Ghaziabad Lawyer: జిల్లా కోర్టు కాంప్లెక్స్లోనే లాయర్ కాల్చివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghaziabad Lawyer: ఉత్తరప్రదేశ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఘజయాబాద్లో న్యాయవాదిని ఇద్దరు దుండగులు పట్టపగలే కాల్చి చంపారు. న్యాయవాది కార్యాలయంలోనే ఈ హత్య జరిగింది. బుధవారం మధ్యాహ్నం జిల్లా కోర్టు కాంప్లెక్స్ లోపల ఉన్న న్యాయవాది ఛాంబర్లోకి ప్రవేశించిన గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు నేరుగా ఆయనపై కాల్పులు జరిపారు. మృతుడు నగరానికి చెందిన లాయర్ మోను చౌదరిగా గుర్తించారు. దాడి జరిగిన సమయంలో మోను చౌదరి భోజనం చేస్తున్నారు. దుండగులు కాల్పులు జరపడంతో మోను చౌదరి రక్తపు మడుగులో పడి ఉండడం కనిపించింది.
సిహాని గేట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయబడింది. దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరించి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. అంతేకాకుండా, కోర్టు ఆవరణలో అమర్చిన సీసీటీవీ కెమెరాల నుంచి సెక్యూరిటీ ఫుటేజీని భద్రపరుస్తున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సిటీ) నిపున్ అగర్వాల్ తెలిపారు. మోను చౌదరిని మధ్యాహ్నం 2 గంటలకు కాల్చి చంపినట్లు ప్రాథమిక సమాచారం. దుండగులు కాలినడకన వచ్చి నేరం చేసి పారిపోయినట్లు సమాచారం.
Also Read
- PoK Protests: "మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!".. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
- Morning Diet Tips: ఉదయాన్నే ఏం తినాలి? ఏం తినకూడదు? నిపుణుల హెచ్చరిక
- Monsoon 2026: రైతన్నలకు బిగ్ అలర్ట్.. ఈ 15 రోజులు అత్యంత కీలకం.. భారీ వర్షాలు!
- Pakistan-Afghanistan: పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం.. పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ డ్రోన్ దాడులు!
Read Also: Kiren Rijiju: తుక్డే-తుక్డే గ్యాంగ్ మాటలు నమ్మవద్దు.. చైనా మ్యాప్స్పై కేంద్ర మంత్రి
రాష్ట్రంలోని హాపూర్ ప్రాంతంలో న్యాయవాదులు, పోలీసుల మధ్య జరిగిన ఘర్షణకు నిరసనగా పశ్చిమ యూపీ అంతటా న్యాయవాదులు ఈరోజు 24 గంటల సమ్మెకు దిగినప్పుడు ఈ హత్య జరిగింది. మరిన్ని ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉన్నందున రాష్ట్రంలోని అన్ని కోర్టులు, తహసీల్ సముదాయాల వద్ద పోలీసులను మోహరించారు.అయితే, సాయుధ వ్యక్తులు ఈ భద్రతా వలయాన్ని ఛేదించి మోను చౌదరిని హత్య చేసి, ఆపై తప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. దాడి అనంతరం ఘటనాస్థలంలో అనేక మంది న్యాయవాదులు గుమిగూడారు. మోను చౌదరి సహచరులు న్యాయం కోరడంతో వెంటనే నిరసనలు చెలరేగాయి. దాడి జరిగిన సమయంలో ఇతర న్యాయవాదులు హాపూర్ సమస్యపై తమ వ్యూహాన్ని రూపొందించేందుకు సమావేశమయ్యారు.
తాజావార్తలు
-
Petrol, Diesel Prices Reduced: ఇది కదా కావాల్సింది.. పెట్రోల్ ధరలు లీటరు రూ. 5, డీజిల్ ధరలు రూ. 3 తగ్గింపు
-
NTRxTrivikram : ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై తమిళ తంబీల ఆగ్రహం.. కారణమేంటంటే?
-
PoK Protests: “మాకు పాకిస్థాన్ వద్దు.. భారత్ను సహాయం కోరుతాం!”.. PoK నిరసనకారులు తీవ్ర వ్యాఖ్యలు!
-
Tata Sierra EV: 665KM రేంజ్తో టాటా సియెర్రా EV లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే
-
Ravi Teja Sree Vishnu: రవితేజ, శ్రీవిష్ణు మల్టీస్టారర్ ఫిక్సా? సంక్రాంతి రేసులో దిల్ రాజు భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!