CM YS Jagan: జగన్ మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM YS Jagan: జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుంది.. జగన్ కి పేదలపై ఉన్నంత ప్రేమ.. దేశంలో ఏ నాయకుడికి లేదు, ఉండదు అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. జగన్ చేయలేని స్కీంలు.. చంద్రబాబు ఆయన బాబు కూడా చేయలేడని పేర్కొన్నారు.. శ్రీకాకుళం జిల్లాలో మేమంతా సిద్ధం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. 58 నెలలో 2 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ఇచ్చాం.. మీకు మంచి జరిగి ఉంటే.. మీ బిడ్డకు సైన్యంలా నిలవండి అని కోరారు. అనేక కుట్రలకు చంద్రబాబు దిగజారుతున్నాడు.. ఎలాంటి మార్పులు తీసుకోచ్చామో.. కనీసం, ఆత్మ విమర్శ చేసుకున్నారా చంద్రబాబు? అని ప్రశ్నించారు. దోచుకోవడానికి… పంచుకోవడానికి అధికారం కావలట.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసినా.. ఆయన చేసిన ఓక్క మంచైనా గుర్తుకు వస్తుందా? అని నిలదీశారు.
Read Also: UK Army: రద్దీ రోడ్లపై ఆగకుండా పరుగులు పెట్టిన ఆర్మీ గుర్రాలు.. వీడియో వైరల్..
Also Read
కరోనా కష్టంలో కూడా.. సాకులు చెప్పకుండా… బటన్ నొక్కడం ఆపలేదని గుర్తుచేశారు సీఎం జగన్.. మంచి చేసానన్న ఆత్మ సంతోషముతో మీ ముందు తలెత్తుకుని నిలబడ్డా.. 2024లో కూడా అమలు అయ్యేవే మేనిఫెస్టోలో పెడతాను అన్నారు. చంద్రబాబులా అబద్దపు హామీలు ఇవ్వను.. జగన్ మార్క్.. ప్రతి ఇంట్లో.. ప్రతీ గ్రామంలో కనిపిస్తుందన్నారు. బాబులా మోసపు వాగ్దానాలు చేయను.. మోసంను నిజాయితీతో నిరూపించడానికి నేను సిద్దం.. మీరు సిద్దమా..? అని ప్రశ్నించారు. బాబు లాంటి మోసగాడు కావాలా.. జగన్ లాంటి నిజాయితీపరపడు కావాలా? మూడు సార్లు సీఎంగా ఏ పేదవారికి సాయం చేయని చంద్రబాబు కావాలా..? తేల్చేకోవాలన్నారు. దత్తపుత్రుడు.. ఢిల్లీ నుండి.. తెచ్చుకున్న మోడి పాంప్లేట్ 2014 లో ఇంటింటికి పంపారు బాబు.. రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేసాడా ? పొదుపుసంఘాల రుణ మాఫీ చేసాడా? ఆడపిల్లలకు ఓక్క రూపాయైనా డిపాజిట్ చేసాడా? ఇంటింటికి ఉద్యోగం.. లేకపోతే నిరుద్యోగ భృతి.. ఇచ్చాడా ? అర్హులైన వారికి 3 సెంట్ల స్థలం అన్నాడు.. ఓక్క సెంటైనా ఇచ్చాడా? సింగపూర్ .. అభివృద్ధి అన్నాడు.. జరిగిందా ..? శ్రీకాకుళం, టెక్కలిలో ఓక్కటైనా అబివృద్ది జరిగిందా..? ఇదే ముగ్గురు కూటమి సూపర్ 6 , 7 అంటూ వస్తుంది.. ఇంటింటికి కేజి బంగారం.. కారు ఇస్తామంటున్నారు నమ్ముతారా ? ఇలాంటి మోసాల నుండి కాపాడటానికి.. పోరాటానికి మీరంతా సిద్దమా..? అని ప్రశ్నించారు జగన్..
Read Also: Asaduddin Owaisi: అల్లర్లు చెలరేగితే మీదే బాధ్యత.. ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
వాలంటీర్లు ఇంటికి రావాలన్నా.. లంచాలు లేని పాలన జరగగాలన్నా.. ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేయండి అని పిలుపునిచ్చారు సీఎం జగన్.. 175 అసెంబ్లీ.. 25 ఎంపీ స్థానాలకు ఒక్కటి కూడా తగ్గకూడదు అన్నారు. ఆలోచించండి .. ఇంట్లో వారి అభిప్రాయం తెలుసుకోండి.. ఎవరు అండగా ఉంటే వారితోనే అడుగు వేయండి.. ఎంపీ అభ్యర్థి గా.. తిలక్ ని నిలబెడుతున్నా.. తనకి అవకాశం ఇవ్వండి… ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడ శ్రీనుని పెడుతున్నా.. ఒక్క సారి మార్చండి.. శ్రీను మంచి చేసి చూపిస్తాడు.. మీ అందరి ఆశీస్సులు ఇవ్వండి అంటూ విజ్ఞప్తి చేశారు సీఎం వైఎస్ జగన్.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!