Mukesh Ambani: డిసెంబర్ నాటికి దేశమంతా జియో 5జీ.. “జియో ఎయిర్ ఫైబర్” లాంచింగ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రిలయన్స్ ఏజీఎం సమావేశంలో భవిష్యత్ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 96 శాతం పట్టణాల్లో జనాభాకు జియో 5జీ అందుబాటులో ఉందని.. డిసెంబర్ చివరినాటికి భారతదేశం అంతటా 5జీ అందుబాటులోకి తీసుకువచ్చేలా లక్ష్యం పెట్టుకున్నామని ప్రకటించారు.
ఈ రోజు ముంబైలో రిలయన్ ఏజీఎం 46వ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీ మాట్లాడుతూ.. జియో 5జీకి సంబంధించిన అప్డేట్స్ ప్రకటించారు. డిసెంబర్ నాటికి 5జీ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు. జియో ఎయిర్ ఫైబర్, వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి రోజున ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Elon Musk: ప్రపంచ చరిత్రలో ఒకే ఒక్కడు.. ఎలాన్ మస్క్కు అడుగు దూరంలో అరుదైన ఘనత!
- LIC Saral Pension: ఈ ఎల్ఐసీ పాలసీ తెలుసా? ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే చాలు.. ఆ తర్వాత జీవితాంతం చేతికి రూ.21000!
- UPI Scam Alert : UPI ద్వారా డబ్బు పంపిన వెంటనే మోసపోయారా? మొదటి 30 నిమిషాల్లో ఏం చేస్తే నష్టం తగ్గే అవకాశం ఉంటుంది
Read Also: Griha Lakshmi Yojana: మహిళలకు గుడ్న్యూస్.. రక్షాబంధన్ కానుక ఇవ్వనున్న సిద్ధరామయ్య సర్కారు
గతేడాది అక్టోబర్ లో రిలయన్ జియో 5జీ నెట్వర్క్ ని ప్రారంభించింది. అయితే ఈ రోజు జరిగిన ఏజీఎం సమావేశంలో 5జీ ప్లాన్స్ ప్రకటిస్తారని అంతా అనుకున్నప్పటికీ.. డిసెంబర్ లో ఫ్లాన్స్ అందుబాటులోకి వస్తాయని ముకేష్ అంబానీ వెల్లడించారు. కేవలం 9 నెలల్లోనే దేశంలోని 96 శాతం పట్టణ జనాభాకు జియో 5జీ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదే అత్యంత వేగవంతమైన 5జీ విస్తరణ అని పేర్కొన్నారు.
అదనపు మూలధన వ్యయం లేకుండా జియో తన ప్రస్తుత 4జీ కస్టమర్ బేస్ ను సజావుగా 5జీగా మార్చడానికి మంచి స్థితిలో ఉందని ముకేష్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం జియో 5జీ విస్తరణ సొంతగా, దేశీయంగా అభివృద్ధి చేయబడిన 5జీ స్టాక్ పై ఆధారపడి ఉందని తెలిపారు. భారతదేశ 5G విప్లవంలో జియోను తిరుగులేని నాయకుడిగా ఉందన్నారు.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!