Pawan Kalyan: ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే.. మీరు ఒక్క మాట జన సైనికులకు చెప్తే చాలు..
- ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే
- మీరు ఒక్క మాట జన సైనికులకు చెప్పారంటే ఆగిపోద్ది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది. ప్లాస్టిక్ నిషేధంపై ఏపీ డీప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేయాలని డిప్యూటీ స్పీకర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కోరారు. రఘురామ మాట్లాడుతూ.. ఇటీవల కేరళ ప్రభుత్వం మంచి తీసుకొచ్చింది. ఆ పాలసీతో ప్లాస్టిక్ ను నిషేధించడానికి మార్గం సుగమమైందన్నారు. ఏపీలో లిక్కర్ వినియోగం ఏ రేంజ్ లో ఉందో మన ఆదాయం చూస్తేనే తెలుస్తుందన్నారు.
Also Read
- Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
- AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
లిక్కర్ బాటిల్స్ అన్ని ప్లాస్టిక్ బాటిల్స్ కావడం వల్ల ప్లాస్టిక్ పొల్యూషన్ మరింత పెరిగిపోయే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలో ఓ జిల్లాలో లిక్కర్ బాటిల్ మీద అదనంగా రూ. 10 వసూలు చేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుడు ఆ ఖాళీ బాటిల్ ను తిరిగిఇచ్చిన వెంటనే అదనంగా వసూలు చేసిన రూ. 10 ని తిరిగి ఇచ్చేస్తున్నారని తెలిపారు. దీంతో ప్లాస్టిక్ రీసైకిల్ కు దారులు తెరుచుకుంటాయన్నారు.
బ్రాండీ బాటిల్స్ కి ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉంది. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఏపీలో కూడా కేరళ మాదిరిగా పాలసీ తీసుకొస్తే ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేయొచ్చని అన్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటే మేజర్ పర్సెంటేజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్ట్ ను అరికట్టొచ్చన్నారు. ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్స్ నిషేధానికి మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ ని నిషేధించండి అని మీరు జన సైనికులకు చెప్పారంటే చాలు.. ఎవరన్నా ప్లాస్టిక్ పడవేస్తే పట్టేసుకుంటారు. జనసైనికులు ఆ మధ్యన మీరు ఇచ్చిన పిలుపు మేరకు రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చారు.
Also Read:ఆపరేషన్ సింధూర్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సీఎడీఎస్ అనిల్ చౌహాన్!
ప్లాస్టిక్ ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఇస్తే చాలు ఇంక అది ఆగిపోతుందన్నారు. సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్స్ తీసుకుంటే.. ఈ ప్లాస్టిక్ భూతాన్ని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉందని పవన్ కళ్యాణ్ ను కోరారు. తల్లి గర్భంలో లో కూడా ఈ పొల్యూటెంట్స్ మైక్రో పొల్యూటెంట్స్ భయాందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. అలాగే గ్రామాల్లో, నగరాల్లో డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే ఈ ఫ్లెక్సీలు మానేసి ఆ అడ్వర్టైజ్మెంట్ ఏదో డిజిటల్ బోర్డ్స్ లోనే ఇచ్చుకుంటారన్నారు. డిజిటల్ బోర్డ్స్ ని ఎంకరేజ్ చేస్తే ప్లాస్టిక్ నిషేధించొచ్చని తెలిపారు.
తాజావార్తలు
-
LPG Cylinder: వంటింట్లో గ్యాస్ మంటలు.. సిలిండర్ రేటు ఎంత పెరిగిందంటే?
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!