Lok Sabha Elections 2024: సినీ నటి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ నటి, బీజేపీ మండి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి కంగనా రనౌత్ పై హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ మంత్రి విక్రమాధిత్య మరోసారి ఫైర్ అయ్యారు. కంగనా రనౌత్ కేవలం ఎన్నికల కోసం దిగుమతి చేసుకున్న నాయకురాలని విక్రమాధిత్య సింగ్ విమర్శించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాసౌలీలో నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ఆమె మండి నియోజక వర్గంలో ఎలాగో ఓడిపోతుందని.. ముంబైకి సాగనంపే ఏర్పాట్లు పూర్తయ్యాయని ఎద్దేవా చేశారు. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అన్ని ఎంపీ స్థానాలు గెలుచుకోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మండి నియోజకవర్గంలో అయితే రాష్ట్రానికి దిగుమతి చేయబడిన కంగానా రనౌత్ ను ముంబైకి సాగనంపడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. మండిలో ప్రతి రోజు రాత్రి పగలు పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అత్యధిక మెజార్టీతో గెలుస్తుందన్నారు.
READ MORE: BJP Leaders: నేడు రాష్ట్రానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. ఎవరెవరు అంటే..
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
- రూ.14,500 డిస్కౌంట్, 512GB స్టోరేజ్, Full HD+ Dynamic AMOLED 2X డిస్ప్లే శాంసంగ్ అందుబాటులోకి..
కాగా.. గత నెలలో కూడా విక్రమాధిత్య కంగనా రనౌత్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కంగానా రనౌత్ వర్ష కాలంలో వచ్చే కప్ప లాంటి వారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారం అనంతరం మండి నుంచి ఆమె వెళ్లిపోతుందని పేర్కొన్నారు. కంగనా హిమాచల్ ప్రదేశ్ కు కేవలం టూర్ కోసమే వస్తారని విమర్శించారు. ఈ రోజు ఇక్కడ ఉంటారు. రేపు మళ్లీ వెళ్లిపోతారన్నారు. ఆమెకు బీజేపీ ఎంపీ సీటు ప్రకటించినప్పుడు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమ వేరు.. రాజకీయం వేరని.. రాజకీయం పరంగా ఆమెకు ఎటువంటి నాలెడ్జ్ లేదన్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండే నేత కావాలా.. స్టార్ డమ్ నేతలు కావాలో నిర్ణయించుకోవాలని ఓటర్లకు సూచించారు. ఇదిలా ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండి, సిమ్లా, కాంగ్రా, మహీపూర్లో చివరి విడత జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!