Shridhar Babu: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలం
జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోని గోదావరి నది తీరంలో గల బ్రాహ్మణ సంఘ భవనంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీధర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఉద్యోగ కల్పనలో విఫలం అయ్యారు అని విమర్శించారు. లక్ష రూపాయల లోన్ మాఫీ అనేది ఒక మోసమని మిత్తి కూడా మాఫీ చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు.
Read Also: Pushpa 2: జాలిరెడ్డి ఈసారి అంతకు మించి చూపిస్తాడట
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్లతో ఏర్పడ్డ తెలంగాణలో యువతకు ఉద్యోగాలు కల్పించకుండా ఎన్నికలకు ముందు ఇచ్చిన నిరుద్యోగ భృతి అందజేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది అని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దళిత బంధు పథకం రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లోని అర్హులైన దళితులందరికీ అందజేయాలి.. వరి ధాన్యం కొనుగోల్లో తప్పతాలతో క్వింటాలుకు 10 కిలోల వరకు తరుగు తీసి రైతులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆయన విమర్శించారు.
అంతర్జాతీయ చమురు బ్యారెల్ ధరలు తగ్గినప్పటికీ సిలిండర్ ధర విపరీతంగా కేంద్ర ప్రభుత్వం పెంచింది అని శ్రీధర్ బాబు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో స్కామ్ జరిగిందని దీంతో చదువుకున్న విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లింది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి తీర ప్రాంత రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదు.. కానీ మెగా కృష్ణారెడ్డి జేబులు నింపడానికి ఉపయోగపడింది అని శ్రీధర్ బాబు ఆరోపించారు.
Read Also: Eesha Rebba : ఆరెంజ్ డ్రెస్ లో కిర్రాక్ పోజులిస్తూ రెచ్చగొడుతుందిగా..
ఎన్నికలకు ముందు ధర్మపురి దేవస్థాన అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు కేటాయిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు వన్ పర్సెంట్ నిధులను కూడా డెవలప్మెంట్ కోసం విడుదల చేయలేదు అని దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం సామాజిక సమన్యాయంతో ముందుకు వెళుతుందని.. సామాజిక తెలంగాణ కొరకు జాతీయ కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో