Ayodhya: 32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమాభారతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభరరు రామ మందిర ప్రాంగణంలో కలుసుకున్నారు. అంతేకాదు.. మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. తమ కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. కాగా.. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
- PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
- Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
- Shreyas Iyer: మా ఓటమికి కారణం ఆ ఇద్దరే.. అస్సలు ఊహించలేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన శ్రేయస్..
ఈరోజు రాంలల్లా ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యాను. 32 ఏళ్ల 46 రోజుల క్రితం ఇక్కడ అడుగుపెట్టానని ఉమాభారతి ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఆ రోజు హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఒక గొప్ప రామ మందిరం నిర్మించారు.. ఆలయంలో రాంలాలా ప్రతిష్టించారని పేర్కొన్నారు. రామ మందిర శంకుస్థాపనకు ముందు, ఉమాభారతి తన ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఉమాభారతి రామమందిరం బయట నిలబడి ఉంది. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, ఉమాభారతి, “నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను, రాంలల్లా దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాము” అని రాశారు.
Read Also: Ram Mandir: రామ మందిరం తెరుచుకోగానే ‘ముహూర్తం డెలివరీ’.. మగబిడ్డ జననం..
1992 డిసెంబర్ 6న తీసిన ఉమాభారతి పాత ఫొటో కూడా బయటపడింది. ఈ ఫొటోలో.. ఉమాభారతి బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషితో కలిసి ఉన్నారు. భారతి, జోషి ఇద్దరూ కెమెరా వైపు నవ్వుతూ కనిపించారు. జోషికి ఇప్పుడు 90 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకాలేదు. రామజన్మభూమి ఉద్యమ ప్రధాన రూపశిల్పి లాల్ కృష్ణ అద్వానీ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ మహోత్సవంలో పాల్గొనలేదు. మసీదు కూల్చివేత కేసులో సీబీఐ అభియోగాలు మోపిన బీజేపీ, సంఘ్ పరివార్ నేతలలో భారతి, రితంభర కీలక పాత్ర పోషించారు. 2020లో అద్వానీ, జోషి తదితరులతో పాటు ఆయనను ప్రత్యేక కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH
— Uma Bharti (@umasribharti) January 22, 2024
తాజావార్తలు
-
KBR Park Video : కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ మైండ్ బ్లోయింగ్ ప్రాజెక్ట్.. వీడియో రిలీజ్.!
-
PM Narendra Modi: ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత గౌరవం.. ‘రాయల్ ఆర్డర్ ఆఫ్ పోలార్ స్టార్’ పురస్కారం
-
Ragi Mixture: సాయంత్రం స్నాక్స్లోకి క్రిస్పీ ‘రాగి మిక్సర్’.. సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే ఇలా చేసుకోండి!
-
Rahul Gandhi: ప్రధాని మౌనం ఎందుకు? విద్యామంత్రిని తొలగించండి..
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడికి షాక్.. రూల్స్ బ్రేక్ చేశారంటూ ట్రంప్కు ఫైన్ వేసిన అధికారులు! అసలేం జరిగిందంటే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..