Crime: 5 నెలల పాపపై అత్యాచారం.. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సంధ్యారాణి
- విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాపపై అత్యాచారం
- బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: విజయనగరం జిల్లాలో ఐదు నెలల పాపపై జరిగిన అత్యాచారం ఘటన బాధిత కుటుంబాన్ని గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని మంత్రి విచారం వ్యక్తం చేశారు. ఐదు నెలల పాపపై 40 ఏళ్ల మానవ మృగం విరుచుకుపడిందని.. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే కఠిన శిక్ష పడేలా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఉయ్యాలలో ఉన్న పాపపై దుర్మార్గుడు ఇంత దారుణానికి ఒడిగట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వాడికి ఏ లాయర్ బెయిల్ కోసం వెళ్లకూడదన్నారు. ఏ ఆడపిల్లకు ఇలా జరగకూడదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని.. ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పాప పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, స్తీ శిశు సంక్షేమ శాఖ నుండి అండగా ఉంటామన్నారు.
Read Also: Crime News: కడప జిల్లాలో కులహంకార దాడి.. కర్రతో కొట్టి మరిగే నూనె పోశారు..
Also Read
- Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
- Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
- Mahua Moitra: ‘బెంగాలీలకు రాజ్మా అంటే తెలుసా?’ బీజేపీ ప్రభుత్వంపై మహువా మొయిత్రా ఫైర్
- Europe Heatwave: యూరప్ను బెంబేలెత్తిస్తోన్న ‘ఒమేగా బ్లాక్’.. రికార్డు ఉష్ణోగ్రతలకు కారణమిదేనా!
విజయనగరం జిల్లాలో నెలల పాపపై తాతయ్య అత్యాచారం కలకలం రేపింది. ఘోర ఘటనపై ప్రతి స్పందిస్తూ ఆ కామాంధుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. అత్యాచారానికి పాల్పడిన కామాంధుడిని అరెస్టు చేశారు పోలీసులు. విజయనగరం జిల్లా రామభద్రపురం జీలికి వలస గ్రామంలో 5 నెలల పసికందుపై కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. బిడ్డకు రక్తస్రావం కావడంతో బాడంగి ఆస్పత్రికి తరలించారు తల్లిదండ్రులు. ప్రాథమిక చికిత్స అందించి వైద్యులు విజయనగరంలోని ఘోషాసుపత్రికి తరలించారు. ఆ చిన్నారి తల్లి ఇంటి నుంచి బయటకు సరుకులు తెచ్చేందుకు వెళ్లడంతో ఊయలలో ఉన్న చిన్నారిని ఎత్తుకెళ్లి వరుసకు తాతయ్య అయ్యే ఎరకయ్య అత్యాచారానికి పాల్పడ్డాడు. నిద్రిస్తున్న పసికందుపై అత్యాచారం చేస్తుండగా పసికందు అక్క చూసి తల్లికి సమాచారం ఇచ్చింది. హుటాహుటిన ఉయ్యాల దగ్గరకు వచ్చి తల్లి చూడగా.. రక్తస్రావం కావడంతో పసికందును ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విషయం తెలుసుకున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో పాటు విజయనగరం ఎమ్మెల్యే అధితి గజపతి ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. ఘటన అమానుషమని.. ప్రశాంతమైన విజయనగరం జిల్లాలో ఇలాంటి ఘటనలు హేయమన్నారు మంత్రి కొండపల్లి. నిందితున్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది, అతనికి కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. పాప కండిషన్ నిలకడగా ఉందని.. డాక్టర్ల పర్యవేక్షణలో పాపకు వైద్యం అందుతుందన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రతి తల్లి కూడా బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వ పరంగా ఇలాంటి ఘటనల పై జరగకుండా నిర్ణయాలు ఉంటాయి.
తాజావార్తలు
-
Naga Bandham: 110 కోట్ల రిస్క్.. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్లోనే అసలు రహస్యం!
-
Iran War: మళ్లీ ఉద్రిక్తత.. అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్ దాడులు..
-
Maa Inti Bangaram: 73 కోట్ల వసూళ్లతో అన్-స్టాపబుల్ ‘బంగారం’!
-
Joker : నిర్మాతగా బన్నీ బెస్ట్ ఫ్రెండ్.. అల్లు అరవింద్ క్లాప్’తో ‘జోకర్’ గ్రాండ్ లాంచ్!
-
Ketan Agarwal murder case: 3 ఏళ్ల టైమ్ దొరుకుతుందనే కేతన్ హత్య..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!