Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని, ప్రధాని నరేంద్ర మోడీకి ‘బ్రెయిన్చైల్డ్’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. తన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ చివరి దశలో ఉన్న రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పొందిన నిధులను శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించారని పేర్కొన్నారు. లోక్సభ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేయాలా వద్దా అనేది కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ, పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిర్ణయిస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. “రాజకీయ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ఎన్నికల బాండ్లను (స్కీమ్) రూపొందించినట్లు కొన్నేళ్ల క్రితం ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇది భారతదేశంలోని అతిపెద్ద కార్పొరేట్ల నుండి డబ్బును దోపిడీ చేసే మార్గం అని తేలింది. ఇది కార్పొరేట్లను భయపెట్టడానికి ఉద్దేశించబడింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని.. విచారణ జరుగుతుందని ఆశిస్తున్నాను.” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Read Also: Turkiye: తుర్కియే తీరంలో పడవ ప్రమాదం.. 16 మంది మృతి
Also Read
- CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
- Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
- Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
- CI Nagaraju-SIT: సాయికృష్ణ హత్య కేసు.. సిట్ విచారణకు సహకరించని సీఐ నాగరాజు!
కొన్ని కంపెనీలు కాంగ్రెస్కు ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇవ్వడం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు నడుస్తున్న రాష్ట్రాల్లో కాంట్రాక్టులు పొందడం గురించి అడిగిన ప్రశ్నకు ఆయనకు సమాధానమిచ్చారు. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వాలు ఏవీ జాతీయ స్థాయిలో హైవే, డిఫెన్స్ కాంట్రాక్టులను నియంత్రించలేదని అన్నారు. వారు ఐటీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను నియంత్రిస్తారు లేదా ప్రజల ఫోన్లలో ‘పెగాసస్’ (నిఘా సాఫ్ట్వేర్) ఉంచుతారని ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు.
Read Also: CAA: సీఏఏ దరఖాస్తుదారుల కోసం మొబైల్ యాప్.. ప్రారంభించిన కేంద్రం
“కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇచ్చిన కాంట్రాక్టులకు, ఇచ్చిన నిధులకు ఎలాంటి సంబంధం లేదని రాహుల్ పేర్కొన్నారు. కాంట్రాక్టులు ఇచ్చిన నెలరోజుల తర్వాత, కంపెనీలు బీజేపీకి ఎలక్టోరల్ బాండ్లను విరాళంగా ఇచ్చాయని.. సీబీఐ, ఈడీ కేసులు పెట్టాయని, ఆపై కార్పొరేట్లు బీజేపీకి డబ్బులు ఇచ్చారని రాహుల్ ఆరోపించారు. ఈ పథకం కార్పొరేట్లకు అనామకంగా డబ్బును విరాళంగా ఇవ్వడానికి ఉద్దేశించబడిందని ఆయన చెప్పారు. ఇంతకంటే దేశ వ్యతిరేకం మరొకటి ఉండదని కాంగ్రెస్ నేత అన్నారు. ఈడీ, సీబీఐలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంస్థలుగా మారాయని, ఏదో ఒక రోజు బీజేపీ ప్రభుత్వం పడిపోతుందని, అలాంటి చర్యలకు శిక్ష పడుతుందని అన్నారు. ఇలాంటివి ఇంకెప్పుడూ జరగవని ఇది నా గ్యారెంటీ అని ఆయన అన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు అశోక్ చవాన్, మిలింద్ దేవరా ఇటీవల నిష్క్రమణ గురించి అడిగిన ప్రశ్నకు, వారు వెళ్లినప్పటికీ మహారాష్ట్రలో పార్టీ చెక్కుచెదరకుండా ఉందని అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు రికార్డు మెజార్టీతో లోక్సభ స్థానాలను గెలుచుకుంటాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Sachin Tendulkar-ICC: హ్యాట్సాఫ్.. ఐసీసీపై సచిన్ టెండూల్కర్ ప్రశంసల జల్లు!
-
CM Revanth Reddy: SIRపై నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు.. కాంగ్రెస్ నేతలకు సీఎం కీలక సూచనలు..
-
160cc Bikes: మంచి మైలేజ్ కోసం చూస్తున్నారా?.. 160cc సెగ్మెంట్లో బెస్ట్ బైక్లు ఇవే..!
-
Vaibhav sooryavanshi: వైభవ్ జపం.! భారత్లోనే కాదు.. పాకిస్థాన్లోనూ బుడ్డోడి క్రేజ్ మాములుగా లేదుగా..
-
Water Bottle Cleaning: మీరు నీళ్లు తాగే బాటిల్ శుభ్రంగా ఉందా.? బ్యాక్టీరియా, దుర్వాసన రాకుండా ఇలా చేసేయండి.!
ట్రెండింగ్
-
Pesara Payasam: స్వీట్ తినాలినిపిస్తుందా.? తీపి + హెల్తీ ‘పెసరపప్పు పాయసం’ చేసేయండి ఇలా.!
-
Jharkhand Stampede: ఆర్సీబీ లాంటి మరో తొక్కిసలాట ఘటన.. అభిమానులకు తీవ్ర గాయాలు, జస్ట్ మిస్!
-
AUS W vs PAK W: పెర్రీ సూపర్ షో.. పాకిస్థాన్పై 113 పరుగుల భారీ విజయంతో సెమీఫైనల్ లోకి ఆసీస్.!
-
Toilet Cleaning : టాయిలెట్ క్లీనింగ్ చేస్తున్నారా..? అయితే ఈ 5 ఘోరమైన పొరపాట్లు అస్సలు చేయకండి.!
-
Cockroach Control : ఫ్రిజ్లో బొద్దింకల బెడదా.? ఈ సింపుల్ ట్రిక్తో చెక్ పెట్టండి..!