UP: కుమార్తెను దెయ్యం ఆవహిస్తోందని పోలీసులకు ఫిర్యాదు..తర్వాత ఏమైందంటే..?
- ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ సంచలన కేసు
- రోజూ సాయంత్రం తమ కుమార్తెను దెయ్యం ఆవహిస్తోందని బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు
- భూతవైద్యం కూడా పనిచేయలేదన్న తల్లిదండ్రులు
- మానసిక వ్యాధి విభాగానికి తీసుకెళ్లమని సూచించిన పోలీసులు
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. రోజూ సాయంత్రం తమ కుమార్తెను దెయ్యం ఆవహిస్తోందని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం అవ్వగానే.. గృహోపకరణాలతో పాటు ఇంటి చుట్టూ పార్క్ చేసిన వాహనాల చక్రాలకు కూడా పంక్చర్ చేస్తుందని పేర్కొన్నారు. భూతవైద్యం కూడా పనిచేయలేదన్నారు. పోలీసుల సలహా మేరకు కుటుంబసభ్యులు బాలికతో కలిసి బీఆర్డీ మెడికల్ కాలేజీకి చేరుకోగా.. విషయం వేరేగా మారింది.
READ MORE: RSS: మహారాష్ట్రలో బీజేపీ ఫలితాలకు అజిత్ పవార్ ఎన్సీపీనే కారణం.. ఆర్ఎస్ఎస్ విమర్శలు..
Also Read
బెల్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న యువతి కుటుంబ సభ్యులు గత ఎనిమిది నెలలుగా చాలా ఇబ్బందులు పడుతున్నామని పోలీసులకు తెలిపారు. ఇదంతా విన్న పోలీసులు యువతిను మెడికల్ కాలేజీలోని మానసిక వ్యాధి విభాగానికి తీసుకెళ్లమని సూచించారు. కుటుంబీకులు ఆమెను మనోరోగచికిత్స విభాగం వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. ఆమె వైద్యులతో మాట్లాడటం మొదలు పెట్టింది. ఆమెకు ఓ సోదరుడు ఉన్న విషయాన్ని చెప్పింది.
READ MORE:Elon Musk: కాలిఫోర్నియాను విడిచిపెట్టనున్న మస్క్..కారణం ఇదే..
“యువతి సోదరుడు బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. వారి కోరిక మేరకు కుటుంబ సభ్యులు పెళ్లికి అంగీకరించారు. తన సోదరుడు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి సోదరుడు ఈ యువతి ప్రేమించుకున్నారు. అదే అబ్బాయితో తనకు పెళ్లి చేయాలని అడిగింది. కానీ యువతి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సంఘటన ఎనిమిది నెలల క్రితం జరిగింది. ఈ సంఘటన తరువాత.. కుమార్తె అనారోగ్యానికి గురికావడం ప్రారంభించింది. ఆమె ఎంచుకున్న అబ్బాయిని వివాహం చేసుకోవడానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో అమ్మాయి షాక్ కు గురైంది. అందుకే ఆమె అనుచితంగా ప్రవర్తిస్తోంది.” అని వైద్యులు గుర్తించారు.
READ MORE:IAS Puja Khedkar: తెరపైకి మరో వివాదం.. నకిలీ రేషన్ కార్డుతో ఏం చేసిందంటే..!
ఈ విషయమై బీఆర్డీ మెడికల్ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిల్ హయత్ఖాన్ మాట్లాడుతూ.. “కుటుంబ సభ్యులు తనకు నచ్చిన అబ్బాయితో పెళ్లికి అమ్మాయి నిరాకరించడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. ఈ వ్యాధిని డిస్సోసియేషన్ అంటారు. దీని కారణంగా, రోగికి శరీరంలో తిమ్మిరి ప్రారంభమవుతుంది. మనసు రకరకాల ఆలోచనలతో నిండిపోతుంది. అటువంటి పరిస్థితిలో, రోగి కొన్ని వింత కార్యకలాపాలను ఆనందించడం ప్రారంభిస్తారు.” అని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Janasena Party: కర్ణాటకలో జనసేన విస్తరణకు శ్రీకారం.. పార్టీలో భారీగా చేరికలు
-
Bank Holiday May 2026: మే నెలలో భారీగా బ్యాంకు సెలవులు.. మొత్తం ఎన్నిరోజులంటే?
-
Shreyas Iyer: “222 కొట్టినా ఓడామంటే బాధగా ఉంది”.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
-
Aditya Dhar: మరోసారి ‘ధురంధర్’ కాంబో రిపీట్ ..
-
Gayatri Gupta: ‘పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది’.. శివాజీపై గాయత్రి గుప్తా ఫైర్..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో