Sharad Pawar: సమయం వచ్చినప్పుడు అందరూ నాతో ఉంటారు.. ఎన్సీపీ అధినేత కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత 24 గంటల్లో మహారాష్ట్ర రాజకీయాలు చాలా మలుపులు తిరిగాయి. అజిత్ పవార్ తిరుగుబాటు తర్వాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పగ్గాలు చేపట్టారు. సోమవారం సతారాలో విలేకరుల సమావేశంలో శరద్ పవార్ మాట్లాడుతూ.. అధికార దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అయితే సమయం వచ్చినప్పుడు అందరూ నా వెంటే ఉంటారని శరద్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు నేటి నుంచి మార్పు మొదలవుతుందని, ఎన్సీపీ మరింత పటిష్టంగా ముందుకు సాగుతుందని, ప్రజల మద్దతు తమకు ఉంటుందని శరద్ పవార్ తెలిపారు. ఈ ప్రేమ ఇలాగే కొనసాగితే రూపురేఖలు మారిపోవడం ఖాయం అని ఎన్సీపీ అధినేత పేర్కొన్నారు. దేశంలో భిన్నమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని.. పార్టీ కార్యకర్తలు ఇప్పటికీ తమతోనే ఉన్నారని శరద్ పవార్ తెలిపారు.
Good Night: డిస్నీ+హాట్ స్టార్లో సందడి చేస్తున్న ‘గుడ్ నైట్’
Also Read
- Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
- CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
- Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
- Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
మరోవైపు మహారాష్ట్ర ఎన్సీపీ అధ్యక్షుడిగా జయంత్ పాటిల్ ఉన్నారని, కాబట్టి అజిత్ పవార్ మాటలకు ప్రాముఖ్యత లేదని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ అన్నారు. అజిత్ పవార్ తీసుకున్న నిర్ణయం ఆయన వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు. తనను విడిచిపెట్టిన ఎమ్మెల్యేల గురించి శరద్ పవార్ను ప్రశ్నించగా.. వారందరి భవితవ్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తేలిపోతుందని ఆ విషయంపై తాను మాట్లాడబోనని చెప్పారు. మరోవైపు మీడియా సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీని కూడా శరద్ పవార్ టార్గెట్ చేశారు. కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ ఎన్సీపీపై అవినీతి ఆరోపణలు చేశారని, అయితే ఇప్పుడు అదే పార్టీకి చెందిన వారిని ప్రభుత్వంలో చేర్చుకున్నారని పవార్ అన్నారు. పార్టీని వీడిన వారెవరూ నాతో మాట్లాడలేదని శరద్ పవార్ అన్నారు.
Sharad Pawar: కొంతమంది బలైపోయారు.. అజిత్ తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
ఓ వైపు పార్టీ నిర్వహణలో శరద్ పవార్ బిజీగా ఉంటే మరోవైపు తిరుగుబాటు చేసిన అజిత్ పవార్పై చర్యలు మొదలయ్యాయి. ఎన్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ అజిత్ పవార్ను పార్టీ నుండి బహిష్కరిస్తున్నారని, అలాగే పార్టీ పేరు మరియు ఎన్నికల గుర్తును ఉపయోగించరాదని తెలియజేస్తూ ఆయనకు లేఖ రాశారు. అలా చేయడం ద్వారా అజిత్ పవార్పై పార్టీ చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని జయంత్ పాటిల్ అంటున్నారు.
తాజావార్తలు
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
-
Aata Sandeep: డ్యాన్సర్ల కష్టార్జితంపై రూపాయి కమిషన్ తీసుకోను: సందీప్ సంచలన ప్రకటన!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!