Delhi: ఢిల్లీలో కుండపోత వర్షం.. 10 విమానాల దారి మళ్లింపు
- ఢిల్లీలో కుండపోత వర్షం
- 10 విమానాల దారి మళ్లింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రాజధాని ఢిల్లీని కుండపోత వర్షం ముంచెత్తింది. నగరంలో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. బుధవారం సాయంత్రం హఠాత్తుగా అత్యంత భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ చెరువుల్ని తలపించాయి. మరోవైపు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో 10 విమానాలను దారి మళ్లించారు.
ఇదిలా ఉంటే శనివారం రాజిందర్ నగర్లోని ఒక కోచింగ్ సెంటర్లోకి నీళ్లు ప్రవేశించి ముగ్గురు విద్యార్థులు చనిపోయిన.. కోచింగ్ సెంటర్లోకి తాజాగా కూడా నీళ్లు బేస్మెంట్లోకి వెళ్లాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికారులు మొద్ద నిద్ర వీడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అనేక చోట్ల మోకాళ్ల లోతు నీటిలో ప్రజలు తిరుగుతూ ఇబ్బంది పడ్డారు.
Also Read
- Cockroach Janta Party: ఢిల్లీలో "కాక్రోచ్ జనతా పార్టీ" ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
- Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
తాజా వర్షంపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా స్పందించారు. కోచింగ్ సెంటర్లు ఉన్న ప్రాంతాలతో సహా నీటి ఎద్దడి ఎక్కువగా ఉండే ప్రదేశాల్లోని సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులందరినీ హెచ్చరించారు. ఈ మేరకు సక్సేనా ఎక్స్లో పోస్ట్ చేశారు.
ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ (ఐటీఓ) జంక్షన్, కన్నాట్ ప్లేస్, మింటో రోడ్, మోతీ బాగ్ ఫ్లైఓవర్తో పాటు పొడవైన ట్రాఫిక్ జామ్లతో పాటు భారీ నీటి ఎద్దడిని పలు ప్రాంతాలు కలిగి ఉన్నాయి. మింటో వంతెన కింద ఉన్న పాస్ మూసివేశారు. ఇక ఢిల్లీలోని మూడు నాలుగు ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోయినట్లుగా వార్తలు అందుతున్నాయి. ఇప్పటివరకు ఎవరికీ గాయాలు కాలేదు. ఇక ఢిల్లీలో రెండు గంటలపాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కార్యాలయం ఎక్స్లో పోస్ట్ చేసింది.
ఎయిర్ ఇండియా, విస్తారా, ఇండిగో మరియు స్పైస్జెట్తో సహా పలు విమానయాన సంస్థలు విమానాలు దారి మళ్లించబడ్డాయి. ప్రయాణికులు ఆయా విమానాల స్థితిని వైబ్సైట్లలో చూసుకోవాలని సూచించారు. పూణే నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన UK998 విమానం లక్నోకు మళ్లించబడిందని విస్తారా తెలిపింది. అయితే ఎయిర్ఇండియా తన అతిథులకు విమానాశ్రయానికి త్వరగా బయలుదేరాలని సూచించింది.
ఇది కూడా చదవండి: Film Chamber: గద్దర్ అవార్డులపై సీఎం కామెంట్స్.. ఫిలిం ఛాంబర్ కీలక వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Ben Stokes: గుర్తుపట్టలేని స్థితిలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. నెటిజన్లు షాక్..
-
Cockroach Janta Party: ఢిల్లీలో “కాక్రోచ్ జనతా పార్టీ” ఆందోళన.. పోలీసులు ఏం చెబుతున్నారంటే..
-
Sanjay Raut: కాంగ్రెస్లో విలీనం కావాలి.. టీఎంసీ, ఎన్సీపీలకు సంజయ్ రౌత్ పిలుపు..
-
Iran: యురేనియం బదిలీపై ఇరాన్ సంచలన నిర్ణయం.. పాక్కు కీలక సమాచారం!
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!