Ayodhya: 32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమాభారతి..
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభరరు రామ మందిర ప్రాంగణంలో కలుసుకున్నారు. అంతేకాదు.. మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. తమ కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. కాగా.. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
ఈరోజు రాంలల్లా ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యాను. 32 ఏళ్ల 46 రోజుల క్రితం ఇక్కడ అడుగుపెట్టానని ఉమాభారతి ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఆ రోజు హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఒక గొప్ప రామ మందిరం నిర్మించారు.. ఆలయంలో రాంలాలా ప్రతిష్టించారని పేర్కొన్నారు. రామ మందిర శంకుస్థాపనకు ముందు, ఉమాభారతి తన ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఉమాభారతి రామమందిరం బయట నిలబడి ఉంది. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, ఉమాభారతి, “నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను, రాంలల్లా దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాము” అని రాశారు.
Read Also: Ram Mandir: రామ మందిరం తెరుచుకోగానే ‘ముహూర్తం డెలివరీ’.. మగబిడ్డ జననం..
1992 డిసెంబర్ 6న తీసిన ఉమాభారతి పాత ఫొటో కూడా బయటపడింది. ఈ ఫొటోలో.. ఉమాభారతి బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషితో కలిసి ఉన్నారు. భారతి, జోషి ఇద్దరూ కెమెరా వైపు నవ్వుతూ కనిపించారు. జోషికి ఇప్పుడు 90 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకాలేదు. రామజన్మభూమి ఉద్యమ ప్రధాన రూపశిల్పి లాల్ కృష్ణ అద్వానీ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ మహోత్సవంలో పాల్గొనలేదు. మసీదు కూల్చివేత కేసులో సీబీఐ అభియోగాలు మోపిన బీజేపీ, సంఘ్ పరివార్ నేతలలో భారతి, రితంభర కీలక పాత్ర పోషించారు. 2020లో అద్వానీ, జోషి తదితరులతో పాటు ఆయనను ప్రత్యేక కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH
— Uma Bharti (@umasribharti) January 22, 2024
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!