Chhattisgarh : రూ.లక్ష కోసం మళ్లీ పెళ్లికి రెడీ అయిన పెళ్లయిన 20జంటలు
- ఛత్తీస్గఢ్లో సామూహిక వివాహం
- పెళ్లి చేసుకున్న జంటలకు రూ.లక్ష
- డబ్బుల కోసం వచ్చిన పెళ్లి చేసుకున్న జంటలు
- వాళ్లపై ఎఫ్ఐఆర్ నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chhattisgarh : ఛత్తీస్గఢ్లోని దుర్గ్లో వికలాంగులకు సామూహిక వివాహం నిర్వహించారు. ఇందులో ప్రతి జంట కూడా వివాహం తర్వాత ఒక లక్ష రూపాయలు పొందుతారు. అయితే డబ్బుపై దురాశతో ఇప్పటికే పెళ్లయిన కొన్ని జంటలు కూడా పెళ్లికి వచ్చారు. అంతేకాదు వారిలో కొందరికి ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ ఈ సామూహిక వివాహాన్ని నిర్వహించింది. అలాంటి జంటలు పట్టుబడిన వెంటనే వారిని అక్కడి నుంచి తరిమికొట్టారు. ఇప్పుడు వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
దుర్గ్లోని ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూట్ 300 మంది వికలాంగ జంటలకు సామూహిక వివాహాన్ని నిర్వహించింది. ఈ సంస్థ ఇప్పటికే వందలాది మంది యువతీ యువకులకు వివాహాలు జరిపించింది. ఈసారి ఒక్కో జంటకు ఇన్స్టిట్యూట్ నుంచి లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఛత్తీస్గఢ్లోని సుర్గుజా, అంబికాపూర్, సూరజ్పూర్, బిలాస్పూర్, బస్తర్లకు చెందిన పలువురు దంపతులు దుర్గ్కు చేరుకున్నారు.
Also Read
- Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
- రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
- Hyderabad: హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ.. 8 కాలేజీలకు ఫేక్ ఫైర్ NOCలు
- TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
Read Also:Fastest Century: 27 బంతుల్లోనే సెంచరీ.. క్రిస్ గేల్ ‘ఆల్టైమ్’ రికార్డు బ్రేక్!
27 ఏళ్ల వరుడు, 45 ఏళ్ల వధువు
ఛత్తీస్గఢ్ సీఎం విష్ణు దేవ్సాయి, దుర్గ్ ఎంపీ విజయ్ బఘెల్ కూడా ఇక్కడికి చేరుకున్నారు. అంతా బాగానే జరిగింది. దంపతులను సీఎం ఆశీర్వదించారు. అప్పటికే పెళ్లయిన 20 జంటలు ఈ పెళ్లికి వచ్చినట్లు ఆ సంస్థకు తెలిసింది. ఇది మాత్రమే కాదు, 27 ఏళ్ల యువకుడు డబ్బు కోసం 45 ఏళ్ల మహిళను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడు. ఈ కార్యక్రమానికి చత్తీస్గఢ్తో పాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్ల నుంచి కూడా దంపతులు హాజరైనట్లు గుర్తించారు. కాగా, ఛత్తీస్గఢ్ ప్రజల కోసమే సామూహిక వివాహాన్ని నిర్వహించారు.
ఎఫ్ఐఆర్ నమోదు
అలాంటి జంటలను ఆ సంస్థ ఉద్యోగులు వెంటనే అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఈ విషయమై పోలీసులకు సమాచారం అందించామని ఆస్తా మల్టీపర్పస్ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ ప్రెసిడెంట్ ప్రకాష్ గెడం తెలిపారు. ఈ 20 జంటలపై చర్యలు తీసుకుంటామన్నారు. అయితే కొందరు జంటలు మాత్రం తాము కావాలని ఇక్కడికి రాలేదన్నారు. వారే ఇక్కడికి పిలిచారని ఆరోపించారు. కానీ ఎవరు వాళ్లను ఇక్కడికి రమ్మన్నారో చెప్పలేదు. పోలీసులు ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం ద్వారా ఈ జంటలపై చర్యలు తీసుకోనున్నారు.
Read Also:Andhra University: ఏయూ వీసీ, రిజిస్ట్రార్కు బెదిరింపు కాల్స్.. రాజీనామా చేయాలని వార్నింగ్..!
తాజావార్తలు
-
Karikala First Look: సందీప్ కిషన్ ‘కరికాల’ ఫస్ట్ లుక్ అదిరింది!.. ఇలాంటి అవతార్లో ఎప్పుడూ చూడలే..
-
Mohammad Amir-IPL 2027: పాక్ స్టార్ మహ్మద్ అమీర్కు లైన్ క్లియర్.. ఇక ఐపీఎల్ 2027లో ఆడతాడా?
-
Telangana Launches Dial 112: 100కు గుడ్బై! ఇక పోలీస్, అంబులెన్స్, ఫైర్.. అన్నింటికీ ఒకే నంబర్..
-
Tamil Nadu Budget 2026: జెన్-జెడ్ విద్యార్థులపై ప్రభుత్వం వరాల జల్లు.. గోల్డ్ కాయిన్స్, పట్టు చీరలు, సైకిళ్ల పంపిణీ..!
-
రికార్డుల మోత..! The Hundredలో పరుగుల సునామీ.. ఒక్క మ్యాచ్లో 31 సిక్సర్లు, 445 పరుగులు..
ట్రెండింగ్
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!