Nikhil Gupta : ఉగ్రవాది పన్ను హత్య కేసు.. నిఖిల్ గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్
- పన్నూ హత్యకు కుట్ర పన్నిన నిందుతుడు నిఖిల్ గుప్తా
- గుప్తాను అమెరికాకు అప్పగించిన చెక్ రిపబ్లిక్
- న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో హాజరుపరిచే అవకాశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nikhil Gupta : అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నిన నిందితుడు నిఖిల్ గుప్తాను చెక్ రిపబ్లిక్ అప్పగించింది. నిఖిల్ గుప్తాను అమెరికాకు పంపారు. అమెరికా పరిపాలన అభ్యర్థన మేరకు నిఖిల్ గుప్తాను గతేడాది జూన్లో అరెస్టు చేశారు. ఖలిస్థాన్ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు వచ్చాయి. సోమవారం న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో నిఖిల్ గుప్తాను హాజరుపరిచే అవకాశం ఉంది. ప్రస్తుతం అతన్ని బ్రూక్లిన్లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. అమెరికాలో ఉంటూనే పన్ను భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండే వాడు. అతను తరచుగా హిందువులను బెదిరించేవాడు. పన్నూ హత్యకు భారత అధికారులతో కలిసి గుప్తా కుట్ర పన్నాడని యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూషన్ పేర్కొంది. దీని తర్వాత గుప్తాను ప్రేగ్లో అరెస్టు చేశారు.
Read Also:Delhi Water Crisis: పైప్ లైన్లను ధ్వంసం చేస్తున్నారని మంత్రి అతిషి ఆరోపణలు..(వీడియో)
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
- Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
- Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
నిఖిల్ గుప్తా చెక్ రిపబ్లిక్లో అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్ తిరస్కరణకు గురైంది. పన్నూని హత్య చేయడానికి గుప్తా ఒక హిట్మ్యాన్ని నియమించడానికి ప్రయత్నించాడని అమెరికా ప్రభుత్వం చెబుతోంది. పన్నుకు అమెరికా, కెనడా ద్వంద్వ పౌరసత్వం ఉంది. యూఏపీఏ కింద అతడిని ఉగ్రవాదిగా భారత్ ప్రకటించింది. 23 నవంబర్ 2023న, నిఖిల్ గుప్తాను అప్పగించడాన్ని ప్రేగ్ హైకోర్టు ఆమోదించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా గుప్తా రాజ్యాంగ ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ను కూడా తిరస్కరించారు. అమెరికా అందించిన ఆధారాలు, పత్రాలను పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోర్టు తెలిపింది. 80 లక్షల నగదు ఇస్తానని నిఖిల్ గుప్తా హామీ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. గుప్తాకు భారత అధికారి నుంచి సూచనలు అందుతున్నాయని కూడా ఆరోపణలు వచ్చాయి. అయితే ఏ అధికారి పేరు చెప్పలేదు.
Read Also:Rain Alert: మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..
తాజావార్తలు
-
MEA: కరాచీ దాడిని భారత్పై నెట్టొద్దు.. పాక్పై ఘాటు వ్యాఖ్యలు..
-
Saudi Arabia: సౌదీలో హెలికాప్టర్ క్రాష్.. 14 మంది మృతి..
-
Gold and Silver Price: ఇన్వెస్టర్లకు షాక్.. వచ్చే వారం భారీగా మారనున్న గోల్డ్, సిల్వర్ ధరలు! ఎందుకో తెలుసా?
-
Bank Holidays: జూలైలో బ్యాంక్లకు ఏకంగా 12 రోజులు హాలిడేస్.. ఏ ఏ రోజుల్లో సెలవులు ఉన్నాయో క్లియర్గా తెలుసుకోండి!
-
Zero Income Tax: జీతం రూ.20 లక్షలు.. అయినా ట్యాక్స్ కట్టేది సున్నా.. సీఏ చెప్పిన సీక్రెట్ ఇదే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!