Maharashtra: లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ, శివసేన మధ్య సీట్ల పంపకాలపై ఉత్కంఠ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2024 లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ-శివసేన పొత్తులు అంతా సవ్యంగా సాగడం లేదన్న చర్చ ప్రస్తుతం జోరుగా జరుగుతోంది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు, ఎంపీ శ్రీకాంత్ షిండే కళ్యాణ్ లోక్సభ స్థానంపై థానే బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ హాట్ కామెంట్స్ చేశారు. అక్కడ బీజేపీ సహాయం లేకుండా థానే నుంచి ఎవరూ ఎన్నిక కాలేరని ఆయన వ్యాఖ్యనించారు. కళ్యాణ్తో పాటు, థానే, పాల్ఘర్ లోక్సభ స్థానాల్లో కూడా బీజేపీ అధిష్టానం గురించి కేల్కర్ మాట్లాడారు.
Also Read : Bhopal Fire Accident: భోపాల్లోని సాత్పురా భవన్లో అగ్ని ప్రమాదం
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
కళ్యాణ్- థానే ఒకే లోక్సభ నియోజకవర్గంగా ఉన్నప్పుడు.. అప్పటి నుంచి బీజేపీ అగ్రనేతలు ఇక్కడ నుంచే ఎన్నికయ్యారని బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ కేల్కర్ అన్నారు. రాంభౌమల్గి, జగన్నాథ్ పాటిల్ అక్కడి నుంచి ఎంపీలుగా పని చేశారు. చింతామన్ వనగా పాల్ఘర్ 9 సార్లు పోటీ చేశారు.. 4 సార్లు ఎన్నికయ్యారు. అక్కడ కాంగ్రెస్, కమ్యూనిస్టులతో బీజేపీ చాలాకాలం పాటు పోరాడింది అని ఆయన అన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీట్లు శివసేనకు దక్కాయి.. అయితే, శివసేన గెలుపు కోసం మా కార్యకర్తలు అక్కడ తీవ్రంగా కష్టపడ్డారు అని కేల్కర్ తెలిపారు.
Also Read : Tamannaah Bhatia: అవును, ఆ సంబంధం ఉంది.. రూమర్స్పై తమన్నా క్లారిటీ
కళ్యాణ్ లోక్సభ నియోజకవర్గంలో ఇటీవల స్థానిక బీజేపీ నేతలు సమావేశం అయ్యారు. ఈ సీటుపై శివసేనకు బీజేపీ మద్దతివ్వబోదని ఇందులో తీర్మానం చేశారు. దీంతో శ్రీకాంత్ షిండే దానిపై స్పందించారు. 2024లో ప్రజలందరూ నరేంద్ర మోడీని మళ్లీ ఈ దేశానికి ప్రధానిగా ఎన్నుకోవాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు. ఇందుకోసం మా వంతు ప్రయత్నం చేస్తామని శ్రీకాంత్ షిండే తెలిపాడు.
Also Read : Health Tips: రోజంతా యాక్టివ్ గా ఉండాలంటే ఉదయం వీటిని తప్పక తీసుకోవాలి..
కానీ డోంబివిలికి చెందిన కొందరు నాయకులు శివసేన-బీజేపీ కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. నేను వ్యక్తిగతంగా ఏ పదవికి ఆశపడను అని శ్రీకాంత్ షిండే అన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేయాలనేది శివసేన-బీజేపీ కూటమి సీనియర్ నేతలు నిర్ణయించనున్నారు. నేను నామినేషన్ వేయకున్నా.. అభ్యర్థి ఎవరంటే.. ప్రచారం చేసి గెలిపిస్తామని శ్రీకాంత్ షిండే వెల్లడించారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!