Haryana Election Results: ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ రెండు రోజులే సంతోషంగా ఉంది..
- హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- మూడోసారి అధికారం దిశగా బీజేపీ
- 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ కాంగ్రెస్కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగిలింది- మోహన్ లాల్ బడోలి
- ఈ విషయం ఎగ్జిట్ పోల్ సమయంలోనే చెప్పాను- మోహన్ లాల్ బడోలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రస్తుతం 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హర్యానా యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి మాట్లాడారు. కాంగ్రెస్కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగులుతుందని ఎగ్జిట్ పోల్ సమయంలోనే తాను చెప్పానని అన్నారు. వస్తున్న ఫలితాలను బట్టి బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. 2047 వరకు బీజేపీ పాలన సాగుతుందని ఎగ్జిట్ పోల్లోనే చెప్పినట్లు బడోలి పేర్కొన్నారు. ఈ విధానాలకు ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ విజయం పట్ల పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యకర్తల శ్రమ ఫలించిందని అన్నారు.
Read Also: Omar Abdullah: జమ్మూకాశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా! ఎన్సీ కూటమి చర్చలు
Also Read
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
చాలా ఎగ్జిట్ పోల్స్లో హర్యానా ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఫలితాలు అందుకు విరుద్ధంగా వెల్లడయ్యాయి. హర్యానాలో బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెజారిటీ మార్కును దాటి.. 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అవుట్గోయింగ్ అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. (ఇందులో 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన ఆడమ్పూర్ సీటు కూడా ఉంది), కాంగ్రెస్కు 28, జేజేపీకి ఆరుగురు ఉన్నారు. హర్యానా లోఖిత్ పార్టీ, ఐఎన్ఎల్డికి ఒక్కొక్కరు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు ఉండగా తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు.. 2019 కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా తన సీటును కాపాడుకోలేకపోయాడు.
Read Also: CM Chandrababu: కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!