Ayodhya: 32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమాభారతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభరరు రామ మందిర ప్రాంగణంలో కలుసుకున్నారు. అంతేకాదు.. మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. తమ కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. కాగా.. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
- Rain Alert: ఏపీలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో మూడు రోజుల పాటు వర్షాలు..
ఈరోజు రాంలల్లా ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యాను. 32 ఏళ్ల 46 రోజుల క్రితం ఇక్కడ అడుగుపెట్టానని ఉమాభారతి ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఆ రోజు హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఒక గొప్ప రామ మందిరం నిర్మించారు.. ఆలయంలో రాంలాలా ప్రతిష్టించారని పేర్కొన్నారు. రామ మందిర శంకుస్థాపనకు ముందు, ఉమాభారతి తన ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఉమాభారతి రామమందిరం బయట నిలబడి ఉంది. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, ఉమాభారతి, “నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను, రాంలల్లా దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాము” అని రాశారు.
Read Also: Ram Mandir: రామ మందిరం తెరుచుకోగానే ‘ముహూర్తం డెలివరీ’.. మగబిడ్డ జననం..
1992 డిసెంబర్ 6న తీసిన ఉమాభారతి పాత ఫొటో కూడా బయటపడింది. ఈ ఫొటోలో.. ఉమాభారతి బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషితో కలిసి ఉన్నారు. భారతి, జోషి ఇద్దరూ కెమెరా వైపు నవ్వుతూ కనిపించారు. జోషికి ఇప్పుడు 90 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకాలేదు. రామజన్మభూమి ఉద్యమ ప్రధాన రూపశిల్పి లాల్ కృష్ణ అద్వానీ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ మహోత్సవంలో పాల్గొనలేదు. మసీదు కూల్చివేత కేసులో సీబీఐ అభియోగాలు మోపిన బీజేపీ, సంఘ్ పరివార్ నేతలలో భారతి, రితంభర కీలక పాత్ర పోషించారు. 2020లో అద్వానీ, జోషి తదితరులతో పాటు ఆయనను ప్రత్యేక కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH
— Uma Bharti (@umasribharti) January 22, 2024
తాజావార్తలు
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
-
Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
-
Hamas: హమాస్కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!
-
Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
-
Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!