Prajwal rape victims: కర్ణాటక సర్కార్ కీలక నిర్ణయం.. బాధితులకు ఆర్థిక సాయం
మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడ మనవడు, ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేవణ్ణ చేతిలో లైంగిక వేధింపులకు గురైన బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. బెళగావిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, ఆ రాష్ట్ర ఇంఛార్జ్ రణ్దీప్ సుర్జేవాలా ఈ విషయాన్ని వెల్లడించారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ల సమక్షంలో ఈ ప్రకటన చేశారు.
ఇది కూడా చదవండి: Geetha Bhagath: హీరో కడతాడని చీర కట్టుకు రాలేదు.. యాంకర్ షాకింగ్ కామెంట్స్
Also Read
- House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
- Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
- Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
- IPL 2026: 8 మ్యాచ్లు ఆడి చేసిన స్కోర్ 88.. అతడిని తప్పించాల్సిందే.. రాజస్థాన్ రాయల్స్ ఆటగాడిపై సెహ్వాగ్ ఆగ్రహం..
బాధితులకు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారని సుర్జేవాలా వెల్లడించారు. బాధితులు వందల సంఖ్యలో ఉన్నట్లుగా తెలుస్తుందన్నారు. ఇది భిన్నమైన కేసు అని.. గడిచిన 75 ఏళ్లలో ఇటువంటి ఘటన ఎన్నడూ జరగలేదు అని సుర్జేవాలా తెలిపారు. నిందితులపై సరైన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీ కూడా డిమాండ్ చేశారన్నారు. బీజేపీ కూటమిలో జేడీఎస్ ఉన్నందున.. వారిని రక్షించేందుకు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజ్వల్కు సంబంధించిన సమాచారం ఉన్నప్పటికీ ఆ పార్టీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారని బీజేసీని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: Drug racket: మహారాష్ట్రలో డ్రగ్ రాకెట్ గుట్టురట్టు.. భారీగా డ్రగ్స్ సీజ్
ప్రజ్వల్ దేశం విడిచి పారిపోకుండా విదేశాంగ శాఖ ఎందుకు అడ్డుకోలేక పోయిందని కాంగ్రెస్ నేతలు నిలదీశారు. నిందితుడికి ఉన్న దౌత్య పాస్పోర్టును ఇంకా ఎందుకు రద్దు చేయలేదని, అతడిని స్వదేశానికి తీసుకు వచ్చేందుకు ఇంటర్పోల్ ద్వారా నోటీసులు ఎందుకు ఇవ్వలేదన్నారు. సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ప్రజ్వల్ను స్వదేశానికి రప్పించేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ చేస్తామన్నారు.
ఇదిలా ఉంటే తాజాగా దర్యాప్తు సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. బాధితుల కోసం ఒక హెల్ప్లైన్ ఏర్పాటు చేసింది. ఎవరైనా ప్రజ్వల్ రేవణ్ణ బాధితులు ఉంటే హెల్ప్లైన్ నెంబర్కు ఫోన్ చేయాలని తెలిపింది. ఇందుకోసం హెల్ప్లైన్ నెంబర్ 6360-938947 గా సిట్ పేర్కొంది. ఈ నెంబర్కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Dulam Nageswara Rao: ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్న దూలం నాగేశ్వరరావు పెద్ద కోడలు..
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఐఏఎస్ల బదిలీల్లో రేవంత్ రెడ్డి క్యారెట్ అండ్ స్టిక్ పాలసీ
-
House Sales Down: భారీగా పడిపోయిన ఇళ్ల అమ్మకాలు.. ప్రధాన కారణం ఇదే..
-
Software Jobs Opening: లేఆఫ్స్ మధ్య భారీ ఊరట.. నియామకాలు స్టార్ట్ చేసిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ..
-
Success Story: ఊరి నుంచి రూ.12 అప్పు చేసి వచ్చాడు.. నేడు రూ. 15 వేల కోట్లకు అధిపతి..
-
Angkrish Raghuvanshi: రేర్ డిస్మిసల్.. అంగ్క్రిష్ రఘువంశీ ఆబ్స్ట్రక్టింగ్ ది ఫీల్డ్ కు ఔట్.. కేకేఆర్ ఆగ్రహం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!