Tina Dabi: పాక్ హిందూ శరణార్థుల నివాసాలు బుల్డోజర్తో కూల్చివేత.. మరోసారి వార్తల్లో టీనా దాబి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tina Dabi: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 2015 టాపర్గా నిలిచి సెకండ్ ర్యాంకర్ను వివాహమాడి.. రెండేళ్లకే విడాకులు తీసుకున్న ఐఏఎస్ అధికారి టీనా దాబి.. గతేడాది మళ్లీ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచింది. ప్రస్తుతం జైసల్మేర్ జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తోన్న టీనా దాబి.. వివాదాస్పద నిర్ణయంతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. ఐఏఎస్ టీనా దాబీ ఆదేశాల మేరకు పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన హిందువుల తాత్కాలిక నివాసాలను బుల్డోజర్తో అధికారులు కూల్చివేశారు. జైసల్మేర్ జిల్లా కేంద్రానికి 4 కిలోమీటర్ల దూరంలోని అమర్సాగర్ గ్రామంలోని వీరి గుడారాలను కూల్చివేయడంతో వలసదారులు ఆందోళనకు దిగారు. తమ ఇళ్లను తగులబెట్టారని, అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న మహిళను బలవంతంగా ఈడ్చుకెళ్లారంటూ వారు ఆరోపణలు చేశారు. అయితే, తమకు వేరే చోట పునరావాసం కల్పించే వరకు తమ ధర్నాను విరమించేది లేదని వలసదారులు ఆందోళనను కొనసాగించారు. ఇదిలా ఉండగా.. తన నిర్ణయాన్ని టీనా దాబీ సమర్ధించుకున్నారు. అమర్సాగర్ సర్పంచ్, స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగానే చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ప్రభుత్వ స్థలం నుంచి పాక్ హిందూ వలసవాదులు ఖాళీ చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Read Also: Honeymoon: హనీమూన్లో అశ్లీల వీడియోలు తీసి బెదిరింపు.. రూ.10 లక్షలిస్తేనే శోభనం
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
పాక్ నుంచి వచ్చిన వలసదారులు సర్కారుకు చెందిన భూమిని ఆక్రమించారని టీనాదాబీ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పట్టణ అభివృద్ధి ట్రస్ట్ భూమిని ఖాళీ చేయమని శరణార్థులకు ముందస్తు నోటీసులు కూడా అందించామని, అయితే వారు స్పందించలేదని ఆమె పేర్కొన్నారు. ఇప్పటి వరకు 28 ఆక్రమణలు తొలగించారు. భారత పౌరసత్వం పొందని వలసదారుల పునరావాసానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయలేదంటూ టీనా దాబి చెప్పారు. ఈ అంశంపై నెట్టింట తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాకిస్థాన్ నుంచి వచ్చిన శరణార్థ పేద దళిత హిందువుల పట్ల రాజస్థాన్ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోంచిందని నెటిజన్లు మండిపడుతున్నారు.
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..