Lucknow News: లక్నోలో రూ.8 కోట్ల విలువైన బంగారం పట్టివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lucknow News: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో, లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో 11 కిలోల బంగారంతో స్మగ్లర్ను డిఆర్ఐ అరెస్టు చేసింది. పట్టుబడిన బంగారం విలువ మార్కెట్లో రూ.8 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు. పట్టుబడిన స్మగ్లర్ పేరు సోహన్, ఇతను ఢిల్లీలోని కరోల్ బాగ్ నివాసి. ఇన్ఫార్మర్ సమాచారం మేరకు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వే టోల్ ప్లాజా ముందు సోహన్ గోయల్ అనే స్మగ్లర్ను పట్టుకుంది. లక్నో నంబర్ ప్లేట్ ఉన్న ఎస్యూవీ కారులో సోహన్ వెళ్తున్నాడు. అతను లక్నోలోని టెలిబాగ్లో ఉన్న బృందావన్ జ్యువెలర్స్లో దుబాయ్ మేడ్ గోల్డ్ బిస్కెట్లు, ఆభరణాలను విక్రయించడానికి వెళ్తున్నాడు. ఇంతకు ముందు కూడా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్మగ్లర్ను పట్టుకుంది.
Read Also:MLA Maheshwar Reddy: కొడంగల్ ఎత్తివేతల పథకానికి గ్లోబల్ టెండర్లు పిలవాల్సిందే..
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం ప్రకారం.. దుబాయ్ తయారు చేసిన బంగారు బిస్కెట్లు,1 కిలోల ఆభరణాలు స్మగ్లర్ నుండి ఎక్స్ యూవీ సీటు కింద నుండి రికవరీ చేశారు. నిందితుడిని కస్టమ్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. నిందితుడైన స్మగ్లర్ను విచారించేందుకు వీలుగా డిఆర్ఐ బృందం పిసిఆర్ కోసం కోర్టును ఆశ్రయిస్తుంది. బంగారం స్మగ్లింగ్లో అతనితో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు ఆరా తీస్తున్నారు.
Read Also:Puri Ratna Bhandar: 40ఏళ్ల తర్వాత ఆదివారం నాడు తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం
సమాచారం మేరకు బృందం లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేలో తనిఖీ చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన సోహన్లాల్ గోయల్ నుంచి రూ.8 కోట్ల 9 లక్షల విలువైన 11 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారాన్ని కారు సీటు కింద దాచి ఉంచారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ బృందం లక్నో ఆగ్రా ఎక్స్ప్రెస్ టోల్ వద్ద కారును ఆపింది. ఈ బంగారాన్ని లక్నోలోని పీజీఐ ప్రాంతంలోని నగల వ్యాపారికి డెలివరీ చేయాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!