Harish Rao: సర్పంచ్ల సంఘం నాయకులను, మాజీ సర్పంచుల అరెస్ట్లను ఖండిస్తున్నాం..
- మాజీ సర్పంచుల అరెస్ట్లపై మాజీ మంత్రి హరీష్రావు ఆగ్రహం
- పెండింగ్ బిల్లులు చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Harish Rao: పెండింగ్ బిల్లులు చెల్లించాని కోరుతూ, మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చేందుకు వస్తున్న మాజీ సర్పంచుల సంఘం నాయకులను, మాజీ సర్పంచులను ఎక్కడిక్కడ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం సర్పంచులు గొంతెత్తితే పాపం అన్నట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుండటం శోచనీయమన్నారు. ఏడాది కాలంగా మాజీ సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండటం దుర్మార్గమన్నారు. ఇప్పటికే నాలుగైదు సార్లు హైదరాబాద్కు వచ్చి మొర పెట్టుకున్నారని.. నిరసనలు తెలిపితే నిర్బంధిస్తున్నారు. అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
Read Also: Group-2 Hall Tickets: గ్రూప్-2 హాల్ టికెట్లు విడుదల
Also Read
- Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
- Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
- Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
- Delhi: ఢిల్లీ మెట్రో స్టేషన్లు మూసివేతపై సుప్రీంకోర్టు సీరియస్.. సీజేఐ కీలక వ్యాఖ్యలు
అప్పులు చేసి, భార్య పిల్లల మీద బంగారం అమ్మి పనులు చేశామని, పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని మాజీ సర్పంచులు వేడుకుంటే ప్రభుత్వం మొద్దునిద్ర నటిస్తోందంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు ఎంతో కృషి చేశారన్నారు. ఉత్తమ గ్రామాలకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా నిలిచిందంటే, ప్రధాని అవార్డులు, పంచాయతీ అవార్డులు సాధించిందంటే అందులో సర్పంచుల పాత్ర కీలకమన్నారు. గ్రామాల అభివృద్ధికి కృషి చేసిన మాజీ సర్పంచులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వారి పట్ల ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నలు గుప్పించారు.
బడా కాంట్రాక్టర్లకు వందల కోట్ల బిల్లులు చెల్లిస్తున్నారు.. కానీ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష వేస్తున్నారన్నారు. ఇదేం న్యాయం.. ఇంకెన్నాళ్ళు వాళ్లు ఇలా రోడ్డెక్కి పోరాటం చేయాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి లేదా పంచాయతీ శాఖ మంత్రి మాజీ సర్పంచులను చర్చలకు పిలవాలని, వారి పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.
తాజావార్తలు
-
Trisha: విజయ్ జన నాయగన్ సినిమా చూసిన త్రిష.. రియాక్షన్ వైరల్!
-
Sai Pallavi: మరో పవర్ఫుల్ రోల్కు రెడీ అయిన సాయి పల్లవి? నెక్ట్స్ సినిమా ఇదేనా!
-
Delhi: ఢిల్లీలో ఆంక్షలు తీవ్రం.. పోలీసులకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక అధికారాలు
-
Congress: ప్రధాని నివాసం కాదు, జంతర్ మంతర్ రావాల్సింది.. కాంగ్రెస్పై వాంగ్చుక్ భార్య విమర్శలు..
-
Salman Khan: స్కూల్ రోజుల్లోనే ఎగ్జామ్ పేపర్లు లీక్ చేసిన సల్మాన్ ఖాన్.. తండ్రి బయటపెట్టిన సంచలన నిజాలు!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!