AP Elections Alliance: ఏపీలో కొత్త పొత్తులు..! ఢిల్లీలో మంతనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Elections Alliance: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎలక్షన్స్కి సమయం దగ్గర పడుతోన్న వేళ.. కొత్త పొత్తులు తెరపైకి వస్తున్నాయి.. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా వెళ్లాలనే నిర్ణయానికి వచ్చింది.. మరోవైపు ఇప్పటి వరకు జనసేన-బీజేపీ మధ్య పొత్తు ఉండగా.. తాము తెలుగుదేశం పార్టీతో కలసి వెళ్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించడం.. ఆ తర్వాత టీడీపీ-జనసేన ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగడం చూస్తున్నాం.. అయితే, టీడీపీ, జనసేనతో బీజేపీ కలిసి వస్తుందా? అనేది తేలాల్సి ఉంది.. ఇక, ఏపీలో “ఇండియా” పక్షాల కూటమి పొత్తులపై కసరత్తు మొదలైంది..
Read Also: Doctor Punches Patient: ఆపరేషన్ సమయంలో పేషెంట్పై దాడి చేసిన డాక్టర్.. వీడియో వైరల్..
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
కాంగ్రెస్, వామ పక్షాలు కలిసి పోటీ చేసే అంశంపై చర్చలు సాగుతున్నాయి. ఢిల్లీలోని ఏపీ భవన్ లో సుదీర్ఘ సమాలోచనలు చేశారు కాంగ్రెస్, లెఫ్ట్ నేతలు.. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మధ్య ఈ రోజు మంతనాలు జరిగాయి.. ఏపీలో రానున్న అసెంబ్లీ, లోకసభ ఎన్నికల పై కాంగ్రెస్, సీపీఐ సమాలోచనలు చేస్తుంది.. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు (కాంగ్రెస్, సీపీఐ).. సీపీఎంతో కలసి పోటీ చేసే అంశంపై చర్చలు సాగినట్టుగా చెబుతున్నారు.. “ఇండియా” కూటమి తరపున ఏపీలో పోటీ చేసి సత్తా చూపాలని యోచనలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఉన్నాయట.
Read Also: Venkatesh Maha: అన్న.. మళ్లొచ్చినాడు..
ఇక, ఢిల్లీలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఏపీలో పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి పొత్తులు తెలంగాణలో విజయం సాధించాయన్నారు.. ఇండియా కూటమికి అనుకూలంగా ఉండేవారితోనే మా పొత్తులు ఉంటాయన్న ఆయన.. బీజేపీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నష్టపోయాయి.. ప్రత్యేక హోదా సహా ఏదీ రాలేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు అన్యాయం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీయే అన్నారు. వారితో అంటకాగే పార్టీలకు కూడా ప్రజలు ఓటు వేయరనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు ఏపీలో వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసి వెళ్లాలి అన్నది మా ఉద్దేశం అన్నారు. టీడీపీని ఇండియా కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. దీంతో, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిసే పోటీ చేసే అవకాశాలు ఎంత వరకు ఉంటాయని చూడాలి.. కానీ, వారితో టీడీపీ-జనసేన కూడా కలిసి వస్తుందా? అనేది వేడిచూడాల్సిన అంశం.
తాజావార్తలు
-
Peddi Collections : బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ కలెక్షన్ల సునామీ.. ఏకంగా ఎన్ని కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాక్!
-
Maruti Suzuki Jimny: కొత్త జిమ్నీ వేరియంట్లు విడుదల.. 6 ఎయిర్బ్యాగ్లు, ADAS ఫీచర్లతో మరింత సురక్షితం
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!