Gadwal Vijayalaxmi : మోడీ విధానాలు ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉన్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం ఒక కక్ష సాధింపు చర్య అని ఆమె మండిపడ్డారు. అంతేకాకుండా… ఇది ఒక దుర్మార్గపు చర్య అని ఆమె అభివర్ణించారు. లిక్కర్ స్కాం పేరిట బీజేపీ నాటకాలు ఆడుతోందని ఆమె ధ్వజమెత్తారు. మోడీ విధానాలు ఎమర్జెన్సీ కన్నా దారుణంగా ఉన్నాయిని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ దర్యాప్తు సంస్థలను ప్రతి పక్షాలను వేధించేందుకు వాడుకోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. ఈ డ్రామాను ప్రజలు తిప్పి కొట్టాలన్నారు.
Also Read : NASA-ISRO Satellite: బెంగళూరుకు చేరిన నాసా-ఇస్రో ఉపగ్రహం
Also Read
- Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
- Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
- Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
- Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
కవిత బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో క్రియాశీలంగా ఉన్నందుకే బీజేపీ కక్ష కట్టిందని ఆయన అన్నారు. నేతలు విచారణకు సహకరిస్తుంటే ఈ నోటీసులు, బెదిరింపులు అరెస్టులు దేనికని, సీబీఐ, ఈడీల విచారణ తీరు సరిగా లేదన్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్న బీజేపీకి తెలంగాణ తగిన గుణపాఠం చెబుతుందని ఆమె అన్నారు. కవితకు అందరూ అండగా ఉంటారని ఆమె స్పష్టం చేశారు. ఢిల్లీలో మహిళ హక్కుల రక్షణకు, రిజర్వేషన్ల కై ఉద్యమిస్తున్న సమయంలో ఇటువంటి చర్యలు దురదృష్టకరమని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పారదర్శక పద్దతిలో విచారణ చేపట్టి ప్రతిపక్ష నేతలను వేధించడం మానాలని ఆమె హితవు పలికారు.
Also Read : Writer Padmabhushan: ‘రైటర్ పద్మభూషణ్’ అప్పుడే ఇంట్లో అడుగుపెడతాడట
ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ పాలసీ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మార్చి 9న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది ఈడీ. అయితే.. లిక్కర్ పాలసీ వ్యవహారంలో మంగళవారం అరెస్టయిన అరుణ్ రామచంద్ర పిళ్లై అరెస్ట్ సందర్భంగా కవిత పేరు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో రేపు ఢిల్లీలో భారత జాగృతి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో.. మార్చి 11న విచారణకు హాజరవుతానని ఈడీకి విజ్ఞప్తి పంపడంతో.. దానికి ఈడీ అంగీకరించినట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Medak: ఉమ్మడి మెదక్లో గాలివాన బీభత్సం.. తడిసి ముద్దయిన వరి ధాన్యం, ఆందోళనలో రైతన్నలు
-
Super Mileage Car: సంచలనం సృష్టించిన విద్యార్థులు.. లీటర్ పెట్రోల్తో 911 కి.మీ. నడిచే కారు ఆవిష్కరణ.!
-
Modi-Meloni: ఇటలీలో ప్రధాని మోడీ.. నేటి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.. మెలోని ఫొటోలు షేర్ చేసిన పీఎం..
-
Japan Earthquake: భారీ భూకంపం.. వణికిపోయిన భవనాలు.!
-
Hyderabad: అత్తాపూర్లో అర్ధరాత్రి యువతి కిడ్నాప్.. 3 గంటల పాటు పోలీసుల హైడ్రామా!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?