Muchumarri Missing Girl Case: ముచ్చుమర్రి బాలిక కేసులో కీలక పరిణామం..
- ముచ్చుమర్రి బాలిక కేసులో కొనసాగుతోన్న పోలీసుల గాలింపు చర్యలు..
- ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముళ్లపొదలు తొలగింపు..
- మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Muchumarri Missing Girl Case: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన ముచ్చుమర్రి బాలికపై హత్య, అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ముచ్చుమర్రి శివారులో ఒక ప్రదేశంలో జేసీబీతో ముల్లచెట్లను తొలగిస్తున్నారు పోలీసులు.. మైనర్ బాలురు చూపించిన రెండు ప్రదేశాల్లో ఒక ప్రాంతంలో చెట్లను తొలగించారు.. దీంతో, బాలిక మృతదేహాన్నరి ఆ ప్రాంతంలోనే పూడ్చిపెట్టారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.. అయితే, ఈ పరిణామాలతో బాలిక కేసు ఎప్పుడు ఎటు మలుపుతీసుకుంటుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది.. మరోవైపు.. బాలిక మృతదేహం ఆచూకీ కనుక్కోవాలంటూ పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది.. మృతురాలి బంధువులు ఆందోళనకు దిగుతున్నారు.. బాలికపై అత్యాచారం చేసి హత్య చేశామని పోలీస్ దర్యాప్తులో ముగ్గురు మైనర్ బాలురు అంగీకరించినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. వారు ఇచ్చిన సమాచారం మేరకే బాలిక మృతదేహాన్ని వెతికే పనిలోపడిపోయారు.
Read Also: Road Accident: హైదరాబాద్-బెంగళూరు హైవేపై ఘోర ప్రమాదం.. మూడు లారీలు ఢీ, ఒకరు మృతి
Also Read
- Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
- Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
- 6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
- ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
ఇక, అత్యాచారం, హత్యకు గురైన బాలిక బంధువులు ముచ్చుమర్రి పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.. 6 రోజులైనా బాలిక ఆచూకీ తెలియకపోవడంతో రోడ్డెక్కారు బంధువులు.. బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసి ఎత్తిపోతల కాలువలో పడేసామని మైనర్ బాలురు చెప్పడంతో 4 రోజులుగా కాలువలో గాలింపు చర్యలు చేపట్టారు.. బాలిక మృతదేహం దొరకకపోవడంతో బంధువుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. బాలిక మృతదేహాన్ని వెంటనే గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు.. అయితే, 4 రోజులుగా బాలిక మృతదేహం కోసం ముచ్చుమర్రి ఎత్తిపోతల అప్రోచ్ కెనాల్ లో గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మకోవైపు.. ముగ్గురు మైనర్ బాలురను ముచ్చుమర్రి సమీపంలోని పొలాల్లోకి తీసుకెళ్లారు పోలీసులు.. రెండు వేర్వేరు స్థలాలను పోలీసులకు బాలురు చూపించారు.. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. బాలురు చూపించిన స్థలాల్లో ఏమైనా పూడ్చిపెట్టారా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ ఘటనలో బాలుర పాత్ర మాత్రమేనా, ఇంకా ఎవరిపాత్ర అయినా ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. ఈ తరుణంలో.. జేసీబీతో ముల్ల పొదలను తొలగించడంతో.. అక్కడే మృతదేహాన్ని పాతిపెట్టారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తాజావార్తలు
-
Pallaburusu: టూత్బ్రష్తో జిల్లా కోర్టులో లీగల్ ఫైట్?
-
Bullet Train: బుల్లెట్ ట్రైన్ ఆలస్యానికి భారతే కారణం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలు..
-
Trump: భారత్ విద్యార్థులకు బిగ్ షాక్.. ట్రంప్ కొత్త స్టూడెంట్ వీసా నిబంధనలివే!
-
6500mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే , 90W ఛార్జింగ్.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ లా కనిపించే ఫోన్..
-
ENG Vs IND, 3rd ODI : టీమిండియాకు మరో బిగ్ షాక్.. మూడో వన్డేకు స్టార్ ప్లేయర్ దూరం..
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?