఆయన తెలిపారు. “జైలు వైద్యులు లేదా ఆసుపత్రి సాధారణంగా తీవ్రమైన అనారోగ్యాలను ఎదుర్కోవటానికి సన్నద్ధం కాదు. రోగిని ఆసుపత్రికి పంపమని సిఫార్సు చేస్తారు, కానీ కొన్నిసార్లు చాలా ఆలస్యం అవుతుంది” అని అధికారి చెప్పారు.
Also Read
- CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
- Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
- Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
- Afghan Women: ‘అమ్మాయి మౌనం పెళ్లికి అంగీకారమే’.. తాలిబన్ కొత్త చట్టంపై ఆగ్రహజ్వాలలు
Read Also: Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద రెండో పేలుడు.. 24 గంటల్లోనే..!
పాకిస్తాన్ ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ప్రకారం, ప్రస్తుతం 631 మంది భారతీయ మత్స్యకారులు, ఒక పౌర ఖైదీ జైలు శిక్షను పూర్తి చేసినప్పటికీ కరాచీలోని లాంధీ, మలిర్ జైళ్లలో ఉన్నారు. గతంలో కూడా కొంతమంది భారతీయ పౌర ఖైదీలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో మరణించారని జైలు అధికారులు తెలిపారు. మొత్తం 654 మంది భారతీయ మత్స్యకారులు కరాచీ జైళ్లలో మగ్గుతుండగా, 83 మంది పాకిస్థానీ మత్స్యకారులు భారతీయ జైళ్లలో ఉన్నట్లు అంచనా. 654 మంది భారతీయ మత్స్యకారులలో 631 మంది శిక్షలు పూర్తి చేసుకుని స్వదేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
-
CM Chandrababu: ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరగాలి.. పారదర్శక పాలనతో ముందుకు వెళ్లాలి..!
-
The Red Bag : రాశీ కీలక పాత్రలో ‘ది రెడ్ బ్యాగ్’
-
Maharashtra: పెళ్లింట తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..
-
Loan: అప్పు ఇచ్చి మర్చిపోవాల్సిందే.. మళ్లీ అడిగారో కాటికే..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!