Asaduddin Owaisi: అల్లర్లు చెలరేగితే మీదే బాధ్యత.. ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi: ముస్లింల పట్ల ప్రధాని నరేంద్రమోడీ వైఖరిని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్న ఓవైసీ విమర్శించారు. ఇటీవల కాంగ్రెస్ చేసిన ‘సంపద పునర్విభన’ వ్యాఖ్యల్ని ఉద్దేశిస్తూ, రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ మాట్లాడారు. ‘‘ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మన సంపదను చొరబాటుదారులు, ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి పంచాలని అనుకుంటోంది. చివరకు మన తల్లలు, సోదరీమణుల మంగళసూత్రాలను కూడా దోచుకుంటారు’’ అని అన్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలు ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి ప్రధాని అన్నట్లు విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యల ఫలితంగా దేశంలో ఎక్కడైనా అల్లర్లు జరిగితే దానికి ప్రధానమంత్రి బాధ్యత వహించాలి అని ఓవైసీ అన్నారు. ఇది ముస్లింలపై ద్వేషం నింపడమే తప్ప మరొకటి కాదని విమర్శించారు. అతనను 2022 నుంచి దీన్ని చేస్తున్నారని ఆరోపించారు. దేశంలో 17 కోట్ల మంది ముస్లింలు ఉన్నారని, ఇది భారతదేశంలో అతిపెద్ద మైనారిటీ కమ్యూనిటీగా మారింది ఎంఐఎం చీఫ్ చెప్పారు.
Also Read
- Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
- Cockroach Janta Party: "బొద్దింకల పార్టీ"పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
- Kolkata: మమత కట్టడాలపై బుల్డోజర్ చర్య.. సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ శిల్పం తొలగింపు
- Modi-Marco Rubio: ప్రధాని మోడీతో మార్కో రూబియో భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
Read Also: Vemireddy Prashanthi Reddy: లక్ష మెజార్టీతో గెలుస్తున్నా.. ఆయన అవినీతి చరిత్ర బయట పెడతా..!
‘‘ ఆయన దేశంలోని 140 కోట్ల ప్రజలకు ప్రధానమంత్రి. వారిని(ముస్లింలనను)ఇలా బాధపెట్టడం, ద్వేషించడం.. రేపు దేశంలో ఎక్కడైనా అల్లర్లు చెలరేగితే దానికి నరేంద్రమోడీ బాధ్యత వహించాలి’’ అని ఓవైసీ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ‘ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి’ పంచుతామని ప్రధాని మోదీ ఆరోపించిన కొద్ది రోజుల తర్వాత అసదుద్దున్ ఒవైసీ ఈ వ్యాఖ్యలు చేశారు.
సందప పునర్విభజనపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు, ఆ పార్టీ మేనిఫెస్టోను ప్రస్తావిస్తూ, ఇటీవల రాజస్థాన్ బన్స్వారాలో ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ కాంగ్రెస్ మేనిఫెస్టోలో అమ్మానాన్నలు, అక్కాచెల్లెళ్ల దగ్గర బంగారాన్ని లెక్కించి, దాని గురించిన సమాచారం తెలుసుకుని, ఆ ఆస్తిని పంచుతామని చెబుతోంది. ఎవరికి వారు పంచుతారు. మన్మోహన్ సింగ్ దేశ ఆస్తులపై ముస్లింలకు మొదటి హక్కు ఉందని చెప్పారు’’ అని ప్రధాని అన్నారు. ‘‘ఇంతకుముందు, వారి గ్రెస్) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, దేశ ఆస్తులపై ముస్లింల మొదటి హక్కు అని వారు చెప్పారు. అంటే ఈ ఆస్తి ఎవరికి పంచాలి? ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి పంచుతారు. చొరబాటుదారులకు పంపిణీ చేయబడుతుంది. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చొరబాటుదారులకు వెళ్లాలా? మీరు దీన్ని ఆమోదిస్తారా?’’ అని మోడీ ప్రజలను అడిగారు. అయితే, తమ మేనిఫెస్టోలో అలాంటి వాదనలు లేవని కాంగ్రెస్ తిరస్కరించింది. బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది.
తాజావార్తలు
-
Cockroach Janta Party: “బొద్దింకల పార్టీ”పై ఉక్కుపాదం.. అన్ని అకౌంట్లు క్లోజ్..
-
Modi-Marco Rubio: సేవా తీర్థ్లో మోడీతో మార్కో రూబియో భేటీ.. గంటకుపైగా కీలక చర్చలు
-
Telangana Exhibitors Association: ఎగ్జిబిటర్స్ కీలక నిర్ణయం.. ‘పెద్ది’ సినిమానే కాదు ఏ సినిమానైనా పర్సంటేజ్ కావాల్సిందే..!
-
Khatti Meethi Dal Recipe: తీపి + పులుపు మ్యాజిక్.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడిగే గుజరాతీ కట్టి మీఠీ దాల్.!
-
Girl Elopes With Lover: ఇంట్లో రక్తం చల్లి మిస్సింగ్ డ్రామా.. అసలు నిజం వింటే షాక్..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!