Delhi Fire Accident: ఢిల్లీలో ఫైర్ యాక్సిడెంట్.. మంటలార్పేందుకు వచ్చిన సిబ్బందికి ప్రమాదం
- ఢిల్లీ కరోల్బాగ్లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం
- ఒక్కసారిగా ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించిన మంటలు
- 8 ఫైరింజన్లతో మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది
- మంటలను అదుపు చేస్తున్న క్రమంలో ప్రమాదం
- ఎల్పీజీ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది గాయాలు
- ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీ కరోల్బాగ్లోని ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఫ్యాక్టరీ మొత్తం వ్యాపించాయి. ఈ ఘటనపై వెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో 8 ఫైరింజన్లు అక్కడికి చేరుకుని.. రెస్క్యూ పనులు ప్రారంభించారు. అయితే.. అదృష్టవశాత్తూ మంటలు చెలరేగిన వెంటనే ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులు భవనం నుంచి వెళ్లిపోయారు. దీంతో ప్రాణపాయం తప్పింది.
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
అయితే.. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. అందులో ఉన్న ఎల్పీజీ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.. ఇద్దరు మినహా మిగిలిన వారందరూ డిశ్చార్జ్ అయ్యారు. కాగా.. భవనంలోని మూడో అంతస్తులో మంటలు చెలరేగాయి. ప్రాథమిక విచారణ అనంతరం షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నారు. క్రైమ్ టీమ్తో పాటు ఎఫ్ఎస్ఎల్ టీమ్ కూడా సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించాయి. అగ్నిప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రం వరకు మంటలు అదుపులోకి వచ్చాయి.
Read Also: CM Revanth Reddy : ఎయిర్పోర్ట్కు దగ్గర్లో ఫోర్త్ సిటీని నిర్మించబోతున్నాం
ఈ ప్రమాద ఘటనపై ఢిల్లీ ఫైర్ సర్వీస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ మాట్లాడుతూ.. బికనీర్లోని గురుద్వారా రోడ్లోని కరోల్ బాగ్ వెనుక భవనంలో మంటలు చెలరేగినట్లు మధ్యాహ్నం 1.36 గంటలకు తమ బృందానికి సమాచారం అందిందని తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే మోతీనగర్, ప్రసాద్నగర్ నుంచి ఎనిమిది అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకున్నాయి.. మంటలు చెలరేగిన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి నాలుగు అంతస్తులు ఉన్నాయని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
RAM 23 : రామ్ పోతినేని సినిమా టైటిల్ ఇదే.. మాస్ ఆడియన్స్కు కనెక్ట్ అవుతుందా?
-
Ramayana: ‘టాక్సిక్’ తర్వాత మరో భారీ పందెం.. ‘రామాయణం’పై దిల్ రాజు కన్ను? రూ.105 కోట్ల డీల్!
-
Akkineni Nagarjuna : 29న నాగార్జున ‘కింగ్ 100’ క్రేజీ గ్లింప్స్ బ్లాస్ట్.. అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ అప్డేట్
-
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి ఊహించని డబ్బు!
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!