Muchumarri Missing Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం..
- ముచ్చుమర్రి బాలిక కేసులో కొనసాగుతోన్న పోలీసుల గాలింపు చర్యలు..
- ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముళ్లపొదలు తొలగింపు..
- మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muchumarri Missing Girl Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలికపై హత్య, అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముల్లచెట్లను తొలగిస్తున్నారు పోలీసులు.. మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించారు.. దీంతో, బాలిక మృతదేహాన్నరి ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. అయితే, ఈ పరిణామాలతో బాలిక కేసు ఎప్పుడు ఎటు మలుపుతీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. మరోవైపు.. బాలిక మృతదేహం ఆచూకీ కనుక్కోవాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగుతున్నారు.. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశామని పోలీస్ దర్యాప్తులో ముగ్గురు మైనర్ బాలురు అంగీకరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. వారు ఇచ్చిన సమాచారం మేరకే బాలిక మృతదేహాన్ని వెతికే పనిలోపడిపోయారు.
Read Also: Road Accident: హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు లారీలు ఢీ, ఒకరు మృతి
Also Read
ఇక, అత్యాచారం, హత్యకు గురైన బాలిక బంధువులు ముచ్చుమర్రి పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.. 6 రోజులైనా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో రోడ్డెక్కారు బంధువులు.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఎత్తిపోతల కాలువలో పడేసామని మైనర్ బాలురు చెప్పడంతో 4 రోజులుగా కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.. బాలిక మృతదేహం దొరకకపోవడంతో బంధువుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బాలిక మృతదేహాన్ని వెంటనే గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, 4 రోజులుగా బాలిక మృతదేహం కోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మకోవైపు.. ముగ్గురు మైనర్ బాలురను ముచ్చుమర్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు పోలీసులు.. రెండు వేర్వేరు స్థలాలను పోలీసులకు బాలురు చూపించారు.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. బాలురు చూపించిన స్థలాల్లో ఏమైనా పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ ఘటనలో బాలుర పాత్ర మాత్రమేనా, ఇంకా ఎవరిపాత్ర అయినా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ తరుణంలో.. జేసీబీతో ముల్ల పొదలను తొలగించడంతో.. అక్కడే మృతదేహాన్ని పాతిపెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!