CPI Ramakrishna: రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదు.. అమిత్ షాని ప్రధాని వెనకేసుకొస్తున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. పార్లమెంట్లో డా బీఆర్ అంబేద్కర్ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచాడని, ఆయనను ప్రధాని మోడీ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని డిసెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని తెలిపారు. ఆదాని అగ్రిమెంట్పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసిందని, సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదన్నారు. ఆదాని అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్వందించడం లేదు? అని రామకృష్ణ ప్రశ్నించారు.
విజయవాడ దాసరి భవన్లో సీపీఐ శత వార్షికోత్సవ వేడుకలకు సంబందించిన పోస్టర్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ఇతర నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ… ‘డిసెంబర్ 26 నుండి శత వార్షికోత్సవాలు ప్రారంభం అవుతాయి. సీపీఐ శత వార్షికోత్సవ సభ ఖమ్మంలో 2026 డిసెంబర్ 26న జరుగుతుంది. దేశంలో కాంగ్రెస్, సీపీఐ మాత్రమే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలు. సంవత్సరం పొడవునా శత వార్షికోత్సవ సభలు జరుగుతాయి. 26న విజయవాడలో శత వార్షికోత్సవ సభలు జరుగుతాయి’ అని చెప్పారు.
Also Read
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
- CM Chandrababu: ఆరు నెలల్లో 5.52 లక్షల ఇళ్లను పూర్తి చేయాలి.. సీఎం కీలక ఆదేశాలు
‘పార్లమెంట్లో డా బీఆర్ అంబేద్కర్ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచారు. ప్రధాని అమిత్ షాని వెనకేసుకొస్తున్నారు. రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదు. రాజ్యాంగ పీఠిక మార్చాలని బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని 30వ తేదీన దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఆదాని అగ్రిమెంట్పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసింది. సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదు, ఆయన బయపడుతున్నారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. చిన్న చిన్న అంశాలపై స్పందిస్తున్న సీఎం ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదు. ఆదాని అంశంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్వందించడం లేదు?. చంద్రబాబు నిద్రా పోతున్నారా? లేక నిద్ర పోయినట్లు నటిస్తున్నారా?. ఆదాని అంశంపై చర్యలు తీసుకొనే వరకు సీపీఐ పోరాటం చేస్తుంది’ అని రామకృష్ణ తెలిపారు.
తాజావార్తలు
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
Dhanush D56 Title: ధనుష్ D56కి ‘పడయల్’ టైటిల్.. ఊహించని మాస్ యాక్షన్తో రాబోతున్నాడా?
ట్రెండింగ్
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!