Haryana Election Results: ఎగ్జిట్ పోల్స్ తో కాంగ్రెస్ రెండు రోజులే సంతోషంగా ఉంది..
- హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు
- మూడోసారి అధికారం దిశగా బీజేపీ
- 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ కాంగ్రెస్కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగిలింది- మోహన్ లాల్ బడోలి
- ఈ విషయం ఎగ్జిట్ పోల్ సమయంలోనే చెప్పాను- మోహన్ లాల్ బడోలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మూడోసారి అధికారం దిశగా బీజేపీ దూసుకెళ్తుంది. బీజేపీకి స్పష్టమైన ఆధిక్యం ఉంది. ప్రస్తుతం 50 చోట్ల ఆధిక్యంలో బీజేపీ ఉండగా.. 35 స్థానాల్లో లీడ్ లో కాంగ్రెస్ ఉంది. ఈ క్రమంలో.. భారతీయ జనతా పార్టీ (బిజెపి) హర్యానా యూనిట్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలి మాట్లాడారు. కాంగ్రెస్కు రెండు రోజులు సంతోషం మాత్రమే మిగులుతుందని ఎగ్జిట్ పోల్ సమయంలోనే తాను చెప్పానని అన్నారు. వస్తున్న ఫలితాలను బట్టి బీజేపీ స్పష్టమైన మెజారిటీతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. 2047 వరకు బీజేపీ పాలన సాగుతుందని ఎగ్జిట్ పోల్లోనే చెప్పినట్లు బడోలి పేర్కొన్నారు. ఈ విధానాలకు ప్రజల మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ విజయం పట్ల పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ కార్యకర్తల శ్రమ ఫలించిందని అన్నారు.
Read Also: Omar Abdullah: జమ్మూకాశ్మీర్ తదుపరి సీఎంగా ఒమర్ అబ్దుల్లా! ఎన్సీ కూటమి చర్చలు
Also Read
- Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
- TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
- 7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
- Trump-Netanyahu: యుద్ధం ముగించాలని ట్రంప్.. మరింత తీవ్రం చేయాలని నెతన్యాహు? అసలు కారణం ఇదే!
చాలా ఎగ్జిట్ పోల్స్లో హర్యానా ఫలితాలు కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నాయి. అయితే ఫలితాలు అందుకు విరుద్ధంగా వెల్లడయ్యాయి. హర్యానాలో బీజేపీ అత్యధిక మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) మెజారిటీ మార్కును దాటి.. 50 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది, కాంగ్రెస్ 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అవుట్గోయింగ్ అసెంబ్లీలో బీజేపీకి 41 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. (ఇందులో 2022 ఉప ఎన్నికల్లో గెలిచిన ఆడమ్పూర్ సీటు కూడా ఉంది), కాంగ్రెస్కు 28, జేజేపీకి ఆరుగురు ఉన్నారు. హర్యానా లోఖిత్ పార్టీ, ఐఎన్ఎల్డికి ఒక్కొక్కరు ఉన్నారు. నలుగురు స్వతంత్రులు ఉండగా తొమ్మిది స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు.. 2019 కింగ్ మేకర్ దుష్యంత్ చౌతాలా తన సీటును కాపాడుకోలేకపోయాడు.
Read Also: CM Chandrababu: కేంద్ర మంత్రి కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ
తాజావార్తలు
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
TMC Rebellion: మమతా బెనర్జీకి కోలుకోలేని దెబ్బ.. పక్కా ప్లాన్తో పార్టీని వీడిన ఆ 20 మంది ఎంపీలు..
-
OTT Releases This Week : తెలుగు నుంచి మలయాళం వరకు… ఈవారం ఓటీటీలో మస్ట్ వాచ్ మూవీస్
-
KING 100 : దూసుకొస్తున్న కింగ్ 100.. రిలీజ్ డేట్ కూడా ఫిక్స్
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!