Subhash Maharia: కాంగ్రెస్కు భారీ షాక్.. బీజేపీలో చేరనున్న కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Subhash Maharia: రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా కాంగ్రెస్ను వీడి నేడు బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి సుభాష్ మహరియా ప్రకటించారు. ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరే అవకాశం ఉంది. అశోక్ గెహ్లాట్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ల మధ్య వాగ్వాదం నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నారు. సుభాష్ మహరియా 2016లో కాంగ్రెస్కు మారడానికి ముందు బీజేపీలో ఉన్నారు. ఆయన 2019లో సికర్ లోక్సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి స్వామి సుమేదానంద సరస్వతి చేతిలో ఓడిపోయారు.
2019 లోక్సభ ఎన్నికల సమయంలో రాజస్థాన్లోని 25 సీట్లలో 24 స్థానాలను బీజేపీ కైవసం చేసుకోగా.. రాష్ట్రీయ లోక్దళ్ (RLD) కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకుంది. కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాలేదు. సికార్ పార్లమెంటరీ స్థానంలో కాంగ్రెస్ ఓడిపోయిన నేపథ్యంలో పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు రాసిన లేఖలో సుభాష్ మహరియా ఆరోపించారు. 2019లో రాజస్థాన్లోని మొత్తం 25 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అయినప్పటికీ ఎలాంటి సమీక్షా సమావేశం నిర్వహించలేదని లేఖలో ఆయన పేర్కొన్నారు, దాని కాపీని తన ట్విట్టర్ హ్యాండిల్కు జత చేశారు.
Also Read
- Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
- Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
- Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
- Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
Read Also: Tina Dabi: పాక్ హిందూ శరణార్థుల నివాసాలు బుల్డోజర్తో కూల్చివేత.. మరోసారి వార్తల్లో టీనా దాబి
సికార్లోని కాంగ్రెస్ కార్యకర్తలు అవమానాలను ఎదుర్కొంటున్నారని సుభాష్ మహరియా నొక్కిచెప్పారు. అటువంటి పరిస్థితిలో తాను ఇకపై పార్టీలో ఉండటం సాధ్యం కాదన్నారు.ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, రైతులు, యువతతో సహా ప్రజలు మోసపోయారని ఆయన ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాంగ్రెస్ మర్చిపోయిందని, రాష్ట్రంలో రైతుల రుణాలు మాఫీ చేయలేదని, యువతకు ఉపాధి కల్పించలేదని, కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. సుభాష్ మహరియా 1999 నుండి 2004 వరకు ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హయాంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. అతను సికార్ లోక్సభ నియోజకవర్గం నుండి మూడుసార్లు.. 1998, 1999, 2004లో గెలిచారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
తాజావార్తలు
-
Cooking Oil: 850, 900 గ్రాముల ప్యాకింగ్కు బ్రేక్.. వంట నూనెల దోపిడీపై కేంద్రం సంచలన నిర్ణయం..
-
Goa: గోవాలో ఘోరం.. రోడ్డుపై చెత్త వేస్తున్న వీడియో వైరల్.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
-
Vaibhav Vs Kohli: యుద్ధానికి సిద్ధం అవుతున్న వైభవ్ సూర్యవంశీ.. ఫస్ట్ టార్గెట్ కోహ్లీ రికార్డే..
-
Physical Harassment : నర్సింగ్ విద్యార్థినిపై వేధింపుల కలకలం.. ట్యూటర్పై కేసు, ఉద్యోగానికి గుడ్బై.!
-
Annamalai: బీజేపీకి రాజీనామా.. 24 గంటల్లోనే అన్నామలైకి అపూర్వ మద్దతు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!