Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Court Acquits All Accused In Vakapalli Case

Vakapalli Case: సంచలనం సృష్టించిన వాకపల్లి సామూహిక అత్యాచారం కేసు కొట్టివేత..

Published Date :April 6, 2023 , 9:47 pm
By Sudhakar Ravula
Vakapalli Case: సంచలనం సృష్టించిన వాకపల్లి సామూహిక అత్యాచారం కేసు కొట్టివేత..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Vakapalli Case: వాకపల్లి ఆదివాసీ మహిళల అత్యాచారం కేసును కొట్టేసింది విశాఖ సెషన్స్‌ కోర్టు. విచారణలో నేరం రుజువు కాలేదని తెలిపింది. బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని లీగల్ సెల్ అథారిటీని ఆదేశించింది. 2007 ఆగస్టులో విశాఖ జిల్లా జి.మాడుగుల మండలం వాకపల్లిలో ఈ ఘటన జరిగింది. కుంబింగ్ కోసం వెళ్లిన ప్రత్యేక పోలీసు బృందం అత్యాచారాలకు పాల్పడిందని కేసు నమోదు చేశారు. మానవాహక్కులు, పౌర సంఘాలు కల్పించుకోవడంతో వివిధ దశల్లో విచారణ జరిగింది. అయితే, కేసు విచారణ దశలోనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. నేరం రుజువు కాలేదంటూ కేసును కొట్టేసింది కోర్టు. అప్పటి దర్యాప్తు అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేసింది.

కాగా, 2007 ఆగస్టు 20న విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయితీ వాకపల్లి గ్రామంలో కూంబింగు పేరుతో గ్రేహౌండ్స్‌ పోలీసులు చొరబడి స్వైరవిహారం చేశారు. వాకపల్లి గ్రామంలోని కోండు తెగకు చెందిన 11 మంది ఆదివాసీ మహిళలను అత్యంత అమానుషంగా, ఘోరంగా అత్యాచారం చేశారని ఆరోపణలు వచ్చాయి.. బాధిత మహిళల్లో ఇద్దరు మరణించారు. ఆ సంఘటన జరిగిన వాటి నుండి అనేక ఆదివాసీ సంఘాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో… ఆరోజు వాకపల్లికి గ్రేహౌండ్స్‌ పాలీసులు వెళ్ళినట్టు ఒప్పుకోవడమే కాకుండా వారి వివరాలతో కూడిన జాబితా విడుదల చేశారు.. ఈ కేసును అణగదొక్కడానికి వైద్య వివేదికల చుట్టూ తిప్పాలని చూశారు. ఆ నివేదికను అడ్డుపెట్టుకొని రాష్ట్ర హోంశాఖ అసలు అత్యాచారమే జరగలేదని బుకాయించిందనే విమర్శలు వచ్చాయి.. ఆ గ్రామానికి వెళ్ళింది సామాన్యులు కాదు. ప్రతిఘటించడానికి వాళ్లు మామూలు వ్యక్తులు కారు. రాష్ట్ర ప్రభుత్వం కనుసైగలో పని చేస్తున్న సాయుధ గ్రేహౌండ్స్‌ పోలీసుల రూపంలో ఉన్న రాబందులు అంటూ ప్రజాసంఘాలు మండిపడ్డాయి.. అయితే, వాకపల్లి ఆదివాసీ మహిళల అత్యాచారం కేసును ఈరోజు కొట్టేసింది విశాఖ సెషన్స్‌ కోర్టు. విచారణలో నేరం రుజువు కాలేదని తెలిపింది.

వాకపల్లి గ్యాంగ్ రేప్ కేసును విచారిస్తున్న SC & ST (PoA) చట్టం కింద XI అదనపు జిల్లా మరియు సెషన్స్ జడ్జి-కమ్-స్పెషల్ కోర్టు న్యాయమూర్తి మొత్తం 13 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించారు. నిందితులు దోషులుగా గుర్తించబడలేదని న్యాయమూర్తి తెలిపారు. అప్పీల్ సమయం ముగిసిన తర్వాత బెయిల్ బాండ్‌లు రద్దు చేయబడతాయని మరియు కేసు సంబంధించిన ఆధారాలు ఏదైనా ఉంటే, అప్పీల్ సమయం తర్వాత ధ్వంసం చేయాలని ఆదేశించినట్లు న్యాయమూర్తి తెలిపారు. అయితే, ఈ కేసులో దర్యాప్తు అధికారులలో ఒకరైన శివానంద రెడ్డి “సరైన విచారణను నిర్వహించడంలో విఫలమైనందుకు” చర్య తీసుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కమిటీకి రిఫర్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.

ఐఓల వైఫల్యం కారణంగా నిందితులు నిర్దోషులుగా విడుదలైనందున, తొమ్మిది మంది బాధితులు పరిహారం పొందేందుకు అర్హులని, తగు విచారణ తర్వాత పరిహారం పరిమాణాన్ని నిర్ణయించి, వారికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆదేశించినట్లు న్యాయమూర్తి తెలిపారు. 2007 నుండి లైంగిక వేధింపులు మరియు ఇతర నేరాల బాధితులు. వాకపల్లికి చెందిన 11 మంది గిరిజన మహిళలు ఆగస్ట్ 20, 2007న ఎ.పి.పోలీసుల స్పెషల్ పార్టీ తమ గ్రామానికి వచ్చి తమపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపించింది. ఈ కేసును బతికున్న 11 మంది బాధితుల్లో తొమ్మిది మంది పోరాడుతున్నారు. బాధితుల నిరంతర ప్రయత్నం తర్వాత, విశాఖపట్నంలోని ఎస్సీ & ఎస్టీ (అత్యాచారాల నిరోధక) చట్టం కింద ఏర్పాటైన ప్రత్యేక కోర్టు ద్వారా కేసును విచారించాలని 2017 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం విదితమే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • accused
  • Andhra Pradesh
  • special court
  • Vakapalli case
  • Vizag

తాజావార్తలు

  • AP IAS Transfers: ఏపీలో కీలక ఐఏఎస్ అధికారుల బదిలీలు..

  • Off The Record: ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ నేతలపై సీరియస్

  • Donald Trump: మిత్రదేశాలపై ట్రంప్ ఆగ్రహం.. ‘మీరు పిరికివారు’ అంటూ విమర్శ..

  • Boat Valour Watch 1R: ప్రీమియం లుక్, లాంగ్ బ్యాటరీ.. boAt ప్రీమియం స్మార్ట్‌వాచ్‌ వాలర్ వాచ్ 1R రిలీజ్

  • Exam Results: ఎఫ్ఎస్ఎల్ ఉద్యోగ నియామక పరీక్ష ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..

ట్రెండింగ్‌

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • 55dB ANC, LHDC 5.0 సపోర్ట్‌తో కేవలం రూ. 3,999కే OnePlus Nord Buds 4 Pro భారత్‌లో లాంచ్.!

  • Gut Health : పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచే ఆహారాలు ఇవే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions