National Sports Meet: అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ స్పోర్ట్స్ మీట్ 2022
- Follow Us :
-
-
Add as a preferred
source on google
National Sports Meet: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా ఏకలవ్య ఆదర్శ పాఠశాలల జాతీయ స్పోర్ట్స్ మీట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న ఈ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమాన్ని కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ సహాయ మంత్రి రేణుక సింగ్ సరుత జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర, అరకు ఎంపీ మాధవి, పాలకొండ ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు.
ఈ పోటీలకు 22 రాష్ట్రాల నుంచీ క్రీడాకారులు వచ్చారని ఉపముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర వెల్లడించారు. జాతీయ స్పోర్ట్స్ మీట్ 2022 ఏపీలో నిర్వహిచడం గర్వకారణమన్నారు. ఆదివాసీల అభివృద్ధికి సీఎం జగన్ ముఖ్యమైన అడుగులు వేశారన్నారు. సీఎం జగన్ ఆదివాసీలకు రెండు జిల్లాలు ఇచ్చారన్నారు. ఈఎంఆర్ఎస్ స్కూళ్ళలో చదివే ఆదివాసీ పిల్లలు అందరి విద్యార్ధులకు ఆదర్శమన్నారు. లంబసింగిలో ఒక ట్రైబల్ స్కూలు బిల్డింగ్ కడుతున్నామన్నారు. ఆదివాసీలకు ప్రధాని చేస్తున్న ప్రతీ కార్యక్రమంలో తాము పాల్గొంటున్నామని తెలిపారు. క్రీడలలో గెలుపు, ఓటములు సహజమన్నారు. క్రీడాకారులకు, కోచ్లకు అందరికీ అభినందనలు తెలిపారు.
Also Read
- CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
- Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
- Vijaysai Reddy: బీజేపీలో అస్సలు చేరను.. కొత్త పార్టీపై త్వరలోనే చెప్తా!
- Jammu Kashmir: 23 మంది కశ్మీరీ పండిట్ల హత్యాకాండ.. 28 ఏళ్ల క్రితం నాటి ఊచకోత కేసు పునర్ విచారణ
Infosys Co-Founder: అన్ని రంగాల్లోనూ భారత్ విలువైన దేశంగా ఎదగాలి..
కృష్ణానదీ తీరంలో జరగనున్న నాలుగు రోజుల క్రీడలలో పాల్గొనడానికి 22 రాష్ట్రాల నుంచి వచ్చారని కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి రేణుకా సింగ్ సరుత అన్నారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. క్రీడలతో మనకు మంచి ఆరోగ్యం లభిస్తుందన్నారు. చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలు నేర్చుకోవాలన్నారు. బంగారం, రజతం, కాంస్య పతకాలు కామన్ వెల్త్ క్రీడల్లో ఆదివాసీలు సాధించారని ఆమె వెల్లడించారు. కేంద్రం ఒలింపిక్ క్రీడల సమయంలో క్రీడాకారులకు ప్రధాని మోదీ స్ఫూర్తిదాయక స్పీచ్ ఇచ్చారన్నారు. అభినవ్ బింద్రా, సైనా నెహ్వాల్, విశ్వనాధ్ ఆనంద్ లాంటి వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గౌతం గంభీర్ను క్రీడాకారుడిగా కాకుండా లోక్సభకు ప్రజలు పంపారని పేర్కొన్నారు. మేరీ కోమ్.. ఇవాళ రాజ్యసభలో సభ్యురాలు అని.. పీటీ ఉషను కూడా రాజ్యసభ సభ్యురాలిగా చేశారన్నారు. ఏకలవ్య స్కూలులో చదివే వారికి ఏకాగ్రత, అకుంఠిత దీక్ష ఉండాలన్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: రైతులు ఫుడ్ ప్రాసెసింగ్లోకి రావాలి.. వ్యవసాయాన్ని ఆర్థిక శక్తిగా మార్చాలి!
-
Anasuya: హిందూ ఆచారాలపై అనసూయ సంచలన వ్యాఖ్యలు.. అసలు స్కెచ్ ఇదేనా!
-
Tollywood Wedding: సైలెంట్గా న్యూజిలాండ్లో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ యాక్టర్.. తన రియల్ హీరోయిన్తో ఫోటోలు వైరల్!
-
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
-
Kriti Sanon: రాఖీ కట్టడానికి ఇలాంటి బట్టలే దొరికాయా?.. కృతి సనన్ లుక్పై నెటిజన్ల ఫైర్!
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!