Ram Darshan: భక్తులకు రేపటి నుంచి అయోధ్య రాముడి దర్శనం.. ఆన్లైన్లో బుక్ చేసుకోండిలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపటి నుంచి నీల మేఘ శ్యాముడు భక్త జన కోటికి దర్శనం ఇవ్వనున్నారు. మంగళవారం నుంచి సామాన్య భక్తులకు బాలరాముడు దర్శనం ఇవ్వనున్నారు. బాలరాముడి దర్శించుకునేందుకు ఆలయ ట్రస్ట్ రెండు స్లాట్స్ ఖరారు చేసింది. ఉదయం 7 గంటల నుంచి 11: 30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనం చేసుకునేందుకు అనుమతించనున్నారు.
Read Also: Ayodhya: 32 ఏళ్ల తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన ఉమాభారతి..
Also Read
- Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
- IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
- Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
- Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
బాలరాముడి దర్శనం కోసం ఆన్లైన్లో బుక్ చేసుకునే విధానం..
అయోధ్య రామ మందిరం అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలి.
లాగిన్ చేయడానికి మీ మొబైల్ నంబర్ని ఉపయోగించండి.
మీ మొబైల్కి పంపిన OTPతో మీ ఐడీని ధృవీకరించండి.
‘మై ప్రొఫైల్’ విభాగంలో గుర్తించి, క్లిక్ చేయండి.
ఆర్తి లేదా దర్శనం కోసం మీకు ఇష్టమైన స్లాట్ను ఎంచుకోండి.
అవసరమైన వివరాలను అందించండి.
మీ బుకింగ్ను పూర్తి చేయడానికి, పాస్ను పొందేందుకు ప్రాంప్ట్లను అనుసరించండి.
బుకింగ్ విజయవంతమైన తర్వాత నిర్ధారణను స్వీకరించండి.
ఆలయంలో ప్రవేశానికి ముందు ఆలయ కౌంటర్ నుండి మీ పాస్ను తీసుకోవాలి.
రామ మందిరంలో ఆరతి చేసే సమయం ఎంత?
రామాలయంలో రాంలాలా ఆరతి రోజుకు మూడు సార్లు నిర్వహిస్తారు. మొదటిది – ఉదయం 6:30 గంటలకు, దీనిని జాగ్రన్ లేదా శృంగార్ ఆర్తి అంటారు. రెండవది – మధ్యాహ్నం 12:00 గంటలకు భోగ్ ఆరతి అని.. మూడవది రాత్రి 7:30 గంటలకు సంధ్యా ఆరతి అని పిలుస్తారు.
రామమందిర ఆరతిలో ఎలా పాల్గొనవచ్చు?
అయోధ్యలోని రామ మందిరంలో ఆరతికి హాజరు కావడానికి శ్రీ రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్ట్ నుండి పాస్ తీసుకోవచ్చు. పాస్ కోసం చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డు (ID ప్రూఫ్) కలిగి ఉండటం అవసరం. ట్రస్ట్ ప్రకారం, ఆరతిలో ఒకేసారి 30 మంది మాత్రమే పాల్గొనగలరు. అయోధ్యలోని రామ మందిరంలో దర్శనం ఉచితం. రాంలాలా దర్శనం కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరతి రోజుకు మూడు సార్లు జరుగుతుంది. దీని కోసం తప్పనిసరిగా పాస్ తీసుకోవాలి. పాస్ ఉన్న వారినే హారతిలో పాల్గొనేందుకు అనుమతిస్తారు.
తాజావార్తలు
-
Amazon Offers: అమెజాన్లో సేల్స్.. టాప్ బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు..
-
Rahul Ravindran: “మహిళలు పురుషులపై దారుణాలు చేయడం నేనెక్కడా చూడలేదు… రాహుల్ రవీంద్రన్ సంచలనం!”
-
IAS Srilakshmi: ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా శ్రీలక్ష్మి.. రెండేళ్ల తర్వాత కీలక పోస్టింగ్.. ట్విస్ట్ ఏంటంటే..?
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!