Asaduddin Owaisi: అల్లర్లు చెలరేగితే మీదే బాధ్యత.. ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ముస్లింల పట్ల ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్న ఓవైసీ విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్ చేసిన ‘సంపద పునర్విభన’ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన సంపదను చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచాలని అనుకుంటోంది. చివరకు మన తల్లలు, సోదరీమణుల మంగళసూత్రాలను కూడా దోచుకుంటారు’’ అని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని అన్నట్లు విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా దేశంలో ఎక్కడైనా అల్లర్లు జరిగితే దానికి ప్రధానమంత్రి బాధ్యత వహించాలి అని ఓవైసీ అన్నారు. ఇది ముస్లింలపై ద్వేషం నింపడమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. అతనను 2022 నుంచి దీన్ని చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఇది భారతదేశంలో అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా మారింది ఎంఐఎం చీఫ్ చెప్పారు.
Also Read
- Mamata Banerjee: మమత బుక్స్ లైబ్రరీల నుంచి ఔట్.. బీజేపీ సర్కార్ కీలక చర్య.!
- IMD Warning: ఎల్నినో వచ్చేసింది.. మాన్సూన్పై ఐఎండీ వార్నింగ్
- Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
- Saayoni Ghosh: 17 ఏళ్లకే హీరోయిన్గా.. అనతికాలంలో ఎంపీగా.. ట్రెండింగ్గా మారిన సయానీ ఘోష్ కథేంటి?
Read Also: Vemireddy Prashanthi Reddy: లక్ష మెజార్టీతో గెలుస్తున్నా.. ఆయన అవినీతి చరిత్ర బయట పెడతా..!
‘‘ ఆయన దేశంలోని 140 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి. వారిని(ముస్లింలనను)ఇలా బాధపెట్టడం, ద్వేషించడం.. రేపు దేశంలో ఎక్కడైనా అల్లర్లు చెలరేగితే దానికి నరేంద్రమోడీ బాధ్యత వహించాలి’’ అని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి’ పంచుతామని ప్రధాని మోదీ ఆరోపించిన కొద్ది రోజుల తర్వాత అసదుద్దున్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సందప పునర్విభజనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, ఇటీవల రాజస్థాన్ బన్స్వారాలో ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ల దగ్గర బంగారాన్ని లెక్కించి, దాని గురించిన సమాచారం తెలుసుకుని, ఆ ఆస్తిని పంచుతామని చెబుతోంది. ఎవరికి వారు పంచుతారు. మన్మోహన్ సింగ్ దేశ ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని చెప్పారు’’ అని ప్రధాని అన్నారు. ‘‘ఇంతకుముందు, వారి గ్రెస్) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, దేశ ఆస్తులపై ముస్లింల మొదటి హక్కు అని వారు చెప్పారు. అంటే ఈ ఆస్తి ఎవరికి పంచాలి? ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. చొరబాటుదారులకు పంపిణీ చేయబడుతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చొరబాటుదారులకు వెళ్లాలా? మీరు దీన్ని ఆమోదిస్తారా?’’ అని మోడీ ప్రజలను అడిగారు. అయితే, తమ మేనిఫెస్టోలో అలాంటి వాదనలు లేవని కాంగ్రెస్ తిరస్కరించింది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Rajnath Singh: మన దగ్గర ఏ రోగానికైనా మందుంది.. బ్రహ్మోస్ ఉంది.. రాజ్నాథ్సింగ్ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli’s Replacement: విరాట్ కోహ్లీ స్థానంలో కాటేరమ్మ కొడుకుకే ఛాన్స్.. ఇక పూనకాలే..
-
Revanth Reddy on Pawan Kalyan: పవన్ కల్యాణ్ రావచ్చు.. పోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు.. సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Gopichand34: గోపీచంద్ సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్న యాక్షన్ కొరియోగ్రాఫర్! మూవీ టైటిల్ ఇదే..
-
Sky Burial: విచిత్రమైన అంత్యక్రియలు.. ఆ దేశంలో ఇప్పటికీ కొనసాగుతున్న భయంకరమైన సంప్రదాయం!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!