Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత
Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్ను డిఆర్ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్ పేరు సోహన్, ఇతను ఢిల్లీలోని కరోల్ బాగ్ నివాసి. ఇన్ఫార్మర్ సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజా ముందు సోహన్ గోయల్ అనే స్మగ్లర్ను పట్టుకుంది. లక్నో నంబర్ ప్లేట్ ఉన్న ఎస్యూవీ కారులో సోహన్ వెళ్తున్నాడు. అతను లక్నోలోని టెలిబాగ్లో ఉన్న బృందావన్ జ్యువెలర్స్లో దుబాయ్ మేడ్ గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాలను విక్రయించడానికి వెళ్తున్నాడు. ఇంతకు ముందు కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్మగ్లర్ను పట్టుకుంది.
Read Also:MLA Maheshwar Reddy: కొడంగల్ ఎత్తివేతల పథకానికి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిందే..
Also Read
- Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
- Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో "మామిడికాయ టమాటా రోటి పచ్చడి".!
- IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
- Assam Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం ప్రకారం.. దుబాయ్ తయారు చేసిన బంగారు బిస్కెట్లు,1 కిలోల ఆభరణాలు స్మగ్లర్ నుండి ఎక్స్ యూవీ సీటు కింద నుండి రికవరీ చేశారు. నిందితుడిని కస్టమ్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితుడైన స్మగ్లర్ను విచారించేందుకు వీలుగా డిఆర్ఐ బృందం పిసిఆర్ కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. బంగారం స్మగ్లింగ్లో అతనితో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also:Puri Ratna Bhandar: 40ఏళ్ల తర్వాత ఆదివారం నాడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం
సమాచారం మేరకు బృందం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన సోహన్లాల్ గోయల్ నుంచి రూ.8 కోట్ల 9 లక్షల విలువైన 11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని కారు సీటు కింద దాచి ఉంచారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ టోల్ వద్ద కారును ఆపింది. ఈ బంగారాన్ని లక్నోలోని పీజీఐ ప్రాంతంలోని నగల వ్యాపారికి డెలివరీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Kerala Election Exit poll 2026: కేరళలో హస్తం హవా.. పినరయికి గుడ్ బై..
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Anand Deverakonda: ఈ కథ చెప్పినప్పుడు.. నా కథ నాకే చెప్పాడా అనిపించింది!
-
IPL 2026: అనూహ్య రీతిలో మెరిసిన భారత క్రికెట్ భవిష్యత్తు ఆశాకిరణాలు.. బీసీసీఐ దృష్టిలో ఈ 5 గురు..
-
Assam Elections Exit poll 2026: అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్.. కాంగ్రెస్ గల్లంతు..
ట్రెండింగ్
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!