Etela Rajender : రాష్ట్రంలో కౌలు రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్లో రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే.. తాజాగా ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం లో ప్రతి పక్ష పార్టీలు ఉండొద్దని గందరగోళం సృష్టించాలని కేసీఆర్ అనుకున్నాడని, కాంగ్రెస్ నేతలను ప్రలోభ పెట్టి తీసుకుపోయారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజల చేతిలో చిక్కి తానే నాశనం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నాడని, తెలంగాణ పల్లెల్లో బీఆర్ఎస్కు ఓటమి తప్పదు అనే ఒకటే చర్చ జరుగుతోందన్నారు. ఈ కేసీఆర్కు ఓటు వేయద్దని డిసైడ్ అయ్యారని, కౌలు రైతులు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారని వ్యాఖ్యానించారు.
Also Read : WeWantJusticeForShyamNTR: శ్యామ్ మృతిపై స్పందించిన పోలీసులు.. ఏమన్నారంటే..?
Also Read
తెలంగాణ మోడల్ కావాలని ఇతర రాష్ట్రాల లో చెబుతున్న కేసీఆర్ కౌలు రైతులకు ఏమీ చేస్తున్నావో చెప్పు అని ఆయన అన్నారు. ధరణి వచ్చాక పేదల భూములు మాయమై పోయాయని, కేసీఆర్ కుటుంబం కబ్జాలకు పనికి వచ్చిందని, వాళ్ళకు పైసలు తెచ్చి పెట్టిందన్నారు. ధరణి పై మొన్ననే జేపీ నడ్డా చెప్పారు.. బీజేపీ అధికారంలోకి వచ్చాక నష్ట పోయిన వారికి న్యాయం చేస్తామన్నారు. సర్వేలకు అందని ఫలితాలు తెలంగాణలో వస్తాయన్నారు. మా కార్యకర్తలు ఇంటింటికి బీజేపీ పేరుతో వెళితే మంచి స్పందన వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలకు ఇంకా 6 నెలల సమయం ఉందని, ఎక్కడ ఎన్నికలు జరిగిన బీజేపీ గెలిచిందని, లేక అధికార పార్టీ గెలిచిందన్నారు. కేంద్ర నాయకత్వం పూర్తి స్థాయి దృష్టి పెట్టిందని, చాప కింద నీరులా బీజేపీ పని జరుగుతుందన్నారు ఈటల రాజేందర్.
Also Read : Coconut Burfi : కొబ్బరి బర్ఫిని ఇలా చేసుకోవచ్చు.. టేస్ట్ చూస్తే వదలరు…!
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!