కరోనా పేరు వింటే చాలు ప్రతి ఒక్కరికి హడలే.. గత మూడేళ్లుగా ప్రపంచాన్ని వణికించిన ఈ వ్యాధి జనాలకి కంటిమీద కునుకు లేకుండా చేసింది. అంతేకాకుండా కరోనాతో పోరాడి చాలామంది చనిపోయిన వారు కూడా ఉన్నారు. ఐతే ఇప్పుడిప్పుడే కరోనా నుంచి కోలుకుంటున్న లోపే.. మరో ప్రమాదం ముంచుకొస్తుంది. పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ కేసులు బయటికి వస్తున్నాయి.
Taneti Vanitha: పార్టీలకు అతీతంగా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా.. గత 28 రోజులలో (10 జూలై నుండి 6 ఆగస్టు 2023 వరకు) దాదాపు 1.5 మిలియన్ కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. అందులో 2500 మరణాలు ఉన్నాయి. గత 28 రోజులతో పోలిస్తే వరుసగా 80% పెరుగుదల మరియు 57% తగ్గుదల ఉన్నాయి. 6 ఆగస్టు 2023 నాటికి.. ప్రపంచవ్యాప్తంగా 769 మిలియన్లకు పైగా కరోనా కేసులు మరియు 6.9 మిలియన్లకు పైగా మరణాలు నమోదయ్యాయి.
Who Movie: దయ తరువాత ‘హూ’ అంటున్న జేడీ!
అంతేకాకుండా.. ఈజీ 5 (EG.5) అనే వీరియంట్ ప్రస్తుతం దేశంలో 17 శాతం కొత్త కరోనా వైరస్ కేసులకు కారణమవుతుందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ కొత్త రకం వేరియంట్ ఒమక్రాన్ జాతికి చెందిన ప్రస్తుతమున్న ఎక్స్ బీ 1.9.2(XBB.1.9.2) రికాంబినెంట్ వైరస్ నుంచి పుట్టుకొచ్చిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎక్స్ బీ 1.9.2 స్ట్రయిన్ తో పోలిస్తే ఇది.5లోని స్పైక్ ప్రోటీన్ లో అదనంగా ఒక మ్యూటేషన్ కలిగి ఉంటదని ఇది 465 స్థానంలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మరోవైపు ఒమిక్ రౌండ్ నుంచి మరో కొత్త వేరియంట్ ” ఈజీ.5.1″గా రూపాంతరం చెంది యూకేలో వేగంగా విస్తరిస్తుంది. యూకేలో కరోనా కొత్త వేరియంట్ ఎరిస్ అనే పేరుతో రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఇప్పటివరకు గుర్తించిన ఏడు కొత్త వేరియంట్లలో ఇది ఒక్కటని యూకే ఆరోగ్య అధికారులు తెలిపారు.