Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
- ముగిసిన పోలింగ్
- ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
- తొలిసారి బీజేపీకి ఓటు వేసినట్లు స్పష్టం
- ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీలో ఎన్నికలు ముగిసి 24 గంటలకు పైగా గడిచింది. ఫలితాలు రావడానికి దాదాపు 36 గంటల సమయం మిగిలి ఉంది. ఇప్పటి వరకు విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది చేసిన ఈ వాదన ఎన్నికల గణాంకాల నిపుణులను కాస్త ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్ పోల్స్కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు నిలిచాయి. పోలింగ్ అనంతరం మౌలానా సాజిద్ రషీది నిన్న ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాను జీవితంలో తొలిసారిగా బీజేపీకి ఓటు వేశానని చెప్పారు.
READ MORE: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్ సమక్షంలో చేరిక
Also Read
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
- Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
సాజిద్ రషీది బీజేపీకి ఓటు వేయడానికి గల కారణాలను కూడా వివరించారు. ఇతర పార్టీలు బీజేపీ పేరుతో ముస్లింలను భయపెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ భయాన్ని అంతం చేయాలంటే.. కమలానికి ఓటేయడం అవసరమన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఢిల్లీలో సాధారణ ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి సంబంధించిన గణాంకాలు ఇంకా అందుబాటులో లేవు. కానీ ఈ ఎన్నికల్లో హిందూ-ముస్లింల ఓట్ల విభజన జరగలేదని తెలుస్తోంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, విద్యుత్-నీరు వంటి స్థానిక సమస్యలపై మరింత చర్చ జరిగిందని సమాచారం. 2020లో జరిగిన ఎన్నికల మాదిరిగా.. హిందూ ముస్లింల ఓట్ల విభజన జరగలేదని చర్చ నడుస్తోంది.
READ MORE: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్ సమక్షంలో చేరిక
ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక అంశం..
ఢిల్లీలో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక అంశం అని నమ్ముతారు. వారు ఏకపక్షంగా ఓటు వేస్తే, ఆ పార్టీ ముందంజలో ఉంటుందని విశ్వసిస్తారు. ఢిల్లీలో దాదాపు 13% ముస్లిం జనాభా ఉంది. 2 సీట్లలో ముస్లిం జనాభా 50 శాతం ఉండగా.. 6 సీట్లలో ముస్లిం జనాభా 35 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2020లో 35% ముస్లిం జనాభా ఉన్న 6 సీట్లలోనూ ఆప్ విజయం సాధించింది. అయితే, 2020 ఢిల్లీ అల్లర్ల హింసాకాండ ఆరోపణలపై జైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఏఐఎమ్ఐఎమ్ (AIMIM) పార్టీ ఓఖ్లా, ముస్తఫాబాద్ స్థానాల నుంచి అభ్యర్థులుగా నిలబెట్టింది. ఈ అభ్యర్థులైన ఓఖ్లాలో షిఫా-ఉర్-రెహ్మాన్, ముస్తఫాబాద్లో తాహిర్ హుస్సేన్ ముస్లిం ఓటర్లను ఆకర్షించారని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని 70 స్థానాల్లో 60.44 శాతం ఓటింగ్ జరిగింది. ఈ అల్లర్లు జరిగిన స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈశాన్య ఢిల్లీ జిల్లాలో అత్యధికంగా 66.25 శాతం ఓటింగ్ జరిగింది. అత్యధిక హింస జరిగిన ముస్తఫాబాద్లో 69 శాతం ఓటింగ్ నమోదైంది.
READ MORE: Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు..
రాజకీయ పార్టీ నాయకులు ఏమంటున్నారు?
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. బీజేపీ హిందువులకు లేదా ముస్లింలకు చెందినది పార్టీ కాదని.. పారిశ్రామికవేత్తలకు చెందినదని అన్నారు. మరోవైపు, ఎన్నికల్లో కులతత్వం, ప్రాంతీయత లేకపోతే, ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ ఎంపీ ఎస్పీ సింగ్ బఘేల్ కౌంటర్ ఇచ్చారు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహమాన్ బార్క్ మాట్లాడుతూ.. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఆలోచిస్తుందన్నారు. ఈ మొత్తం వ్యవహరం తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..
తాజావార్తలు
-
PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
-
RR vs LSG: ప్లేఆఫ్ స్థానం కోసం రాజస్థాన్.. పరువు కోసం లఖ్నవూ సూపర్ జెయింట్స్.. గెలిచేదెవరో.?
-
Donald Trump : ‘మేక్ అమెరికా క్రిస్టియన్’.. అమెరికా రాజకీయాల్లో కొత్త ట్రెండ్.?
-
Airtel: ఎయిర్టెల్ వినియోగదారులకు అదిరే న్యూస్.. కేవలం రూ.449లకే మరో కొత్త సర్వీస్ అందుబాటులోకి..
-
CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
ట్రెండింగ్
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!