Chhattisgarh: భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు.. నక్సలైట్ మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్లోని ధామ్తరి జిల్లా ఏక్వారీ అడవుల్లో భద్రతా బలగాలు-మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో పోలీసులు ఓ నక్సలైట్ ను హతం చేశారు. గంటల తరబడి ఈ కాల్పులు కొనసాగాయి. మరోవైపు ఘటనా స్థలం నుంచి పోలీసులు రెండు రైఫిళ్లు, మావోయిస్టులు ఉపయోగించే సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. బోరై పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏకవారి అటవీప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో కాల్పులు జరిపినట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.
Read Also: Minister Harish Rao: మ్యానిఫెస్టోలో చెప్పినవి.. చేసింది కేసీఆర్ మాత్రమే..
Also Read
- Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
- Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
- Iran: భారీ ఆదాయం సమకూర్చుకునే పనిలో ఇరాన్.. వాటిపై ‘డిజిటల్ టాక్స్’ వసూలుకు ప్లాన్..
- Ambati Rambabu: పెట్రో ధరలపై రిక్షా తొక్కి అంబటి నిరసన.. రెడ్ బుక్ నా మీదే కాదు.. జనసేన వాళ్లపై కూడా అమలు..!
ధామ్తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ ఆదేశాల మేరకు నగర ఎస్డీఓపీ మయాంక్ రాంసింగ్ నేతృత్వంలో కూంబింగ్ నిర్వహించారు. దీంతో జిల్లా పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లు రావడం చూసి నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇరువైపులా దాదాపు 880 రౌండ్ల బుల్లెట్లు పేల్చారు. ఈ ఎన్కౌంటర్ లో కొంతమంది నక్సలైట్లు గాయపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. అయితే మృతిచెందిన నక్సలైట్ వివరాలు ఇంకా తెలియరాలేదని.. ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు రాయ్పూర్ రేంజ్ ఐజీ తెలిపారు.
Read Also: Mukesh Ambani: డిసెంబర్ నాటికి దేశమంతా జియో 5జీ.. “జియో ఎయిర్ ఫైబర్” లాంచింగ్ డేట్ ఫిక్స్..
మరోవైపు నక్సలైట్ల వ్యతిరేక ప్రచారాన్ని పోలీసులు నిరంతరం నిర్వహిస్తున్నామని, ఎక్వారీ అడవుల్లో నక్సలైట్లు ఉన్నట్లు సమాచారం అందిందని ధామ్తరి ఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ తెలిపారు. దీంతో ధామ్తరి పోలీసులు, గరియాబంద్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్ల సంయుక్త బృందం అడవికి వెళ్లింది. పోలీసు సిబ్బందిని చూసిన నక్సలైట్లు కాల్పులు ప్రారంభించారని పేర్కొన్నారు. ఆ తర్వాత జవాన్లు కూడా ఎదురు కాల్పులు జరిపారని.. ఓ నక్సలైట్ని జవాన్లు హతమార్చారన్నారు.
తాజావార్తలు
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
-
Explainer: పిడుగులు చంపుతున్నాయ్.. తెలుగు రాష్ట్రాలకు డేంజర్ అలెర్ట్!
-
Seyon: కమల్ హాసన్ నిర్మాణంలో శివకార్తికేయన్ మాస్ అవతార్
-
Byreddy Siddharth Reddy: “నన్ను తిట్టేవారికి బహుమతులు ఇస్తున్నారు”.. మంత్రి టీజీ భరత్పై బైరెడ్డి విమర్శలు..
-
IPL 2026: ఐపీఎల్ ప్లేఆఫ్స్ షెడ్యూల్ మారుతుందా? బీసీసీఐ, కేంద్రం ఆదేశాలపై ఉత్కంఠ!
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..