Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
- ముగిసిన పోలింగ్
- ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
- తొలిసారి బీజేపీకి ఓటు వేసినట్లు స్పష్టం
- ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఎన్నికలు ముగిసి 24 గంటలకు పైగా గడిచింది. ఫలితాలు రావడానికి దాదాపు 36 గంటల సమయం మిగిలి ఉంది. ఇప్పటి వరకు విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది చేసిన ఈ వాదన ఎన్నికల గణాంకాల నిపుణులను కాస్త ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్ పోల్స్కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు నిలిచాయి. పోలింగ్ అనంతరం మౌలానా సాజిద్ రషీది నిన్న ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాను జీవితంలో తొలిసారిగా బీజేపీకి ఓటు వేశానని చెప్పారు.
READ MORE: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్ సమక్షంలో చేరిక
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
సాజిద్ రషీది బీజేపీకి ఓటు వేయడానికి గల కారణాలను కూడా వివరించారు. ఇతర పార్టీలు బీజేపీ పేరుతో ముస్లింలను భయపెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ భయాన్ని అంతం చేయాలంటే.. కమలానికి ఓటేయడం అవసరమన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఢిల్లీలో సాధారణ ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి సంబంధించిన గణాంకాలు ఇంకా అందుబాటులో లేవు. కానీ ఈ ఎన్నికల్లో హిందూ-ముస్లింల ఓట్ల విభజన జరగలేదని తెలుస్తోంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, విద్యుత్-నీరు వంటి స్థానిక సమస్యలపై మరింత చర్చ జరిగిందని సమాచారం. 2020లో జరిగిన ఎన్నికల మాదిరిగా.. హిందూ ముస్లింల ఓట్ల విభజన జరగలేదని చర్చ నడుస్తోంది.
READ MORE: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్ సమక్షంలో చేరిక
ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక అంశం..
ఢిల్లీలో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక అంశం అని నమ్ముతారు. వారు ఏకపక్షంగా ఓటు వేస్తే, ఆ పార్టీ ముందంజలో ఉంటుందని విశ్వసిస్తారు. ఢిల్లీలో దాదాపు 13% ముస్లిం జనాభా ఉంది. 2 సీట్లలో ముస్లిం జనాభా 50 శాతం ఉండగా.. 6 సీట్లలో ముస్లిం జనాభా 35 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2020లో 35% ముస్లిం జనాభా ఉన్న 6 సీట్లలోనూ ఆప్ విజయం సాధించింది. అయితే, 2020 ఢిల్లీ అల్లర్ల హింసాకాండ ఆరోపణలపై జైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఏఐఎమ్ఐఎమ్ (AIMIM) పార్టీ ఓఖ్లా, ముస్తఫాబాద్ స్థానాల నుంచి అభ్యర్థులుగా నిలబెట్టింది. ఈ అభ్యర్థులైన ఓఖ్లాలో షిఫా-ఉర్-రెహ్మాన్, ముస్తఫాబాద్లో తాహిర్ హుస్సేన్ ముస్లిం ఓటర్లను ఆకర్షించారని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని 70 స్థానాల్లో 60.44 శాతం ఓటింగ్ జరిగింది. ఈ అల్లర్లు జరిగిన స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈశాన్య ఢిల్లీ జిల్లాలో అత్యధికంగా 66.25 శాతం ఓటింగ్ జరిగింది. అత్యధిక హింస జరిగిన ముస్తఫాబాద్లో 69 శాతం ఓటింగ్ నమోదైంది.
READ MORE: Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు..
రాజకీయ పార్టీ నాయకులు ఏమంటున్నారు?
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. బీజేపీ హిందువులకు లేదా ముస్లింలకు చెందినది పార్టీ కాదని.. పారిశ్రామికవేత్తలకు చెందినదని అన్నారు. మరోవైపు, ఎన్నికల్లో కులతత్వం, ప్రాంతీయత లేకపోతే, ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ ఎంపీ ఎస్పీ సింగ్ బఘేల్ కౌంటర్ ఇచ్చారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహమాన్ బార్క్ మాట్లాడుతూ.. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఆలోచిస్తుందన్నారు. ఈ మొత్తం వ్యవహరం తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!