Ayodhya: 32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమాభారతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభరరు రామ మందిర ప్రాంగణంలో కలుసుకున్నారు. అంతేకాదు.. మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. తమ కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. కాగా.. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
ఈరోజు రాంలల్లా ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యాను. 32 ఏళ్ల 46 రోజుల క్రితం ఇక్కడ అడుగుపెట్టానని ఉమాభారతి ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఆ రోజు హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఒక గొప్ప రామ మందిరం నిర్మించారు.. ఆలయంలో రాంలాలా ప్రతిష్టించారని పేర్కొన్నారు. రామ మందిర శంకుస్థాపనకు ముందు, ఉమాభారతి తన ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఉమాభారతి రామమందిరం బయట నిలబడి ఉంది. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, ఉమాభారతి, “నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను, రాంలల్లా దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాము” అని రాశారు.
Read Also: Ram Mandir: రామ మందిరం తెరుచుకోగానే ‘ముహూర్తం డెలివరీ’.. మగబిడ్డ జననం..
1992 డిసెంబర్ 6న తీసిన ఉమాభారతి పాత ఫొటో కూడా బయటపడింది. ఈ ఫొటోలో.. ఉమాభారతి బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషితో కలిసి ఉన్నారు. భారతి, జోషి ఇద్దరూ కెమెరా వైపు నవ్వుతూ కనిపించారు. జోషికి ఇప్పుడు 90 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకాలేదు. రామజన్మభూమి ఉద్యమ ప్రధాన రూపశిల్పి లాల్ కృష్ణ అద్వానీ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ మహోత్సవంలో పాల్గొనలేదు. మసీదు కూల్చివేత కేసులో సీబీఐ అభియోగాలు మోపిన బీజేపీ, సంఘ్ పరివార్ నేతలలో భారతి, రితంభర కీలక పాత్ర పోషించారు. 2020లో అద్వానీ, జోషి తదితరులతో పాటు ఆయనను ప్రత్యేక కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH
— Uma Bharti (@umasribharti) January 22, 2024
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!