ఆదివారం ముంబై వేదికగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇటీవల కాంగ్రెస్ను వీడిన సీనియర్ నేత అమ్మ సోనియాను కలిసి కన్నీటిపర్యంతం అయ్యారని..
Bharat Jodo Nyay Yatra: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన రెండో రోజు ఇండియా కూటమి బలప్రదర్శన నిర్వహించింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ఈ రోజు ముంబైలో ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి ఇండియా కూటమి నేతలు హాజరయ్యారు. 63 రోజుల పాటు జరిగిన ఈ యాత్ర ముగింపు వేడుకలు ముంబైలోని శివాజీ పార్క్లో జరిగాయి. ఈ కార్యక్రమానికి తేజస్వీ యాదవ్, ఎంకే స్టాలిన్, మల్లికార్జున్ ఖర్గే, శరద్ పవార్,…
Lok Sabha Election : ఎలక్షన్ కమిషన్ ఎలక్టోరల్ బాండ్ డేటాను విడుదల చేసినప్పటి నుండి, కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుంది.
ఎలక్టోరల్ బాండ్ల పథకం ప్రపంచంలోనే అతిపెద్ద దోపిడీ రాకెట్ అని, ప్రధాని నరేంద్ర మోడీకి ‘బ్రెయిన్చైల్డ్’ అని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం ఆరోపించారు. తన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' చివరి దశలో ఉన్న రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఈ పథకం ద్వారా పొందిన నిధులను శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలను విభజించి, ప్రభుత్వాలను పడగొట్టడానికి ఉపయోగించారని పేర్కొన్నారు.
Congress: పెట్రోల్-డిజిల్ ధరలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్న తరుణంలో కేంద్రం ఇంధన ధరల్ని మార్చి 15 నుంచి రూ. 2 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పెట్రోల్-డిజిల్ ధరల తగ్గింపు వినియోగదారుల వ్యయాన్ని పెంచుతుందని, 27 లక్షల ద్విచక్రవాహనాలు, 58 లక్షల భారీ వాహనాలు, 6 కోట్ల కార్ల నిర్వహణ ఖర్చుల్ని తగ్గిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే, ఈ తగ్గింపును రాహుల్ గాంధీ ఘనతగా కాంగ్రెస్ చెబుతోంది. కాంగ్రెస్ నేత నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రభావం…
Rahul Gandhi: తాము అధికారంలోకి వస్తే రైతుల ప్రయోజనాలను రక్షిస్తామని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్తో కలిసి గురువారం మహారాష్ట్రలోని నాసిక్లో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా 'కిసాన్ మహాపంచాయత్'లో ప్రసంగించారు. నాసిక్ ఉల్లి, ద్రాక్ష, టొమాటోల సాగుకు ప్రసిద్ధి. మహాపంచాయత్ సభ సందర్భంగా రైతులు తమ కష్టాలను చెప్పుకున్నారు.
Bharat Jodo Nyay Yatra: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇండియా కూటమి బలాన్ని చూపేందుకు కాంగ్రెస్ మరోసారి భారీ కార్యక్రమానికి తెరతీసింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న ‘‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’’ మార్చి 17న ముంబైలో ముగియనుంది. ఈ కార్యక్రమానికి ఇండియా కూటమి నేతల్ని మల్లికార్జున ఖర్గే ఆహ్వానిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎన్నికల మోడ్లో ఉందని, దూకుడుగా ప్రచారం చేస్తామని అన్నారు.
Rahul Gandhi : రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర ఇప్పుడు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం గుజరాత్ లో పార్టీ ఆశలకు రాహుల్ ఊతం ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పర్యటన ఇవాళ గోద్రా చేరనుంది.
Himanta Biswa Sarma: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ.. అతను హిందువు కాదంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు ఫైర్ అవుతున్నారు. తాజాగా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ లాలూ తీరును ఎండగట్టారు. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనకు తెలిసిన హిందూ సంస్కృతిని మరిచిపోయాడని ఎద్దేవా చేశారు. ఇంతకాలం హిందూ వ్యతిరేకిగా ఉండటమే అందుకు కారణం కావచ్చని అన్నారు. అస్సాంలోని బొంగైగావ్లో మంగళవారం…
Rahul Gandhi: ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొంటున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. రాహుల్ గాంధీ కాన్వాయ్ మధ్యప్రదేశ్ సారంగపూర్ వెళ్తున్న సమయంలో బీజేపీ కార్యకర్తలు ‘‘జై శ్రీరామ్, మోడీ’’ అంటూ నినాదాలతో స్వాగతం పలికారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ కార్యకర్తలను కలిసేందుకు కాన్వాయ్ ఆపివేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆయనకు బంగాళాదుంపలు ఇవ్వడం వీడియోలో కనిపించింది. బంగాళాదుంపలను తీసుకుని దానికి బదులుగా…