Gaganyaan: గగన్ యాన్ కౌంట్ డౌన్.. రేపు నింగిలోకి టీవీ–డీ1
ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ మిషన్ కౌంట్ డౌన్ ఇవాళ సాయంత్రం షార్ రేంజ్ శ్రీహరికోటలో రాత్రి 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. 2025లో సొంత రాకెట్ తో అంతరిక్షంలోకి తమ వ్యోమగాములను కక్ష్యలోకి తీసుకురావాలని భారత అంతరీక్ష పరీశోధనా సంస్థ యోచిస్తుంది. ఎస్కేప్ సిస్టమ్ ను పరీక్షించడంలో భాగంగా ఫ్లైట్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్-1(TV D1) ఫ్లైట్ ను రేపు (అక్టోబర్21) ఉదయం 8 గంటలకు నింగిలోకి పంపనున్నారు. నాలుగు టెస్ట్ ఫ్లైట్ లలో ఇది మొదటిది అని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పేర్కొన్నారు.
Read Also: Michelle Santner: టీమిండియాను ఎదుర్కొనేందుకు మా ప్లాన్ ఇదే..!
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
రేపు (శనివారం) ఉదయం 8.00 గంటలకు ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి స్వల్పకాలిక మిషన్ ప్రయోగం జరుగుతుందని.. మొత్తం మిషన్ 531 సెకన్లు (సుమారు 9 నిమిషాలు) సాగుతుందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ వర్గాలు చెప్పుకొచ్చాయి. ఈ ఫ్లైట్ టెస్ట్ మొత్తం గగన్ యాన్ కార్యక్రమంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుందన్నారు. ఇది అంతరిక్షంలోకి భారతదేశం యొక్క మొట్ట మొదటి మానవ సహిత మిషన్ అని తెలిపారు.
Read Also: Mahua Moitra: “ప్రశ్నకు డబ్బు” కేసులో టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా.. సంచలన ఆరోపణలు..
ఇక, 35 మీటర్ల పొడవు గల లిక్విడ్ ప్రొపెల్డ్ సింగిల్ స్టేజ్ టెస్ట్ వెహికల్ దాదాపు 44 టన్నుల బరువుతో 4వేల 520 కిలోల క్రూ మాడ్యూల్ తో చేసిన వికాస్ ఇంజన్ ను ఉపయోగిస్తున్నారు. దీన్ని అల్యూమినియంతో తయారు చేశారు. దాని ముందు చివర CES అమర్చబడి ఉంటుందన్నారు. ఫస్ట్ లాంచ్ ప్యాడ్ నుంచి లిఫ్ట్ ఆఫ్ అయినప్పటి నుంచి శ్రీహరికోట నుండి 10 కిలో మీటర్ల దూరంలో సముద్రంలో ఉన్న క్రూ మాడ్యూల్ టచ్ డౌన్ వరకు మొత్తం ప్రయోగ క్రమం 531 సెకన్ల పాటు కొనసాగుతుందని ఇస్రో ప్రకటించింది. లిఫ్ట్ ఆఫ్ అయిన 60 సెకన్ల తర్వాత టెస్ట్ వెహికల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ 11.7 కిలో మీటర్ల ఎత్తులో వేరు చేయబడుతుంది, ఆ తర్వాత మరో 30 సెకన్లకు CM-CES 148.7 వేగంతో 16.7 కిలో మీటర్ల ఎత్తులో సెపరేట్ చేయబడుతుందని తెలిపారు. శ్రీహరికోట నుంచి 10 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో క్రూ మాడ్యూల్ స్ప్లాష్ చేస్తారు.. రికవరీ షిప్ ల ద్వారా భారత నావికాదళం దాన్ని సేకరిస్తుందని చెప్పారు. అయితే, మానవసహిత అంతరిక్ష ప్రయోగాలలో అత్యంత కీలకంగా ఈ ప్రయోగం మారనుంది. శ్రీహరి కోటకు ఇస్తోకు చెందిన సీనియర్ శాస్త్ర వేత్తలు చేరుకున్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!