Road Accident: కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
- కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదం..
- కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర ప్రమాదం..
- ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం.. తీవ్రంగా గాయపడిన ఐదుగురు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లాలో రోడ్డు ప్రమాదంతో వేకువ ఝామున రహదారి నెత్తురోడింది. ఇవాళ (శుక్రవారం) ఉదయం కృత్తివెన్ను మండలం సీతనపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురిని చికిత్స కోసం మచిలీపట్నం ప్రభుత్వ హస్పటల్ కు తరలించారు. రొయ్యల ఫీడ్తో వెళ్తున్న కంటెయినర్ను బొలెరో వాహనం ఢీ కొట్టడంతో ఈ దారుణం జరిగింది. మృతుల్లో ఐదుగురు కోనసీమ అంబేద్కర్ జిల్లా తాళ్లరేవుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. మరో మృతదేహం కంటెయినర్ డ్రైవర్ది కాగా.. అతని పేరు, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
Read Also: Coolie : రజనీకాంత్ ‘కూలీ’ లో పవర్ ఫుల్ రోల్ చేస్తున్న ఫహాద్ ఫాజిల్..?
Also Read
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Gudivada Temple : గుడివాడలో ఘోరం.. స్వామివారి బంగారు కిరీటాన్ని తాకట్టు.!
- Perni Nani: ఆర్టీసీని సర్వనాశనం చేశారు.. మహిళలపై నెపం వేస్తున్నారు..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. రొయ్యల ఫీడ్తో పాండిచ్చేరి నుంచి భీమవరం ఆ కంటెయినర్ వెళ్తుండగా.. బొలెరో వ్యాన్ తాళ్లరేవు నుంచి కృత్తివెన్ను మండలం మునిపెడ వైపుకు వెళ్తుంది. అయితే, పుల్లల లోడుతో వెళ్తున్న ఓ ట్రాక్టర్ ను బొలెరో డ్రైవర్ అతివేగంగా ఓవర్ టేక్ చేస్తున్న సమయంలో కంటెయినర్కు ఢీ కొట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దీంతో ఆ సంఘటన ప్రదేశం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తెల్లవారుజామున నాలుగు గంటలకు ప్రమాదం చోటు చేసుకోవడంతో రెండు మూడు కిలో మీటర్ల పొడవున ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు.
తాజావార్తలు
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
-
IND vs SL Test Series: ఆగస్టు 15 నుంచి భారత్-శ్రీలంక టెస్ట్ సమరం.. షెడ్యూల్ విడుదల.!
-
Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!