Corona Tension: ఏపీ, తెలంగాణల్లో కరోనా టెన్షన్
అంతా అయిపోయింది.. ఇక మనం సేఫ్ అనుకున్నాం. కానీ కరోనా మహమ్మారి మాత్రం నేనున్నానని.. మీరేం సేఫ్ కాదంటోంది. ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో కొత్తగా కరోనా కేసులు ఏమి నమోదు కాలేదు.. గత నెల రోజుల క్రితం రెండు కేసులు మాత్రమే నమోదయ్యాయి.. మరోవైపు నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. హైదరాబాద్ ఏఐజి ఆసుపత్రిలో చేరిన పోసాని పూణేలో జరిగిన షూటింగ్లో పాల్గొని నిన్ననే హైదరాబాదుకు వచ్చారు. పోసానికి కరోనా రావడం ఇది మూడోసారి ఏపీ ప్రభుత్వ చలనచిత్ర టీవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
Read Also: SRH vs KKR: శతక్కొట్టిన బ్రూక్.. కేకేఆర్ ముందు భారీ లక్ష్యం
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 13 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఏలూరు జిల్లాలో 11, పశ్చిమ గోదావరిజిల్లాలో 2కేసులు నమోదు అయ్యాయి. ఏలూరు జిల్లాలో చింతల పూడి రూరల్ పరిధిలో చింతలపూడి, వెంకటాపురం, ఉర్లగూడెం, ఊటసముద్రంలో ఒక్కొక్కటి, ఏలూరు అర్బన్ పరిధిలో పత్తేబాద, తాపీమేస్త్రీకాలనీలో ఒక్కొక్కటి, నూజి వీడు రూరల్ పరిధి గొల్లపల్లిలో రెండు, కోనేరుపేటలో ఒకటి, ఉంగుటూరు రూరల్ పరిధి ఉంగుటూరు, రావులపర్రులలో ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో గణపవరం రూరల్ పిప్పర, తాడేపల్లిగూడెంలో ఒక్కొక్క కొవిడ్ కేసు నమోదయ్యాయి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా సంగతికి వస్తే జిల్లా వ్యాప్తంగా 20 కోవిడ్ యాక్టివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాజులూరు పీ హెచ్ సి పరిధిలో…8,ఎస్. యానం లో…6,బలుసుతిప్ప…3,బండారులంక…1, పల్లంకుర్రు…1, ద్వారపూడి…1 నమోదయ్యాయి. వీరందరినీ హోమ్ ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఇటు నెల్లూరు జిల్లాలో రెండు కేసులు ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో 3 కరోనా కేసులు నమోదయ్యాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన వారం రోజుల్లో 20 కరోనా కేసులు నమోదయ్యాయి.
Read Also: Fairy Tale Forests: ఇవి అడవులు కావు.. భూతల స్వర్గాలు
ఉమ్మడి కృష్ణ జిల్లాలో 6 కేసులు నమోదు కాగా, విజయవాడ ప్రభుత్వసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు వైద్యులు… ఇటు తెలంగాణలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిన్న 45 కరోనా కేసులు నమోదు అయ్యాయి. హైదరాబాద్ లో 18 కేసులు నమోదు అవడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ. మొత్తం మీద కరోనా కేసుల విషయంలో జాగ్రత్తలు అవసరం అని వైద్యులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో