బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో 590 స్కోర్ చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం స్వప్నిల్ మాట్లాడుతూ.. ధోనీని తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలనే స్ఫూర్తి ధోనీ నుంచి వచ్చిందని చెప్పాడు. ధోనీ తనకు ఆదర్శమని అని అన్నాడు. స్వప్నిల్ రేపు పతకం కోసం పోటీలో పాల్గొననున్నాడు. రేపు ఫైనల్ మధ్యాహ్నం 1 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోటీలో షూటర్లు మూడు స్థానాల్లో గురి పెట్టాలి. వీటిలో వంగి/కూర్చున్నప్పుడు, పడుకుని, నిలబడి గురి పెట్టాలి.
Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. 10 విమానాల దారి మళ్లింపు
మహారాష్ట్ర కొల్హాపూర్లోని కంబల్వాడి గ్రామానికి చెందిన 29 ఏళ్ల కుసాలే.. 2012 నుంచి అంతర్జాతీయ పోటీల్లో ఆడుతున్నప్పటికీ ఒలింపిక్ అరంగేట్రం కోసం 12 ఏళ్లు వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో.. అతను ప్రశాంతంగా ఉండటానికి ధోని సినిమాను చాలాసార్లు చూశానని చెప్పాడు. ధోనీలాగే తాను కూడా టిక్కెట్ కలెక్టర్ అని కుసలే చెప్పాడు. తాను షూటింగ్లో ఏ ఆటగాడి నుండి సలహాలు తీసుకోనని.. కానీ ఇతర క్రీడలలో ధోనీ తనకు ఇష్టమైన ఆటగాడు అని తెలిపాడు. తన ఆటకు కూడా ప్రశాంతత అవసరం.. ధోనీ కూడా మైదానంలో ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేవారని.. అతను కూడా ఒకప్పుడు టికెట్ కలెక్టర్.. తాను కూడా అదేనని అన్నాడు.
Terror Attack: ఉగ్రవాదులను అంతమొందించే సరికొత్త టెక్నాలజీ..!
కుసలే 2015 నుంచి సెంట్రల్ రైల్వేలో పనిచేస్తున్నారు. అతని తండ్రి, సోదరుడు జిల్లా పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. తల్లి గ్రామ సర్పంచ్. తన ప్రదర్శనపై ఇప్పటి వరకు అనుభవం చాలా బాగుందన్నాడు. తనకు షూటింగ్ అంటే చాలా ఇష్టమని.. మను భాకర్ని చూడగానే తనకు ఆత్మవిశ్వాసం వచ్చిందని తెలిపాడు. ఆమె గెలవగలిగితే తాను కూడా గెలవగలనని చెప్పాడు.