Chhattisgarh : రూ.లక్ష కోసం మళ్లీ పెళ్లికి రెడీ అయిన పెళ్లయిన 20జంటలు
- ఛత్తీస్గఢ్లో సామూహిక వివాహం
- పెళ్లి చేసుకున్న జంటలకు రూ.లక్ష
- డబ్బుల కోసం వచ్చిన పెళ్లి చేసుకున్న జంటలు
- వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు. అంతేకాదు వారిలో కొందరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఈ సామూహిక వివాహాన్ని నిర్వహించింది. అలాంటి జంటలు పట్టుబడిన వెంటనే వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
దుర్గ్లోని ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ 300 మంది వికలాంగ జంటలకు సామూహిక వివాహాన్ని నిర్వహించింది. ఈ సంస్థ ఇప్పటికే వందలాది మంది యువతీ యువకులకు వివాహాలు జరిపించింది. ఈసారి ఒక్కో జంటకు ఇన్స్టిట్యూట్ నుంచి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్లోని సుర్గుజా, అంబికాపూర్, సూరజ్పూర్, బిలాస్పూర్, బస్తర్లకు చెందిన పలువురు దంపతులు దుర్గ్కు చేరుకున్నారు.
Also Read
- Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
- NoiseFit Diva Araya: నాయిస్ ఫిట్ దివా అరయా.. మహిళలకు స్టైలిష్ స్మార్ట్వాచ్.. లైవ్ లొకేషన్ ట్రాకింగ్ కూడా
Read Also:Fastest Century: 27 బంతుల్లోనే సెంచరీ.. క్రిస్ గేల్ ‘ఆల్టైమ్’ రికార్డు బ్రేక్!
27 ఏళ్ల వరుడు, 45 ఏళ్ల వధువు
ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్సాయి, దుర్గ్ ఎంపీ విజయ్ బఘెల్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంతా బాగానే జరిగింది. దంపతులను సీఎం ఆశీర్వదించారు. అప్పటికే పెళ్లయిన 20 జంటలు ఈ పెళ్లికి వచ్చినట్లు ఆ సంస్థకు తెలిసింది. ఇది మాత్రమే కాదు, 27 ఏళ్ల యువకుడు డబ్బు కోసం 45 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఈ కార్యక్రమానికి చత్తీస్గఢ్తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ల నుంచి కూడా దంపతులు హాజరైనట్లు గుర్తించారు. కాగా, ఛత్తీస్గఢ్ ప్రజల కోసమే సామూహిక వివాహాన్ని నిర్వహించారు.
ఎఫ్ఐఆర్ నమోదు
అలాంటి జంటలను ఆ సంస్థ ఉద్యోగులు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించామని ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ప్రకాష్ గెడం తెలిపారు. ఈ 20 జంటలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కొందరు జంటలు మాత్రం తాము కావాలని ఇక్కడికి రాలేదన్నారు. వారే ఇక్కడికి పిలిచారని ఆరోపించారు. కానీ ఎవరు వాళ్లను ఇక్కడికి రమ్మన్నారో చెప్పలేదు. పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా ఈ జంటలపై చర్యలు తీసుకోనున్నారు.
Read Also:Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్కు బెదిరింపు కాల్స్.. రాజీనామా చేయాలని వార్నింగ్..!
తాజావార్తలు
-
Mahabubabad: 30 ఎకరాల మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతి
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!