బుధవారం జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్లో భారత స్టార్ షూటర్ స్వప్నిల్ కుసాలే ఫైనల్లోకి ప్రవేశించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో 590 స్కోర్ చేసి ఏడో స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం స్వప్నిల్ మాట్లాడుతూ.. ధోనీని తన ఆరాధ్యదైవంగా భావిస్తున్నానని, ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఉండాలనే స్ఫూర్తి ధోనీ నుంచి వచ్చిందని చెప్పాడు. ధోనీ తనకు ఆదర్శమని అని అన్నాడు.
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు శుభవార్త వెలువడింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో భారత స్టార్ షూటర్ మను భాకర్ ఫైనల్కు చేరుకుంది. అంతకుముందు.. ఈ ఈవెంట్లో భారత పురుషుల ఆటగాళ్లు క్వాలిఫయర్లకు మించి పురోగతి సాధించలేదు.