Addanki Dayakar : సెంటు భూమి ఇవ్వని బీజేపీ దొంగనాటకాలు ఆడుతుంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Addanki Dayakar : ఎటువంటి పరిస్థితుల్లోనూ సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులకు నష్టం కలిగించే ప్రయత్నం చేయలేదని, భవిష్యత్తులో కూడా చేయబోరని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పష్టం చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (HCU) పక్కన ఉన్న సర్వే నెంబర్ 25లో గల 400 ఎకరాల భూమిని సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో పోరాటం చేసి సాధించారని అద్దంకి దయాకర్ తెలిపారు. చట్టాలను గౌరవిస్తూ, న్యాయపరమైన మార్గంలోనే భూమిని రాబట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేసిందని చెప్పారు. ఈ భూమిని అభివృద్ధి చేసి రాష్ట్రానికి ఆదాయం తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్, కేటీఆర్ ఈ భూములను వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించాలని చూశారని, అప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిందని అద్దంకి దయాకర్ గుర్తుచేశారు. అందువల్లే ఈ భూమి ఇప్పటికి ప్రభుత్వ ఆధీనంలో ఉందని, విద్యార్థులకు నష్టం కలగకుండా రేవంత్ రెడ్డి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు. 1970లలో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ HCU కోసం 2500 ఎకరాల భూమిని కేటాయించారని అద్దంకి దయాకర్ తెలిపారు. కానీ ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు విద్యార్థుల భావోద్వేగాలను రెచ్చగొట్టి తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాయని మండిపడ్డారు.
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- Shreyas Iyer: వైభవ్ను తీసుకోకపోవడం తప్పే.. ఎట్టకేలకు దారిలోకి వచ్చేసిన శ్రేయాస్ అయ్యర్..
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఈ విషయాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్నాయని అద్దంకి దయాకర్ ఆరోపించారు. విద్యార్థులను సెంటిమెంట్తో రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రభుత్వంపై నెగటివ్ ప్రచారం చేయడమే వారి లక్ష్యమని అన్నారు. బీఆర్ఎస్ అనుబంధ సంఘాలు బ్యాక్గ్రౌండ్లో జేసీబీలు, వన్యప్రాణులు ఉన్నట్లు సోషల్ మీడియాలో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రతీ విషయాన్ని రాజకీయం చేసి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలనే కుట్ర బీజేపీ, బీఆర్ఎస్ కలసికట్టుగా చేస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారని అద్దంకి దయాకర్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందే రాష్ట్రంలో భూములు ఆదాయ వనరుగా మారాలని ప్రభుత్వం భావిస్తోందని, విద్యార్థులకు ఏమాత్రం నష్టం కలగకుండా ప్రభుత్వ విధానాలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు.
Supreme Court: “బుల్డోజర్ యాక్షన్”.. యూపీ సర్కార్పై సుప్రీం తీవ్ర ఆగ్రహం..
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!