CM KCR: బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో చాయ్ తాగిన సీఎం కేసీఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు మరి కొన్ని రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇటీవల అనారోగ్యం కారణంగా దాదాపు 20 రోజులు విశ్రాంతి తీసుకుని.. ఇప్పుడు కోలుకున్న తర్వాత ఎన్నికల ప్రచారంలో వేగం పెంచారు. అన్ని పార్టీల కంటే ముందే ఒకేసారి 115 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్.. ప్రచారంలోనూ అదే దూకుడుతో ముందుకు సాగుతున్నారు.
Read Also: National Award Winners: ఇది రా టాలీవుడ్ అంటే.. ఈ ఒక్క ఫోటో చరిత్రలో నిలిచిపోతుంది
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
అయితే, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇంకా అభ్యర్థుల వేటలో ఉండగానే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోజుకు రెండు మూడు చోట్ల బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగా సభల్లో పాల్గొంటున్నారు. ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ప్రచారంలో భాగంగా కేసీఆర్ ఇవాళ మొదటగా సిరిసిల్లలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరయ్యారు. ఇక, ఈ సభ అనంతరం సిద్దిపేటలో తల పెట్టిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
Read Also: Leo: లియో టైటిల్ సెటిల్ మెంట్.. ఎన్ని లక్షలు ఇచ్చారంటే.. ?
ఇక, సీఎం కేసీఆర్ సిద్దిపేటలో నిర్వహించిన బహిరంగ సభ ముగిసిన అనంతరం తిరిగి హైదరాబాద్ కు బయలు దేరారు. అయితే, సిద్దిపేట నుంచి తిరుగు ప్రయాణమైన కేసీఆర్ మార్గ మధ్యంలో ‘సోనీ ఫ్యామిలీ దాబా’లో కాసేపు ఆగారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి దాబాలో కేసీఆర్ చాయ్ తాగుతు కనిపించారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హరీశ్ రావు, ఎంపీ దామోదర్ రావు, ఎంపీ, దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. వీరందరూ ఆ దాబాలో టీ తాగుతూ.. కాసేపు మాట్లాడుకున్నారు. అనంతరం, హైదరాబాద్కు తిరిగి వచ్చారు. అయితే, సీఎం కేసీఆర్ ధాబాలో చాయ్ తాగే ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!