Kishan Reddy : డీలిమిటేషన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్ నిజస్వరూపం బహిర్గతం
- తెలంగాణలో డీలిమిటేషన్ వివాదం: బీజేపీ vs కాంగ్రెస్ & బీఆర్ఎస్
- కిషన్ రెడ్డి ఆరోపణలు: తప్పుడు ప్రచారం చేస్తున్న ప్రతిపక్షాలు
- దక్షిణ భారత అభివృద్ధిపై బీజేపీ ధృక్పథం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసంగంలో కీలక అంశాలు వెలువడ్డాయి. ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందని పేర్కొన్నారు. చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు పార్టీలు పోటీపడి మాట్లాడిన తీరు, దేశంలో లేని సమస్యను సృష్టించి బీజేపీకి వ్యతిరేకంగా కలిసి పనిచేయడం, వారి అసలు ఉద్దేశ్యాన్ని బహిర్గతం చేసిందని తెలిపారు.
డీలిమిటేషన్ అంశంపై ఇప్పటివరకు పార్లమెంట్లో కానీ, కేబినెట్లో కానీ ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టంగా తెలిపారు. కానీ కొన్ని రాజకీయ పార్టీలు దక్షిణాదికి అన్యాయం జరుగుతోందన్న తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయని ఆరోపించారు. తమిళనాడులో డీఎంకే పాలన అవినీతితో నిండిపోయిందని, స్టాలిన్ కుటుంబ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దాచిపెట్టేందుకు డీలిమిటేషన్ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.
Also Read
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
- CNG Price Hike: సీఎన్జీ వాహనదారులకు మళ్లీ షాక్.. మరోసారి పెరిగిన ధరలు
- US -Iran Tensions: మళ్లీ యుద్ధ మేఘాలు.. కొడుకు పెళ్లికి కూడా వెళ్లకుండా వైట్ హౌస్లో ట్రంప్ హై-లెవెల్ మీటింగ్!
భారతీయ జనతా పార్టీ దక్షిణాది ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోందని, భవిష్యత్తులో కూడా అదే విధంగా కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ దక్షిణాదిలో బలపడకూడదన్న కుట్రతో కాంగ్రెస్, డీఎంకే, బీఆర్ఎస్ పార్టీలు కలసి దుష్ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజల పట్ల తమ విధేయతను నిరూపించుకున్న బీజేపీ, రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వం ఉన్నా వివక్ష లేకుండా అభివృద్ధి పనులను కొనసాగిస్తోందని స్పష్టం చేశారు.
నియోజకవర్గాల పునర్విభజన గురించి చట్ట ప్రక్రియ చాలా స్పష్టమైనదని, ముందుగా జనాభా లెక్కల సేకరణ జరగాల్సి ఉంటుందని, ఆ తర్వాతే చర్చలు, నిర్ణయాలు తీసుకోవచ్చని వివరించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ కలిసి డీలిమిటేషన్ అంశాన్ని కేంద్రంపై దుష్ప్రచారానికి వాడుకోవడం తగదని పేర్కొన్నారు.
గత పదిన్నరేళ్లుగా నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి చెందుతుందని, సమర్థవంతమైన పరిపాలనతో ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని వివరించారు. తప్పుడు ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాలని, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
SRH vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్.. మొదట బ్యాటింగ్ చేయనున్న ఎస్ఆర్హెచ్
తాజావార్తలు
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
-
Kangana Ranaut : సీక్రెట్గా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన కంగనా
-
RCB vs SRH: ఆర్సీబీ మాస్టర్ ప్లాన్ సక్సెస్.. మ్యాచ్ ఓడినా టేబుల్ టాపర్గా నిలిచిన పాటిదార్ సేన..
-
Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
-
Motorola Edge 70 Pro+: మోటరోలా ఎడ్జ్ 70 ప్రో+ త్వరలో భారత్ లో విడుదల.. 50MP ట్రిపుల్ రియర్ కెమెరా, 16GB RAM
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!