CM KCR: మెదక్ కలెక్టరేట్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ మెదక్ జిల్లాలో పర్యటిస్తున్నారు. మొదటగా జిల్లాకు చేరుకున్న కేసీఆర్ ముందుగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ఏర్పాటు చేసిన దేవుళ్ల చిత్రపటాల దగ్గర పూజ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు అక్షింతలు వేసి ఆయనను ఆశీర్వదించారు. ఆ తర్వాత జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ ఓపెనింగ్ చేశారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్రావు, హోంమంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతికుమారి, డీజీపీ అంజన్ కుమార్ యాదవ్, తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా నేతలు, తదితరులు పాల్గొన్నారు.
Read Also: Shridhar Babu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలం
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
మెదక్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. 32 ఎకరాల విస్తీర్ణంలో 67.07 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనం.. 2018 మే 9న జిల్లా సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణానికి సీఎం భూమి పూజ చేశారు. జీ ప్లస్ 2 పద్దతిలో నాలుగు బ్లాకులుగా కలెక్టరేట్ నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జిల్లా కలెక్టర్, ఇద్దరు అడిషనల్ కలెక్టర్ నివాసాలతో పాటు 8 మంది జిల్లా అధికారులకు గృహాలు నిర్మించామని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో దివ్యంగులకు 4016 రూపాయల పెన్షన్ పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. మెదక్ జిల్లాలో టెకె దార్ పెన్షన్లు కేసీఆర్ పంపిణీ చేశారు.
Read Also: Delhi Airport: రెండు విమానాలకు ఒకేసారి ల్యాండింగ్, టేకాఫ్ క్లియరెన్స్.. తప్పిన పెనుప్రమాదం
గతంలో తెలంగాణలో ఉన్న కలెక్టరేట్ లను చూస్తే దారుణంగా ఉన్నాయని.. వాటిని ఇప్పుడు తిరిగి నిర్మించుకోవడం వల్ల ప్రజలకు ఒకే దగ్గర అన్ని శాఖల అధికారులు అందుబాటులో ఉంటారని సీఎం కేసీఆర్ తెలిపారు. అలాగే మనం రాష్ట్రంలో అభివృద్ది జరుగుతుందో లేదో వాళ్లకు కనబడటం లేదని ప్రతిక్షాలపై ఆయన పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!