Pakistan: జైలులో ఉన్న 199 మంది భారత మత్స్యకారులను విడుదల చేయనున్న పాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: జైల్లో ఉన్న 199 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ శుక్రవారం విడుదల చేయనుంది. దేశ జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్నారనే ఆరోపణతో 199 మంది భారతీయ మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసింది. వారిని శుక్రవారం విడుదల చేసేందుకు పాక్ అధికారులు సుహృద్భావ సంజ్ఞతో ముందుకు సాగాలని భావిస్తున్నారు. 199 మంది మత్స్యకారులను శుక్రవారం విడుదల చేసి స్వదేశానికి పంపించేందుకు సిద్ధం కావాలని సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు తమకు చెప్పినట్లు సింధ్లోని జైళ్ల, దిద్దుబాటు విభాగంలోని ఉన్నత పోలీసు అధికారి కాజీ నజీర్ తెలిపారు. ఈ మత్స్యకారులను లాహోర్కు పంపి వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నారు. ప్రస్తుతం ఈ మత్స్యకారులు ఇక్కడి లాంధీ జైలులో ఉన్నారు.
మత్స్యకారులతో స్వదేశానికి తరలించాల్సిన భారతీయ పౌర ఖైదీ జుల్ఫికర్ అనారోగ్యం కారణంగా శనివారం కరాచీలోని ఆసుపత్రిలో మరణించాడు. “భారతీయ ఖైదీ తీవ్ర జ్వరం, ఛాతీ సమస్యల గురించి ఫిర్యాదు చేశాడు. అతని పరిస్థితి గత వారం క్షీణించింది కాబట్టి అతన్ని ఆసుపత్రికి పంపారు. అక్కడ అతను ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మరణించాడు” లాంధీ జైలులోని అధికారుల ద్వారా తెలిసింది. భారతీయ మత్స్యకారులను లాహోర్కు సురక్షితంగా తరలించడానికి, జైళ్లలో ఇతర సహాయాన్ని అందించే ఈధి వెల్ఫేర్ ట్రస్ట్ అధికారి మాట్లాడుతూ.. లాంధీ, మలిర్ జైళ్లలో పరిస్థితులు బాగా లేవు. జైళ్లలోని పరిస్థితుల కారణంగా ఆరోగ్యం విషమించి జుల్ఫికర్ మరణించాడని ఆయన తెలిపారు. “జైలు వైద్యులు లేదా ఆసుపత్రి సాధారణంగా తీవ్రమైన అనారోగ్యాలను ఎదుర్కోవటానికి సన్నద్ధం కాదు. రోగిని ఆసుపత్రికి పంపమని సిఫార్సు చేస్తారు, కానీ కొన్నిసార్లు చాలా ఆలస్యం అవుతుంది” అని అధికారి చెప్పారు.
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
Read Also: Golden Temple: స్వర్ణ దేవాలయం వద్ద రెండో పేలుడు.. 24 గంటల్లోనే..!
పాకిస్తాన్ ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ప్రకారం, ప్రస్తుతం 631 మంది భారతీయ మత్స్యకారులు, ఒక పౌర ఖైదీ జైలు శిక్షను పూర్తి చేసినప్పటికీ కరాచీలోని లాంధీ, మలిర్ జైళ్లలో ఉన్నారు. గతంలో కూడా కొంతమంది భారతీయ పౌర ఖైదీలు అనారోగ్యంతో ఆసుపత్రుల్లో మరణించారని జైలు అధికారులు తెలిపారు. మొత్తం 654 మంది భారతీయ మత్స్యకారులు కరాచీ జైళ్లలో మగ్గుతుండగా, 83 మంది పాకిస్థానీ మత్స్యకారులు భారతీయ జైళ్లలో ఉన్నట్లు అంచనా. 654 మంది భారతీయ మత్స్యకారులలో 631 మంది శిక్షలు పూర్తి చేసుకుని స్వదేశానికి రావడానికి ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
-
Rajat Patidar: రెండు ఐపీఎల్ టైటిల్స్, 500 రన్స్.. పాటిదార్ ఎంపిక కాకపోవడంపై అగార్కర్ కీలక వ్యాఖ్యలు!
-
Peddi Controversy : హీరోయిన్లను బ్లేమ్ చేయకండి… చేసేదంతా దర్శకులే… ‘పెద్ది’ వివాదంపై నాగ్ హీరోయిన్ రియాక్షన్
-
NTRNEEL : ఎన్టీఆర్ ‘డ్రాగన్’ షూటింగ్.. ఈసారి లంకని తగలబెట్టబోతున్న నీల్
-
Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!