Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్ను డిఆర్ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్ పేరు సోహన్, ఇతను ఢిల్లీలోని కరోల్ బాగ్ నివాసి. ఇన్ఫార్మర్ సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజా ముందు సోహన్ గోయల్ అనే స్మగ్లర్ను పట్టుకుంది. లక్నో నంబర్ ప్లేట్ ఉన్న ఎస్యూవీ కారులో సోహన్ వెళ్తున్నాడు. అతను లక్నోలోని టెలిబాగ్లో ఉన్న బృందావన్ జ్యువెలర్స్లో దుబాయ్ మేడ్ గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాలను విక్రయించడానికి వెళ్తున్నాడు. ఇంతకు ముందు కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్మగ్లర్ను పట్టుకుంది.
Read Also:MLA Maheshwar Reddy: కొడంగల్ ఎత్తివేతల పథకానికి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిందే..
Also Read
- Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
- T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
- Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
- OTR: కరీంనగర్ కారు పార్టీలో అలజడి.. 'రెడ్ జోన్' వార్నింగ్తో లీడర్ల ఉరుకులు పరుగులు..
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం ప్రకారం.. దుబాయ్ తయారు చేసిన బంగారు బిస్కెట్లు,1 కిలోల ఆభరణాలు స్మగ్లర్ నుండి ఎక్స్ యూవీ సీటు కింద నుండి రికవరీ చేశారు. నిందితుడిని కస్టమ్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితుడైన స్మగ్లర్ను విచారించేందుకు వీలుగా డిఆర్ఐ బృందం పిసిఆర్ కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. బంగారం స్మగ్లింగ్లో అతనితో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also:Puri Ratna Bhandar: 40ఏళ్ల తర్వాత ఆదివారం నాడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం
సమాచారం మేరకు బృందం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన సోహన్లాల్ గోయల్ నుంచి రూ.8 కోట్ల 9 లక్షల విలువైన 11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని కారు సీటు కింద దాచి ఉంచారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ టోల్ వద్ద కారును ఆపింది. ఈ బంగారాన్ని లక్నోలోని పీజీఐ ప్రాంతంలోని నగల వ్యాపారికి డెలివరీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Story Board : తెలంగాణలో బెంగాల్ తరహా రాజకీయం సాధ్యమా..?
-
Shreyas Iyer: మళ్లీ అదే తప్పు.. ఎంత చెప్పినా.. ఎవరు చెప్పినా మారని శ్రేయాస్ అయ్యర్ తీరు..
-
T20 Team: సంజూ శాంసన్, తిలక్ వర్మకు దక్కని చోటు.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంట్రీ..
-
Harish Rao : రేవంత్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్.. అసెంబ్లీలోనే కాదు ఎక్కడైనా చర్చకు సిద్ధం
-
Europe Heatwave: బాబోయ్ ఎండలు.. కరిగిపోతున్న రహదారులు
ట్రెండింగ్
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..
-
Bread Pakoda Recipe: కరకరలాడే స్ట్రీట్ స్టైల్ ‘బ్రెడ్ పకోడా’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!