Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని, ప్రధాని నరేంద్ర మోడీకి ‘బ్రెయిన్చైల్డ్’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ చివరి దశలో ఉన్న రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పొందిన నిధులను శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. “రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల బాండ్లను (స్కీమ్) రూపొందించినట్లు కొన్నేళ్ల క్రితం ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ల నుండి డబ్బును దోపిడీ చేసే మార్గం అని తేలింది. ఇది కార్పొరేట్లను భయపెట్టడానికి ఉద్దేశించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని.. విచారణ జరుగుతుందని ఆశిస్తున్నాను.” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also: Turkiye: తుర్కియే తీరంలో పడవ ప్రమాదం.. 16 మంది మృతి
Also Read
- UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
- Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
- Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Tamil Nadu: మరో వివాదంలో విజయ్ సర్కార్.. బస్సుల రంగులపై రాజకీయ రచ్చ
కొన్ని కంపెనీలు కాంగ్రెస్కు ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నడుస్తున్న రాష్ట్రాల్లో కాంట్రాక్టులు పొందడం గురించి అడిగిన ప్రశ్నకు ఆయనకు సమాధానమిచ్చారు. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు ఏవీ జాతీయ స్థాయిలో హైవే, డిఫెన్స్ కాంట్రాక్టులను నియంత్రించలేదని అన్నారు. వారు ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను నియంత్రిస్తారు లేదా ప్రజల ఫోన్లలో ‘పెగాసస్’ (నిఘా సాఫ్ట్వేర్) ఉంచుతారని ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Read Also: CAA: సీఏఏ దరఖాస్తుదారుల కోసం మొబైల్ యాప్.. ప్రారంభించిన కేంద్రం
“కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన కాంట్రాక్టులకు, ఇచ్చిన నిధులకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ పేర్కొన్నారు. కాంట్రాక్టులు ఇచ్చిన నెలరోజుల తర్వాత, కంపెనీలు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చాయని.. సీబీఐ, ఈడీ కేసులు పెట్టాయని, ఆపై కార్పొరేట్లు బీజేపీకి డబ్బులు ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. ఈ పథకం కార్పొరేట్లకు అనామకంగా డబ్బును విరాళంగా ఇవ్వడానికి ఉద్దేశించబడిందని ఆయన చెప్పారు. ఇంతకంటే దేశ వ్యతిరేకం మరొకటి ఉండదని కాంగ్రెస్ నేత అన్నారు. ఈడీ, సీబీఐలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలుగా మారాయని, ఏదో ఒక రోజు బీజేపీ ప్రభుత్వం పడిపోతుందని, అలాంటి చర్యలకు శిక్ష పడుతుందని అన్నారు. ఇలాంటివి ఇంకెప్పుడూ జరగవని ఇది నా గ్యారెంటీ అని ఆయన అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా ఇటీవల నిష్క్రమణ గురించి అడిగిన ప్రశ్నకు, వారు వెళ్లినప్పటికీ మహారాష్ట్రలో పార్టీ చెక్కుచెదరకుండా ఉందని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రికార్డు మెజార్టీతో లోక్సభ స్థానాలను గెలుచుకుంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UPI Charges: ఎవరు చెల్లించాలి? ఎవరు అవసరం లేదు?.. ఇంకా సందేహాలా..? పూర్తి వివరాలు ఇవే
-
Assembly Protest: దివ్యాంగుల అసెంబ్లీ ముట్టడి.. పోలీసుల అడ్డగింత.!
-
Bollywood: ‘హనుమాన్ అంశ్’ తర్వాత బాలీవుడ్లో భక్తి సినిమాల జోరు.. వరుసగా కొత్త ప్రాజెక్టులు!
-
Bhatti Vikramarka: ఇంధన సామర్థ్యమే మరో విద్యుత్ కేంద్రం.. డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
Asia Cup Trophies: బీసీసీఐ కీలక అప్డేట్.. త్వరలో భారత్కు ఆసియా కప్ ట్రోఫీలు!
ట్రెండింగ్
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!