Kakani Govardhan Reddy: నిరుద్యోగ భృతి ఊసేలేదు.. తల్లికి వందనంను ఎగ్గొట్టారు!
- ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం నీరుగారుస్తోంది
- మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది
- విద్యా రంగాన్ని సీఎం దెబ్బ తీస్తున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కూటమి ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చిందని, ఇంతవరకూ ఆ ఊసే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం నీరుగారుస్తోందని, బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది తల్లికి వందనంను ఎగ్గొట్టారని, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. వైసీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైందని మాజీ మంత్రి కాకాణి చెప్పుకొచ్చారు. నెల్లూరులో వైసీపీ ఆధ్వర్యంలో ‘యువత పోరు’ కార్యక్రమం జరిగింది. వీఆర్ కళాశాల సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ కొనసాగింది.
‘యువత పోరు’ కార్యక్రమంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ… ‘సమున్నత ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ను ప్రభుత్వం నీరుగారుస్తోంది. బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూడా ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోంది. నిరుద్యోగులకు భృతి చెల్లిస్తామని హామీ ఇచ్చారు, ఇంతవరకూ ఆ ఊసే లేదు. ఈ ఏడాది తల్లికి వందనాన్ని ఎగ్గొట్టారు, వచ్చే ఏడాది నుంచి ఇస్తామని చెబుతున్నారు. బడ్జెట్లో రూ.8 వేల కోట్లను మాత్రమే కేటాయించారు. ఈ పథకానికి రూ.16వేల కోట్ల నిధులు అవసరమవుతాయి. విద్యా రంగాన్ని సీఎం చంద్రబాబు దెబ్బ తీస్తున్నారు. వైసీపీ హయాంలో విద్యారంగం ఎంతో పటిష్టంగా తయారైంది. నాడు-నేడుతో పాఠశాలలకు కొత్త రూపును మాజీ సీఎం వైఎస్ జగన్ తీసుకువచ్చారు’ అని అన్నారు.
Also Read
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
- Airbus C295: భారత రక్షణ రంగంలో చారిత్రాత్మక ఘట్టం.. గగనతలంలోకి తొలి 'మేడ్ ఇన్ ఇండియా' మిలిటరీ విమానం..
- Women's T20 World Cup 2026 టైటిల్ గెలిచే సత్తా ఉందా.? హర్మన్ప్రీత్ సేన బలాలు, బలహీనతలు ఇవే.!
మరోవైపు కర్నూలు కలెక్టరేట్ ముందు వైసీపీ ఆధ్వర్యంలో ఫీజు పోరు ఆందోళన చేపట్టారు. గౌరీ గోపాల్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని.. నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఫీజు పోరు కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీదేవి, సాయి ప్రసాద్ రెడ్డి, కోడుమూరు సమన్వయకర్త ఆదిమూలపు సతీష్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Free Food Train: ఉచిత భోజనం అందించే ఏకైక రైలు… ఆ భోజనం ఎంత రుచిగా ఉంటుందంటే, ప్రయాణికులు వేళ్లు కూడా నాక్కుంటారు!
-
Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
-
Sick Leave Denial Case: ‘సిక్ లీవ్ కావాలి’ అని వేడుకున్నా కనికరించని బాస్.. చివరకు ఆఫీస్ వాష్రూమ్లో మృతి!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!