Vakapalli Case: సంచలనం సృష్టించిన వాకపల్లి సామూహిక అత్యాచారం కేసు కొట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vakapalli Case: వాకపల్లి ఆదివాసీ మహిళల అత్యాచారం కేసును కొట్టేసింది విశాఖ సెషన్స్ కోర్టు. విచారణలో నేరం రుజువు కాలేదని తెలిపింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని లీగల్ సెల్ అథారిటీని ఆదేశించింది. 2007 ఆగస్టులో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లిలో ఈ ఘటన జరిగింది. కుంబింగ్ కోసం వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం అత్యాచారాలకు పాల్పడిందని కేసు నమోదు చేశారు. మానవాహక్కులు, పౌర సంఘాలు కల్పించుకోవడంతో వివిధ దశల్లో విచారణ జరిగింది. అయితే, కేసు విచారణ దశలోనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. నేరం రుజువు కాలేదంటూ కేసును కొట్టేసింది కోర్టు. అప్పటి దర్యాప్తు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
కాగా, 2007 ఆగస్టు 20న విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయితీ వాకపల్లి గ్రామంలో కూంబింగు పేరుతో గ్రేహౌండ్స్ పోలీసులు చొరబడి స్వైరవిహారం చేశారు. వాకపల్లి గ్రామంలోని కోండు తెగకు చెందిన 11 మంది ఆదివాసీ మహిళలను అత్యంత అమానుషంగా, ఘోరంగా అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి.. బాధిత మహిళల్లో ఇద్దరు మరణించారు. ఆ సంఘటన జరిగిన వాటి నుండి అనేక ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో… ఆరోజు వాకపల్లికి గ్రేహౌండ్స్ పాలీసులు వెళ్ళినట్టు ఒప్పుకోవడమే కాకుండా వారి వివరాలతో కూడిన జాబితా విడుదల చేశారు.. ఈ కేసును అణగదొక్కడానికి వైద్య వివేదికల చుట్టూ తిప్పాలని చూశారు. ఆ నివేదికను అడ్డుపెట్టుకొని రాష్ట్ర హోంశాఖ అసలు అత్యాచారమే జరగలేదని బుకాయించిందనే విమర్శలు వచ్చాయి.. ఆ గ్రామానికి వెళ్ళింది సామాన్యులు కాదు. ప్రతిఘటించడానికి వాళ్లు మామూలు వ్యక్తులు కారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసైగలో పని చేస్తున్న సాయుధ గ్రేహౌండ్స్ పోలీసుల రూపంలో ఉన్న రాబందులు అంటూ ప్రజాసంఘాలు మండిపడ్డాయి.. అయితే, వాకపల్లి ఆదివాసీ మహిళల అత్యాచారం కేసును ఈరోజు కొట్టేసింది విశాఖ సెషన్స్ కోర్టు. విచారణలో నేరం రుజువు కాలేదని తెలిపింది.
Also Read
వాకపల్లి గ్యాంగ్ రేప్ కేసును విచారిస్తున్న SC & ST (PoA) చట్టం కింద XI అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి-కమ్-స్పెషల్ కోర్టు న్యాయమూర్తి మొత్తం 13 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులు దోషులుగా గుర్తించబడలేదని న్యాయమూర్తి తెలిపారు. అప్పీల్ సమయం ముగిసిన తర్వాత బెయిల్ బాండ్లు రద్దు చేయబడతాయని మరియు కేసు సంబంధించిన ఆధారాలు ఏదైనా ఉంటే, అప్పీల్ సమయం తర్వాత ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ కేసులో దర్యాప్తు అధికారులలో ఒకరైన శివానంద రెడ్డి “సరైన విచారణను నిర్వహించడంలో విఫలమైనందుకు” చర్య తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీకి రిఫర్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
ఐఓల వైఫల్యం కారణంగా నిందితులు నిర్దోషులుగా విడుదలైనందున, తొమ్మిది మంది బాధితులు పరిహారం పొందేందుకు అర్హులని, తగు విచారణ తర్వాత పరిహారం పరిమాణాన్ని నిర్ణయించి, వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించినట్లు న్యాయమూర్తి తెలిపారు. 2007 నుండి లైంగిక వేధింపులు మరియు ఇతర నేరాల బాధితులు. వాకపల్లికి చెందిన 11 మంది గిరిజన మహిళలు ఆగస్ట్ 20, 2007న ఎ.పి.పోలీసుల స్పెషల్ పార్టీ తమ గ్రామానికి వచ్చి తమపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ కేసును బతికున్న 11 మంది బాధితుల్లో తొమ్మిది మంది పోరాడుతున్నారు. బాధితుల నిరంతర ప్రయత్నం తర్వాత, విశాఖపట్నంలోని ఎస్సీ & ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ద్వారా కేసును విచారించాలని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!