Ayodhya: 32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమాభారతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభరరు రామ మందిర ప్రాంగణంలో కలుసుకున్నారు. అంతేకాదు.. మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. తమ కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. కాగా.. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Read Also: CM Siddaramaiah: మేము గాంధీ రాముడిని పూజిస్తాం, బీజేపీ రాముడిని కాదు.. కర్ణాటక సీఎం కీలక వ్యాఖ్యలు
Also Read
- రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
- Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
- Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ "పెసర గారెలు" చేసేయండి ఇలా.!
- Sitanshu Kotak: "వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం".. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
ఈరోజు రాంలల్లా ప్రాణ్-ప్రతిష్ఠ వేడుకకు హాజరయ్యాను. 32 ఏళ్ల 46 రోజుల క్రితం ఇక్కడ అడుగుపెట్టానని ఉమాభారతి ఎక్స్ ఖాతాలో తెలిపారు. ఆ రోజు హిందూ కార్యకర్తలు బాబ్రీ మసీదును కూల్చివేశారు. అప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఇప్పుడు ఒక గొప్ప రామ మందిరం నిర్మించారు.. ఆలయంలో రాంలాలా ప్రతిష్టించారని పేర్కొన్నారు. రామ మందిర శంకుస్థాపనకు ముందు, ఉమాభారతి తన ఫోటోను షేర్ చేశారు. ఇందులో ఉమాభారతి రామమందిరం బయట నిలబడి ఉంది. ఈ ఫోటోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ, ఉమాభారతి, “నేను అయోధ్యలోని రామ మందిరం ముందు ఉన్నాను, రాంలల్లా దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాము” అని రాశారు.
Read Also: Ram Mandir: రామ మందిరం తెరుచుకోగానే ‘ముహూర్తం డెలివరీ’.. మగబిడ్డ జననం..
1992 డిసెంబర్ 6న తీసిన ఉమాభారతి పాత ఫొటో కూడా బయటపడింది. ఈ ఫొటోలో.. ఉమాభారతి బీజేపీ సీనియర్ నాయకుడు మురళీ మనోహర్ జోషితో కలిసి ఉన్నారు. భారతి, జోషి ఇద్దరూ కెమెరా వైపు నవ్వుతూ కనిపించారు. జోషికి ఇప్పుడు 90 ఏళ్లు. వృద్ధాప్యం కారణంగా ఆయన ఈ వేడుకకు హాజరుకాలేదు. రామజన్మభూమి ఉద్యమ ప్రధాన రూపశిల్పి లాల్ కృష్ణ అద్వానీ కూడా ప్రతికూల వాతావరణం కారణంగా ఈ మహోత్సవంలో పాల్గొనలేదు. మసీదు కూల్చివేత కేసులో సీబీఐ అభియోగాలు మోపిన బీజేపీ, సంఘ్ పరివార్ నేతలలో భారతి, రితంభర కీలక పాత్ర పోషించారు. 2020లో అద్వానీ, జోషి తదితరులతో పాటు ఆయనను ప్రత్యేక కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది.
मैं अयोध्या में राम मंदिर के सामने हूं, रामलला की प्रतीक्षा हो रही है।@BJP4India @BJP4MP @ShriAyodhya_ @RamNagariAyodhy pic.twitter.com/2NDjQZhQxH
— Uma Bharti (@umasribharti) January 22, 2024
తాజావార్తలు
-
NRI: అంతిమ శ్వాస భారత్లోనే… అమెరికా పౌరసత్వం ఉన్న బాపట్ల వృద్ధురాలి కన్నీటి విజ్ఞప్తి!
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Operation Sindoor: ‘ఆపరేషన్ సిందూర్’ అమరవీరుల పేర్లు ఇవే.. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆరుగురు వీరులు!
-
Income Tax Notice: మీ బ్యాంకు ఖాతాలో ఇంత మొత్తం డబ్బు ఉందా? ఇన్ కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చే ఛాన్స్!
-
Vaibhav Sooryavanshi Debut: ఇతరులకు అన్యాయం చేయలేమంటున్న టీమిండియా.. వైభవ్ అరంగేట్రం కష్టమే!
ట్రెండింగ్
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!