Mukesh Ambani: డిసెంబర్ నాటికి దేశమంతా జియో 5జీ.. “జియో ఎయిర్ ఫైబర్” లాంచింగ్ డేట్ ఫిక్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Ambani: రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ రిలయన్స్ ఏజీఎం సమావేశంలో భవిష్యత్ లక్ష్యాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం దేశంలో 96 శాతం పట్టణాల్లో జనాభాకు జియో 5జీ అందుబాటులో ఉందని.. డిసెంబర్ చివరినాటికి భారతదేశం అంతటా 5జీ అందుబాటులోకి తీసుకువచ్చేలా లక్ష్యం పెట్టుకున్నామని ప్రకటించారు.
ఈ రోజు ముంబైలో రిలయన్ ఏజీఎం 46వ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీ మాట్లాడుతూ.. జియో 5జీకి సంబంధించిన అప్డేట్స్ ప్రకటించారు. డిసెంబర్ నాటికి 5జీ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ వినియోగదారులకు అందుబాటులోకి రావచ్చని వెల్లడించారు. జియో ఎయిర్ ఫైబర్, వైర్లెస్ ఇంటర్నెట్ సేవలు సెప్టెంబర్ 19న గణేష్ చతుర్థి రోజున ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
Also Read
- Stock Market: TCS దూకుడు మామూలుగా లేదుగా.. ఒక్క వారంలోనే రూ.72,000 కోట్ల లాభం!
- Upcoming IPO 2026: వచ్చే వారం 7 ఐపీఓలు ప్రారంభం.. ఏ కంపెనీ IPOలో పెట్టుబడి అవకాశాలు ఎక్కువ?
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
Read Also: Griha Lakshmi Yojana: మహిళలకు గుడ్న్యూస్.. రక్షాబంధన్ కానుక ఇవ్వనున్న సిద్ధరామయ్య సర్కారు
గతేడాది అక్టోబర్ లో రిలయన్ జియో 5జీ నెట్వర్క్ ని ప్రారంభించింది. అయితే ఈ రోజు జరిగిన ఏజీఎం సమావేశంలో 5జీ ప్లాన్స్ ప్రకటిస్తారని అంతా అనుకున్నప్పటికీ.. డిసెంబర్ లో ఫ్లాన్స్ అందుబాటులోకి వస్తాయని ముకేష్ అంబానీ వెల్లడించారు. కేవలం 9 నెలల్లోనే దేశంలోని 96 శాతం పట్టణ జనాభాకు జియో 5జీ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇదే అత్యంత వేగవంతమైన 5జీ విస్తరణ అని పేర్కొన్నారు.
అదనపు మూలధన వ్యయం లేకుండా జియో తన ప్రస్తుత 4జీ కస్టమర్ బేస్ ను సజావుగా 5జీగా మార్చడానికి మంచి స్థితిలో ఉందని ముకేష్ అంబానీ తెలిపారు. ప్రస్తుతం జియో 5జీ విస్తరణ సొంతగా, దేశీయంగా అభివృద్ధి చేయబడిన 5జీ స్టాక్ పై ఆధారపడి ఉందని తెలిపారు. భారతదేశ 5G విప్లవంలో జియోను తిరుగులేని నాయకుడిగా ఉందన్నారు.
తాజావార్తలు
-
CJP Protest: యూటర్న్ తీసుకున్న సీజేపీ ఉద్యమం.. క్షణాల్లో సీన్ మార్పు
-
2027 World Cup Squad: 2027 వరల్డ్ కప్ టీమిండియాలో సీనియర్లకు నో.. ఆ క్రికెటర్ ఎంచుకున్న 15 మంది ప్లేయర్లు వీరే..
-
CJP: బర్గర్ వివాదం.. సీజేపీ అధికార ప్రతినిధి తొలగింపు..
-
Ajay Bhupathi: ఆర్జీవీ మేకింగ్ స్టైల్కు ప్రత్యేక బ్రాండ్ ఉంది
-
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ఆదేశాలతో.. మన్యం జిల్లాకు రెండు కుంకీ ఏనుగులు..
ట్రెండింగ్
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!
-
తెలంగాణ ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ (TGTET-2026) నోటిఫికేషన్ విడుదల..!