Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్ను డిఆర్ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్ పేరు సోహన్, ఇతను ఢిల్లీలోని కరోల్ బాగ్ నివాసి. ఇన్ఫార్మర్ సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజా ముందు సోహన్ గోయల్ అనే స్మగ్లర్ను పట్టుకుంది. లక్నో నంబర్ ప్లేట్ ఉన్న ఎస్యూవీ కారులో సోహన్ వెళ్తున్నాడు. అతను లక్నోలోని టెలిబాగ్లో ఉన్న బృందావన్ జ్యువెలర్స్లో దుబాయ్ మేడ్ గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాలను విక్రయించడానికి వెళ్తున్నాడు. ఇంతకు ముందు కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్మగ్లర్ను పట్టుకుంది.
Read Also:MLA Maheshwar Reddy: కొడంగల్ ఎత్తివేతల పథకానికి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిందే..
Also Read
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం ప్రకారం.. దుబాయ్ తయారు చేసిన బంగారు బిస్కెట్లు,1 కిలోల ఆభరణాలు స్మగ్లర్ నుండి ఎక్స్ యూవీ సీటు కింద నుండి రికవరీ చేశారు. నిందితుడిని కస్టమ్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితుడైన స్మగ్లర్ను విచారించేందుకు వీలుగా డిఆర్ఐ బృందం పిసిఆర్ కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. బంగారం స్మగ్లింగ్లో అతనితో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also:Puri Ratna Bhandar: 40ఏళ్ల తర్వాత ఆదివారం నాడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం
సమాచారం మేరకు బృందం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన సోహన్లాల్ గోయల్ నుంచి రూ.8 కోట్ల 9 లక్షల విలువైన 11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని కారు సీటు కింద దాచి ఉంచారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ టోల్ వద్ద కారును ఆపింది. ఈ బంగారాన్ని లక్నోలోని పీజీఐ ప్రాంతంలోని నగల వ్యాపారికి డెలివరీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!