Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
- ముగిసిన పోలింగ్
- ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
- తొలిసారి బీజేపీకి ఓటు వేసినట్లు స్పష్టం
- ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఎన్నికలు ముగిసి 24 గంటలకు పైగా గడిచింది. ఫలితాలు రావడానికి దాదాపు 36 గంటల సమయం మిగిలి ఉంది. ఇప్పటి వరకు విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది చేసిన ఈ వాదన ఎన్నికల గణాంకాల నిపుణులను కాస్త ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్ పోల్స్కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు నిలిచాయి. పోలింగ్ అనంతరం మౌలానా సాజిద్ రషీది నిన్న ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాను జీవితంలో తొలిసారిగా బీజేపీకి ఓటు వేశానని చెప్పారు.
READ MORE: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్ సమక్షంలో చేరిక
Also Read
- Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
- Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
- Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
- Ketan Agrawal Case: కేతన్ హత్యపై స్పందించిన రాజా రఘువంశీ కుటుంబం.. ఏం డిమాండ్ చేశారంటే..!
సాజిద్ రషీది బీజేపీకి ఓటు వేయడానికి గల కారణాలను కూడా వివరించారు. ఇతర పార్టీలు బీజేపీ పేరుతో ముస్లింలను భయపెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ భయాన్ని అంతం చేయాలంటే.. కమలానికి ఓటేయడం అవసరమన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఢిల్లీలో సాధారణ ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి సంబంధించిన గణాంకాలు ఇంకా అందుబాటులో లేవు. కానీ ఈ ఎన్నికల్లో హిందూ-ముస్లింల ఓట్ల విభజన జరగలేదని తెలుస్తోంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, విద్యుత్-నీరు వంటి స్థానిక సమస్యలపై మరింత చర్చ జరిగిందని సమాచారం. 2020లో జరిగిన ఎన్నికల మాదిరిగా.. హిందూ ముస్లింల ఓట్ల విభజన జరగలేదని చర్చ నడుస్తోంది.
READ MORE: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్ సమక్షంలో చేరిక
ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక అంశం..
ఢిల్లీలో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక అంశం అని నమ్ముతారు. వారు ఏకపక్షంగా ఓటు వేస్తే, ఆ పార్టీ ముందంజలో ఉంటుందని విశ్వసిస్తారు. ఢిల్లీలో దాదాపు 13% ముస్లిం జనాభా ఉంది. 2 సీట్లలో ముస్లిం జనాభా 50 శాతం ఉండగా.. 6 సీట్లలో ముస్లిం జనాభా 35 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2020లో 35% ముస్లిం జనాభా ఉన్న 6 సీట్లలోనూ ఆప్ విజయం సాధించింది. అయితే, 2020 ఢిల్లీ అల్లర్ల హింసాకాండ ఆరోపణలపై జైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఏఐఎమ్ఐఎమ్ (AIMIM) పార్టీ ఓఖ్లా, ముస్తఫాబాద్ స్థానాల నుంచి అభ్యర్థులుగా నిలబెట్టింది. ఈ అభ్యర్థులైన ఓఖ్లాలో షిఫా-ఉర్-రెహ్మాన్, ముస్తఫాబాద్లో తాహిర్ హుస్సేన్ ముస్లిం ఓటర్లను ఆకర్షించారని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని 70 స్థానాల్లో 60.44 శాతం ఓటింగ్ జరిగింది. ఈ అల్లర్లు జరిగిన స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈశాన్య ఢిల్లీ జిల్లాలో అత్యధికంగా 66.25 శాతం ఓటింగ్ జరిగింది. అత్యధిక హింస జరిగిన ముస్తఫాబాద్లో 69 శాతం ఓటింగ్ నమోదైంది.
READ MORE: Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు..
రాజకీయ పార్టీ నాయకులు ఏమంటున్నారు?
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. బీజేపీ హిందువులకు లేదా ముస్లింలకు చెందినది పార్టీ కాదని.. పారిశ్రామికవేత్తలకు చెందినదని అన్నారు. మరోవైపు, ఎన్నికల్లో కులతత్వం, ప్రాంతీయత లేకపోతే, ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ ఎంపీ ఎస్పీ సింగ్ బఘేల్ కౌంటర్ ఇచ్చారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహమాన్ బార్క్ మాట్లాడుతూ.. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఆలోచిస్తుందన్నారు. ఈ మొత్తం వ్యవహరం తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..
తాజావార్తలు
-
Rahul Gandhi vs BJP: రాహుల్ గాంధీ విదేశీ టూర్లపై బీజేపీ సెటైర్లు.. పోస్టర్లపై దుమారం
-
Ketan Agarwal murder case: కేతన్ హత్య కేసులో ‘‘కసబ్’’ కేసు లాయర్ ఎంట్రీ..
-
Nandamuri Mokshagna: నందమూరి ఫ్యాన్స్కు షాక్.. బాలయ్య వారసుడి ఎంట్రీ ఈ ఏడాది కూడా లేనట్టేనా?
-
Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో సరికొత్త శకం.. ఐర్లాండ్తో నేడే భారత్ తొలి టీ20..
-
Petrol Diesel Rates: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందా? సామాన్యులకు గుడ్ న్యూస్ అందబోతోందా!
ట్రెండింగ్
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!