తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇటీవల అనారోగ్యం కారణంగా దాదాపు 20 రోజులు విశ్రాంతి తీసుకుని.. ఇప్పుడు కోలుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అన్ని పార్టీల కంటే ముందే ఒకేసారి 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ప్రచారంలోనూ అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు.
Read Also: National Award Winners: ఇది రా టాలీవుడ్ అంటే.. ఈ ఒక్క ఫోటో చరిత్రలో నిలిచిపోతుంది
అయితే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో ఉండగానే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు రెండు మూడు చోట్ల బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగా సభల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇవాళ మొదటగా సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. ఇక, ఈ సభ అనంతరం సిద్దిపేటలో తల పెట్టిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
Read Also: Leo: లియో టైటిల్ సెటిల్ మెంట్.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే.. ?
ఇక, సీఎం కేసీఆర్ సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలు దేరారు. అయితే, సిద్దిపేట నుంచి తిరుగు ప్రయాణమైన కేసీఆర్ మార్గ మధ్యంలో ‘సోనీ ఫ్యామిలీ దాబా’లో కాసేపు ఆగారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో కేసీఆర్ చాయ్ తాగుతు కనిపించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీ దామోదర్ రావు, ఎంపీ, దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వీరందరూ ఆ దాబాలో టీ తాగుతూ.. కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం, హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అయితే, సీఎం కేసీఆర్ ధాబాలో చాయ్ తాగే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.