Tragic Incident: ఏం కష్టమొచ్చిందో.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య
- గుజరాత్లోని భన్వాడ్లోని ధారగఢ్ ప్రాంతంలో ఘటన
- కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏం కష్టమొచ్చిందో తెలియదు కానీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. బుధవారం ద్వారకా జిల్లాలోని భన్వాడ్లోని ధారగఢ్ ప్రాంతంలో నలుగురి మృతదేహాలు కనిపించడంతో కలకలం రేగింది. వీరంతా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాల వద్ద పాయిజన్ బాటిల్, ప్లాస్టిక్ గ్లాసులు, కోలా డ్రింక్ బాటిల్తో పాటు సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా.. మూడు మొబైల్ ఫోన్లు, పాన్ కార్డు, గుర్తింపు కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టంకు పంపించారు.
Read Also: Muchumarri Missing Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం..
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
కాగా.. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించగా.. ఎలాంటి ఫిర్యాదు రాలేదని పోలీసులు తెలిపారు. మృతి చెందిన నలుగురు వ్యక్తులు 42 ఏళ్ల అశోక్ ధుమ్వా, 42 ఏళ్ల లీలుబెన్ అశోక్ ధుమ్వా, 20 ఏళ్ల జిగ్నేష్ అశోక్ ధుమ్వా, 18 ఏళ్ల కింజల్ దుమ్వాగా గుర్తించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు.
Read Also: Nepal: విశ్వాస పరీక్షలో ఓడిపోయిన నేపాల్ ప్రధాని ప్రచండ.. కొత్త ప్రధానిగా కేపీ శర్మ ఓలి..?
రూ. 20 లక్షలు ఇవ్వాలని విశాల్ జడేజా అనే వ్యక్తి బెదిరింపులు, దాడులు, ఒత్తిడి చేశారని మృతుడి కుటుంబ పెద్ద అశోక్భాయ్ చెప్పినట్లు పోలీసులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన కుటుంబంలోని నలుగురు సభ్యులు రెండు స్కూటర్లపై జామ్నగర్కు వెళ్లి భన్వాడ్లోని ధారగఢ్ గ్రామంలో విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ప్రాథమిక విచారణ ఆధారంగా విశాల్ జడేజాపై ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..