Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Did Muslims Vote For Bjp In Delhi Assembly Elections

Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?

Published Date :February 6, 2025 , 8:44 pm
By RAMAKRISHNA KENCHE
  • ముగిసిన పోలింగ్
  • ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
  • తొలిసారి బీజేపీకి ఓటు వేసినట్లు స్పష్టం
  • ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న
Delhi Assembly Elections: ఢిల్లీ ఎన్నికల్లో ముస్లింలు బీజేపీకి ఓటు వేశారా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఢిల్లీలో ఎన్నికలు ముగిసి 24 గంటలకు పైగా గడిచింది. ఫలితాలు రావడానికి దాదాపు 36 గంటల సమయం మిగిలి ఉంది. ఇప్పటి వరకు విడుదలైన చాలా ఎగ్జిట్ పోల్స్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇమామ్ అసోసియేషన్ ఛైర్మన్ మౌలానా సాజిద్ రషీది చేసిన ఈ వాదన ఎన్నికల గణాంకాల నిపుణులను కాస్త ఆశ్చర్య పరిచాయి. ఎగ్జిట్‌ పోల్స్‌కు మద్దతుగా ఆయన వ్యాఖ్యలు నిలిచాయి. పోలింగ్ అనంతరం మౌలానా సాజిద్ రషీది నిన్న ఓ వీడియోను విడుదల చేశారు. అందులో తాను జీవితంలో తొలిసారిగా బీజేపీకి ఓటు వేశానని చెప్పారు.

READ MORE: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్‌ సమక్షంలో చేరిక

సాజిద్ రషీది బీజేపీకి ఓటు వేయడానికి గల కారణాలను కూడా వివరించారు. ఇతర పార్టీలు బీజేపీ పేరుతో ముస్లింలను భయపెడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ భయాన్ని అంతం చేయాలంటే.. కమలానికి ఓటేయడం అవసరమన్నారు. కానీ ఈ ఎన్నికల్లో ఢిల్లీలో సాధారణ ముస్లింలు కూడా బీజేపీకి ఓటు వేశారా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి సంబంధించిన గణాంకాలు ఇంకా అందుబాటులో లేవు. కానీ ఈ ఎన్నికల్లో హిందూ-ముస్లింల ఓట్ల విభజన జరగలేదని తెలుస్తోంది. పరిశుభ్రత, పారిశుద్ధ్యం, విద్యుత్-నీరు వంటి స్థానిక సమస్యలపై మరింత చర్చ జరిగిందని సమాచారం. 2020లో జరిగిన ఎన్నికల మాదిరిగా.. హిందూ ముస్లింల ఓట్ల విభజన జరగలేదని చర్చ నడుస్తోంది.

READ MORE: Sailajanath to join YSRCP: కీలక పరిణామం..! వైసీపీ గూటికి మాజీ మంత్రి.. రేపు జగన్‌ సమక్షంలో చేరిక

ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక అంశం..
ఢిల్లీలో ముస్లిం ఓటర్లు నిర్ణయాత్మక అంశం అని నమ్ముతారు. వారు ఏకపక్షంగా ఓటు వేస్తే, ఆ పార్టీ ముందంజలో ఉంటుందని విశ్వసిస్తారు. ఢిల్లీలో దాదాపు 13% ముస్లిం జనాభా ఉంది. 2 సీట్లలో ముస్లిం జనాభా 50 శాతం ఉండగా.. 6 సీట్లలో ముస్లిం జనాభా 35 శాతం కంటే ఎక్కువగా ఉంది. 2020లో 35% ముస్లిం జనాభా ఉన్న 6 సీట్లలోనూ ఆప్ విజయం సాధించింది. అయితే, 2020 ఢిల్లీ అల్లర్ల హింసాకాండ ఆరోపణలపై జైలులో ఉన్న ఇద్దరు వ్యక్తులను ఏఐఎమ్‌ఐఎమ్ (AIMIM) పార్టీ ఓఖ్లా, ముస్తఫాబాద్ స్థానాల నుంచి అభ్యర్థులుగా నిలబెట్టింది. ఈ అభ్యర్థులైన ఓఖ్లాలో షిఫా-ఉర్-రెహ్మాన్, ముస్తఫాబాద్‌లో తాహిర్ హుస్సేన్ ముస్లిం ఓటర్లను ఆకర్షించారని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని 70 స్థానాల్లో 60.44 శాతం ఓటింగ్ జరిగింది. ఈ అల్లర్లు జరిగిన స్థానాలను పరిగణనలోకి తీసుకుంటే, ఈశాన్య ఢిల్లీ జిల్లాలో అత్యధికంగా 66.25 శాతం ఓటింగ్ జరిగింది. అత్యధిక హింస జరిగిన ముస్తఫాబాద్‌లో 69 శాతం ఓటింగ్ నమోదైంది.

READ MORE: Health: ఈ జ్యూస్ తాగితే 50 ఏళ్ల వయసులో కూడా 30 ఏళ్లలా కనిపిస్తారు..

రాజకీయ పార్టీ నాయకులు ఏమంటున్నారు?
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ.. బీజేపీ హిందువులకు లేదా ముస్లింలకు చెందినది పార్టీ కాదని.. పారిశ్రామికవేత్తలకు చెందినదని అన్నారు. మరోవైపు, ఎన్నికల్లో కులతత్వం, ప్రాంతీయత లేకపోతే, ప్రతి రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వం ఉండాలని బీజేపీ ఎంపీ ఎస్పీ సింగ్ బఘేల్ కౌంటర్ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జియా-ఉర్-రెహమాన్ బార్క్ మాట్లాడుతూ.. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకంగా ఆలోచిస్తుందన్నారు. ఈ మొత్తం వ్యవహరం తేలాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AAP
  • bjp
  • Delhi Assembly elections
  • Delhi Elections
  • Muslim vote for BJP

తాజావార్తలు

  • DCvsGT : చివరి బంతి థ్రిల్..! ఒక్క పరుగుతో గెలిచిన గుజరాత్… రాహుల్ హీరోయిజం వృథా!

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions