Ram Darshan: భక్తులకు రేపటి నుంచి అయోధ్య రాముడి దర్శనం.. ఆన్లైన్లో బుక్ చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు.
Read Also: Ayodhya: 32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమాభారతి..
Also Read
- India - Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
- India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
- పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
- AP Rain Alert: రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. ప్రజలకు APSDMA కీలక హెచ్చరిక
బాలరాముడి దర్శనం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం..
అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి.
లాగిన్ చేయడానికి మీ మొబైల్ నంబర్ని ఉపయోగించండి.
మీ మొబైల్కి పంపిన OTPతో మీ ఐడీని ధృవీకరించండి.
‘మై ప్రొఫైల్’ విభాగంలో గుర్తించి, క్లిక్ చేయండి.
ఆర్తి లేదా దర్శనం కోసం మీకు ఇష్టమైన స్లాట్ను ఎంచుకోండి.
అవసరమైన వివరాలను అందించండి.
మీ బుకింగ్ను పూర్తి చేయడానికి, పాస్ను పొందేందుకు ప్రాంప్ట్లను అనుసరించండి.
బుకింగ్ విజయవంతమైన తర్వాత నిర్ధారణను స్వీకరించండి.
ఆలయంలో ప్రవేశానికి ముందు ఆలయ కౌంటర్ నుండి మీ పాస్ను తీసుకోవాలి.
రామ మందిరంలో ఆరతి చేసే సమయం ఎంత?
రామాలయంలో రాంలాలా ఆరతి రోజుకు మూడు సార్లు నిర్వహిస్తారు. మొదటిది – ఉదయం 6:30 గంటలకు, దీనిని జాగ్రన్ లేదా శృంగార్ ఆర్తి అంటారు. రెండవది – మధ్యాహ్నం 12:00 గంటలకు భోగ్ ఆరతి అని.. మూడవది రాత్రి 7:30 గంటలకు సంధ్యా ఆరతి అని పిలుస్తారు.
రామమందిర ఆరతిలో ఎలా పాల్గొనవచ్చు?
అయోధ్యలోని రామ మందిరంలో ఆరతికి హాజరు కావడానికి శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి పాస్ తీసుకోవచ్చు. పాస్ కోసం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ID ప్రూఫ్) కలిగి ఉండటం అవసరం. ట్రస్ట్ ప్రకారం, ఆరతిలో ఒకేసారి 30 మంది మాత్రమే పాల్గొనగలరు. అయోధ్యలోని రామ మందిరంలో దర్శనం ఉచితం. రాంలాలా దర్శనం కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరతి రోజుకు మూడు సార్లు జరుగుతుంది. దీని కోసం తప్పనిసరిగా పాస్ తీసుకోవాలి. పాస్ ఉన్న వారినే హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.
తాజావార్తలు
-
Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
-
India – Oman Gas Pipeline: ఇక, హార్మూజ్తో నో లింక్.. గల్ఫ్ నుంచి నేరుగా గ్యాస్ సరఫరా..! భారత ఇంధన రంగానికి గేమ్ ఛేంజర్..
-
India Rank: ప్రపంచ టాప్-5 సైనిక శక్తుల్లో భారత్.. భారీగా అణ్వాయుధాలు, రక్షణ వ్యయం..
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
పార్లమెంట్లో 2/3 మెజారిటీనే టార్గెట్.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం బీజేపీ వ్యూహం..
ట్రెండింగ్
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!