Muchumarri Missing Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం..
- ముచ్చుమర్రి బాలిక కేసులో కొనసాగుతోన్న పోలీసుల గాలింపు చర్యలు..
- ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముళ్లపొదలు తొలగింపు..
- మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించిన అధికారులు..
Muchumarri Missing Girl Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలికపై హత్య, అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముల్లచెట్లను తొలగిస్తున్నారు పోలీసులు.. మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించారు.. దీంతో, బాలిక మృతదేహాన్నరి ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. అయితే, ఈ పరిణామాలతో బాలిక కేసు ఎప్పుడు ఎటు మలుపుతీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. మరోవైపు.. బాలిక మృతదేహం ఆచూకీ కనుక్కోవాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగుతున్నారు.. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశామని పోలీస్ దర్యాప్తులో ముగ్గురు మైనర్ బాలురు అంగీకరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. వారు ఇచ్చిన సమాచారం మేరకే బాలిక మృతదేహాన్ని వెతికే పనిలోపడిపోయారు.
Read Also: Road Accident: హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు లారీలు ఢీ, ఒకరు మృతి
Also Read
ఇక, అత్యాచారం, హత్యకు గురైన బాలిక బంధువులు ముచ్చుమర్రి పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.. 6 రోజులైనా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో రోడ్డెక్కారు బంధువులు.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఎత్తిపోతల కాలువలో పడేసామని మైనర్ బాలురు చెప్పడంతో 4 రోజులుగా కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.. బాలిక మృతదేహం దొరకకపోవడంతో బంధువుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బాలిక మృతదేహాన్ని వెంటనే గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, 4 రోజులుగా బాలిక మృతదేహం కోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మకోవైపు.. ముగ్గురు మైనర్ బాలురను ముచ్చుమర్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు పోలీసులు.. రెండు వేర్వేరు స్థలాలను పోలీసులకు బాలురు చూపించారు.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. బాలురు చూపించిన స్థలాల్లో ఏమైనా పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ ఘటనలో బాలుర పాత్ర మాత్రమేనా, ఇంకా ఎవరిపాత్ర అయినా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ తరుణంలో.. జేసీబీతో ముల్ల పొదలను తొలగించడంతో.. అక్కడే మృతదేహాన్ని పాతిపెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజావార్తలు
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
-
Jyoti Poorvaj : అందాలతో మంట రాజేస్తున్న జ్యోతి పూర్వాజ్
-
Kidney Stones Rising in Summer: వేసవిలో కిడ్నీల్లో పెరిగిపోతున్న రాళ్లు.. ఇలా చెక్ పెట్టండి..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!