CPI Ramakrishna: రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదు.. అమిత్ షాని ప్రధాని వెనకేసుకొస్తున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదని ఆంధ్రప్రదేశ్ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. పార్లమెంట్లో డా బీఆర్ అంబేద్కర్ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచాడని, ఆయనను ప్రధాని మోడీ వెనకేసుకొస్తున్నారని విమర్శించారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని డిసెంబర్ 30వ తేదీన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తాం అని తెలిపారు. ఆదాని అగ్రిమెంట్పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసిందని, సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదన్నారు. ఆదాని అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎందుకు స్వందించడం లేదు? అని రామకృష్ణ ప్రశ్నించారు.
విజయవాడ దాసరి భవన్లో సీపీఐ శత వార్షికోత్సవ వేడుకలకు సంబందించిన పోస్టర్ను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ జెల్లీ విల్సన్, ఇతర నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ… ‘డిసెంబర్ 26 నుండి శత వార్షికోత్సవాలు ప్రారంభం అవుతాయి. సీపీఐ శత వార్షికోత్సవ సభ ఖమ్మంలో 2026 డిసెంబర్ 26న జరుగుతుంది. దేశంలో కాంగ్రెస్, సీపీఐ మాత్రమే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీలు. సంవత్సరం పొడవునా శత వార్షికోత్సవ సభలు జరుగుతాయి. 26న విజయవాడలో శత వార్షికోత్సవ సభలు జరుగుతాయి’ అని చెప్పారు.
Also Read
- Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
- Harish Rao: "నీకు మా రక్తం కావాలా".. సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్..
- Vaibhav Sooryavanshi: "టాస్ వేసేదాకా చెప్పలేదు".. తీవ్ర నిరాశతో కన్నీరు పెట్టినంత పని చేసిన వైభవ్.. సీనియర్స్ ఫైర్!
- ICC T20 Ranking: 1,605 రోజుల సామ్రాజ్యం కుప్పకూలింది.. నంబర్ 1 ర్యాంక్ను కోల్పోయిన భారత్!
‘పార్లమెంట్లో డా బీఆర్ అంబేద్కర్ను కేంద్రమంత్రి అమిత్ షా అవమానపరిచారు. ప్రధాని అమిత్ షాని వెనకేసుకొస్తున్నారు. రాజ్యాంగంపై బీజేపీకి అభిమానం లేదు. రాజ్యాంగ పీఠిక మార్చాలని బీజేపీ ఎంపీ సుప్రీంకోర్టులో కేసు వేశారు. అమిత్ షాని మంత్రి పదవి నుండి తొలగించాలని 30వ తేదీన దేశ వ్యాప్తంగా ఆందోళన జరుగుతుంది. ఆదాని అగ్రిమెంట్పై అవకతవకలు జరిగాయని రాయటర్స్ పత్రిక రాసింది. సీఎం చంద్రబాబు కూడా ఆదాని అంశంపై స్వందించడం లేదు, ఆయన బయపడుతున్నారు. ఆదానితో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలి. చిన్న చిన్న అంశాలపై స్పందిస్తున్న సీఎం ఈ అంశంపై ఎందుకు స్పందించడం లేదు. ఆదాని అంశంపై పవన్ కళ్యాణ్ ఎందుకు స్వందించడం లేదు?. చంద్రబాబు నిద్రా పోతున్నారా? లేక నిద్ర పోయినట్లు నటిస్తున్నారా?. ఆదాని అంశంపై చర్యలు తీసుకొనే వరకు సీపీఐ పోరాటం చేస్తుంది’ అని రామకృష్ణ తెలిపారు.
తాజావార్తలు
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
-
Viral Wedding: 17 ఏళ్ల ఇన్ఫ్లుయెన్సర్ కు పెళ్లి.. భర్తతో రొమాంటిక్గా పోజులిస్తున్న మైనర్ వధువు.. షాక్లో అభిమానులు
-
Team India: ఓవైపు భారీ ఓటములు.. మరోవైపు అత్యంత చెత్త రికార్డులు.. ఈ టీమిండియాకు ఏమైంది!
-
Harry Brook: అన్నంత పనిచేశాడు.. పక్కాగా స్కెచ్ వేసి టీమిండియాను మట్టికరిపించిన ఇంగ్లాండ్ కెప్టెన్!
-
Lenin Box Office Collections: బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న ‘లెనిన్’.. రెండు రోజుల్లోనే 37 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..